ఇక మరిన్ని వైద్య సేవలు
నరసరావుపేటలోని ఏరియా ప్రభుత్వ వైద్యశాల కలెక్టరేట్ రోడ్డులోని నూతన భవనంలోకి మార్చేందుకు అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. పాత భవనంలో వసతులు చాలక లింగంగుంట్ల కాలనీలోని జల వనరుల శాఖకు చెందిన స్థలంలో భవనాన్ని నిర్మించారు.
ఆధునిక చికిత్సలకు ఏర్పాట్లు
నరసరావుపేటలోని ఏరియా ప్రభుత్వ వైద్యశాల కలెక్టరేట్ రోడ్డులోని నూతన భవనంలోకి మార్చేందుకు అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. పాత భవనంలో వసతులు చాలక లింగంగుంట్ల కాలనీలోని జల వనరుల శాఖకు చెందిన స్థలంలో భవనాన్ని నిర్మించారు. తాజాగా శాశ్వత ప్రాతిపదికన ఏరియా ప్రభుత్వ వైద్యశాలలోని పలు విభాగాలను నూతన భవనంలోకి తరలించనున్నారు. ఇప్పటికే కలెక్టర్ శివశంకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైద్యాధికారులు పలు మార్లు చర్చించి తరలింపునకు సంబంధించిన ప్రణాళిక తయారు చేసి అమలు చేశారు. వైద్యశాల ప్రారంభం అంశాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. మంత్రి సమయం ఇస్తే ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
నూతన భవనంలో ఇవి కూడా..
పల్నాడు రోడ్డులోని ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న పలు విభాగాలు నూతన భవనంలోకి తరలించారు. అక్కడ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, డెర్మటాలజీ, ఫిజియోథెరపీ, దంత వైద్యం, ఈఎన్టీ విభాగాలు నూతన భవనంలో అందుబాటులోకి రానున్నాయి. అత్యవసర వైద్య విభాగంతో పాటు ఎక్స్రే, ఫార్మసీ, వసతులు కూడా ఏర్పాటు చేస్తారు. కిడ్నీ బాధితులకు డయాలసిస్ కేంద్రాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేయనున్నారు. ఇన్ షేషెంట్లకు 150 పడకలు అందుబాటులోకి తెచ్చారు. శస్త్రచికిత్స చేసేందుకు నాలుగు థియేటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి అత్యవసర వైద్యసేవలకు, ఒకటి ఆప్తమాలజీకి, జనరల్ సర్జరీకి రెండు కేటాయించారు. దీనికి తోడు రెండు ప్రాణవాయువు ఉత్పత్తి కేంద్రాలను సిద్ధం చేశారు. రెండు ఉత్పత్తి కేంద్రాలు 2000 ఎల్పీఎం సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వైద్యశాల సూపరింటెండెంట్ కార్యాలయం, జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త కార్యాలయం కూడా నూతన భవనంలో ఉంటాయి. పాత భవనంలో ప్రసూతి విభాగం, చిన్న పిల్లల విభాగం, మాతా శిశు సంరక్షణ విభాగం, ఏఆర్టీ సెంటర్, బ్లడ్బ్యాంకు, తదితర సేవలు నిర్వహించనున్నారు.
రూ.20 లక్షలతో సౌకర్యాలు
కొత్త భవనం మరమ్మతులు వసతుల కల్పనకు రూ.20 లక్షలు వ్యయం చేశారు. వైద్యశాల నిధులు రూ.7 లక్షలు, దాతలు అందించిన రూ.లక్ష, పురపాలక సంఘం సహకారంతో కొన్ని పనులు చేయించారు. కొవిడ్ సమయంలో కొత్త భవనంలోనే వైద్య సేవలందించిన నేపథ్యంలో మరుగుదొడ్ల మరమ్మతులు, డ్రెయిన్ల నిర్మాణం చేపట్టారు. ప్లోరింగ్ సైతం చాలా వరకూ మార్చారు. మార్చురీ, తదితర వసతులకు ప్రతిపాదనలను ఇప్పటికే అధికారులు పంపారు. ఆపరేషన్ థియేటర్లకు స్థానిక వైద్యులు ఓటీ లైట్లను రూ.4 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు.
దాతల సహకారంతో మరిన్ని వసతులు
పల్నాడు జిల్లాకు తలమానికంగా భావించే ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు మరిన్ని వసతులు కల్పించేందుకు సంస్థలు ముందుకు వస్తున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వ్యాధి నిర్ధారణలో కీలకమైన సీటి స్కాన్ యంత్రాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది. దీని కొనుగోలుకు రూ.1.75 కోట్లు అవుతుంది. గ్రిడ్ అధికారులు సంసిద్ధత వ్యక్తం చేసి కలెక్టర్కు ప్రతిపాదన చేశారు. ఆయన ప్రభుత్వానికి ప్రతిపాదనకు పంపారు. దీంతో సిటీ స్కానింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఇండియన్ రెడ్క్రాస్ సంస్థ ప్రతినిధులు కొత్తగా కాంపోనెంట్ బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేసేందుకు వైద్యాధికారులకు ప్రతిపాదనలు చేశారు. ఇప్పటి వరకూ అవసరమైన వారికి రక్తం ఇచ్చే వారు. కొత్త దానిలో రోగికి అవసరమైన ప్లేట్లెట్లు విడిగా ఇచ్చే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. తద్వారా ఒక యూనిట్ రక్తం నుంచి ముగ్గురు రోగులకు అవసరమైన కాంపోనెంట్స్ అందించేందుకు వీలు కలుగుతుంది. ఇందుకు రెడ్క్రాస్ సంస్థ రూ.కోటి వ్యయం చేయనుంది.
జిల్లా వైద్యశాలగా ఉన్నతీకరణకు ప్రతిపాదనలు
నరసరావుపేటలోని ఏరియా ప్రభుత్వ వైద్యశాలను జిల్లా వైద్యశాలగా ఉన్నతీకరించాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. తద్వారా సూపర్స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులో వస్తాయి. గుండె సంబంధిత వ్యాధులు, న్యూరాలజీకి శస్త్రచికిత్స చేసేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం అన్ని విభాగాలకు సంబంధించిన వైద్యులు అందుబాటులో ఉన్నారు. వారంలోగా నూతన భవనంలో వైద్యసేవలు ప్రారంభిస్తాం. - డాక్టర్ బీవీ రంగారావు, పల్నాడు జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త, నరసరావుపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..