సంప్రదాయంగా పునీతశౌరి తిరునాళ్ల
వట్టిచెరుకూరు మండలంలోని ముట్లూరు గ్రామంలో జరుగుతున్న పునీతశౌరి తిరునాళ్ల సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది.
విద్యుద్దీపాల వెలుగులో పునీతశౌరి దేవాలయం
ముట్లూరు (వట్టిచెరుకూరు), న్యూస్టుడే: వట్టిచెరుకూరు మండలంలోని ముట్లూరు గ్రామంలో జరుగుతున్న పునీతశౌరి తిరునాళ్ల సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది. శౌరివారు మరణించిన 467వ వార్షికోత్సవంగా క్రైస్తవ సోదరులు నవంబరు 24 నుంచి ఒత్తుల సమర్పణ వెలుగులతో విజ్ఞాపన ప్రార్థనలు, మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం తొలిసారిగా జరిగే క్రైస్తవుల తిరునాళ్లగా గుర్తింపు పొందడంతో పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడకు హాజరవుతున్నారు.
3న గుంటూరు పీఠాధిపతుల రాక.. 3వ తేదీన నవదిన ముగింపు ప్రార్థనలలో జరిగే దివ్య పూజాబలితో ముగుస్తున్నాయి. జిల్లా క్రీస్తుమత పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగ్యయ్య రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే మత గురువులతో సమష్టి పూజాబలి ప్రార్థనలు ప్రారంభించనున్నారు. ఇదే రోజున తేరు ప్రదక్షిణ సంప్రదాయంగా నిర్వహించేందుకు పునీతశౌరి పుణ్యక్షేత్రం విచారణ మతగురువు మార్నేని దిలిప్కుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు. మహోత్సవాలను పురస్కరించుకుని పుణ్యక్షేత్రం ప్రహరీకి నూతనంగా దాతలు నిర్మించిన స్వాగత ద్వారాలను భాగ్యయ్య శనివారం ప్రారంభించనున్నారు. ప్రాంగణంలో నిర్మించిన పరిశుద్ధ లూర్థుమాత గృహ సముదాయాన్ని కూడా ఆయన ఆశీర్వదించి ప్రార్థనలు నిర్వహించనున్నారని విచారణ మత గురువు మార్నేని దిలిప్కుమార్ తెలిపారు. మహిళల చెక్క భజనలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతికూల వాతావరణం.. చంద్రబాబు మాచర్ల పర్యటన రద్దు
[ 10-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు మాచర్ల పర్యటన రద్దయింది. -
పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ ఆదేశాలు
[ 10-05-2024]
పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ ఆదేశాలు జారీ చేసింది. -
వైకాపా ప్రలోభాల పర్వం.. మంగళగిరిలో రూ.25కోట్లు సీజ్
[ 10-05-2024]
పోలింగ్ దగ్గర పడుతున్న వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. -
సూపర్-6తో భవిష్యత్తు గ్యారెంటీ
[ 10-05-2024]
‘అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ఇక్కడ నివసిస్తున్న వివిధ వృత్తుల వారు చేసే పనికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఆదాయం పెరిగేలా చేస్తాం. ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసి అక్కడ పని చేసుకోవడానికి అన్ని వసతులు.. -
ఈ అరాచకాల్ని.. ఆపేదెవరు..?
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు మూడు రోజుల సమయమే ఉంది. శనివారం సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. సోమవారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పల్నాడులో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం కత్తిమీదసాములా మారింది. -
అన్నవి హామీలే.. కర్షకులకు కష్టాలే
[ 10-05-2024]
జిల్లాలో పంటలు చేతికొచ్చే వేళ మిగ్జాం తుపానుతో రైతులు సర్వం కోల్పోయారు. కోత కోసి ఓదెల మీద ఉన్న వరి పనలు తడిచిపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలకొరిగి నష్టం జరిగింది. -
ప్రతీ నెలా నిరీక్షణే.. జీవితకాలం నష్టమే..
[ 10-05-2024]
2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2022లో పీఆర్సీని ప్రకటించారు. 11వ పీఆర్సీలో ఫిట్మెంట్ 23 శాతానికి ప్రభుత్వం తగ్గించడంతో విశ్రాంత ఉద్యోగుల పింఛన్లో 4 శాతం కోత పడింది. -
బరితెగించిన వైకాపా
[ 10-05-2024]
గుంటూరు నగరంలో వైకాపా తరఫున బరిలో నిలిచిన అభ్యర్థి బరి తెగించారు. ప్రజల నుంచి మద్దతు లేదని గుర్తించిన సదరు వ్యక్తులు అడ్డదారుల్లోనైనా గెలవాలనే లక్ష్యంతో సామ, దాన, దండోపాయాలు అవలంబిస్తున్నారు. -
నా సోదరి మాధవిని గెలిపించండి
[ 10-05-2024]
గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన నా సోదరి గళ్లా మాధవిని గెలిపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. జనసేన కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె పవన్ కల్యాణ్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. -
ఐఎఫ్ఎస్కు నడింపల్లి యువతి ఎంపిక
[ 10-05-2024]
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో చెరుకుపల్లి మండలం నడింపల్లికి చెందిన వెన్నం అనూష 73వ ర్యాంక్ సాధించారు. ఎన్నో ప్రయత్నాల తరువాత ఆమె ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. -
అంతర్ జిల్లాల బ్యాలట్లు గల్లంతు
[ 10-05-2024]
పోస్టల్ బ్యాలట్ మొదలైనప్పటి నుంచి అంతర్ జిల్లాల ఉద్యోగుల విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. తొలి రోజు నుంచి బ్యాలట్ల కొరత ఉందని చెబుతూనే.. -
మంగళగిరి ప్రజలూ నా కుటుంబ సభ్యులే
[ 10-05-2024]
మంగళగిరి ప్రజలు తనకు సొంత కుటుంబ సభ్యులతో సమానమని కూటమి తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరి మండలం కురగల్లు, నిడమర్రు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తల్లి నారా భువనేశ్వరితో కలసి గురువారం ‘రచ్చబండ’ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
దోశలో ఇనుప వాషర్ బోల్ట్
[ 10-05-2024]
గుంటూరులోని కొందరు హోటల్స్ నిర్వాహకులు ఆహార పదార్థాల తయారీలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గురువారం కొరిటెపాడులోని ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్లిన వినియోగదారుడికి ఎదురైన సంఘటనే తార్కాణం. -
రోశయ్య, ఆళ్ల మాట తప్పారు
[ 10-05-2024]
పెదకాకాని హజరత్ సయ్యద్ బాజిషహీద్ అవులియా బాబా దర్గా నిర్వహణ బాధ్యతల విషయంలో ఎమ్మెల్యేలు రోశయ్య, ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట తప్పారు. ఈ కారణంగా ముత్తవల్లీ, ముజావర్ల వంశాలకు చెందిన 200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. -
‘వైకాపా అభ్యర్థులను అన్ని చోట్లా ఓడించండి’
[ 10-05-2024]
దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ దళితుల్ని నిలువునా వంచించారని ప్రభుదా రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావ్,
తాజా వార్తలు (Latest News)
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్