icon icon icon
icon icon icon

Chandrababu: ప్రతికూల వాతావరణం.. చంద్రబాబు మాచర్ల పర్యటన రద్దు

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు మాచర్ల పర్యటన రద్దయింది.

Published : 10 May 2024 17:28 IST

అమరావతి: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు మాచర్ల పర్యటన రద్దయింది. ప్రతికూల వాతావరణం కారణంగా మాచర్ల ఎయిర్‌ రూట్‌ క్లిష్టంగా ఉందని,  అటవీ ప్రాంతం మీదుగా వెళ్లాల్సి ఉన్నందున ప్రయాణం సాగించలేమని పైలట్‌లు చెప్పడంతో రద్దు చేసుకున్నారు. ఒంగోలు వెళ్లాలన్నా రూట్‌ డైవర్షన్‌ తీసుకుంటేనే సాధ్యమని చెప్పినట్టు సమాచారం. దీంతో నేరుగా ఒంగోలు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లోనే ఒంగోలు బయల్దేరారు.

మాచర్ల ప్రజలు అర్థం చేసుకోవాలి: చంద్రబాబు

వాతావరణం ఇబ్బంది కారణంగా మాచర్ల సభ రద్దయిందని, ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మాచర్ల వెళ్లేందుకు అన్ని అవకాశాలు పరిశీలించినా సాధ్యపడలేదన్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బ్రహ్మానందరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. విజ్ఞులైన పల్నాడు ప్రజలు రౌడీ యిజానికి ఓటుతో గట్టి గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img