‘స్పందనలో అధికారులు ఉండాల్సిందే’
జిల్లా స్థాయి అధికారులు ఎన్ని పనులన్నా ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో పాల్గొనాల్సిందేనని.. ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎవరైనా గైర్హాజరయితే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి పేర్కొన్నారు.
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి
కలెక్టరేట్ (గుంటూరు), న్యూస్టుడే: జిల్లా స్థాయి అధికారులు ఎన్ని పనులన్నా ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో పాల్గొనాల్సిందేనని.. ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎవరైనా గైర్హాజరయితే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ హాలులో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. స్పందన కార్యక్రమం మధ్యలోనే ఓ శాఖ జిల్లా అధికారి వెళ్లిపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల సమావేశాలున్నా స్పందనకు రావాల్సిందేనని, ఏదైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అర్జీలను సక్రమంగా పరిష్కరించాలని సూచించారు. ఏపీ సేవ దరఖాస్తులు నిర్దేశిత గడువు లోపు వెంటనే పరిష్కరించాలని, గడువు దాటితే ప్రతి దరఖాస్తుకు రోజుకు రూ.వంద జరిమానా వేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. అర్జీల పరిష్కారంపై సంతృప్తి స్థాయి వివరాలను సేకరిస్తున్నందున అర్జీలు హేతుబద్ధంగా పరిష్కరించాలన్నారు. సోమవారం స్పందన కార్యక్రమంలో 136 అర్జీలు నమోదయ్యాయి. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారి, డీఆర్వో కె.చంద్రశేఖర్రావు, ప్రత్యేక ఉప కలెక్టర్ ఎం.వెంకటశివరామిరెడ్డి, సహాయ కలెక్టర్ శివనారాయణశర్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పీహెచ్సీ వైద్యాధికారి అధికార దుర్వినియోగం
తుళ్లూరు పీహెచ్సీ వైద్యాధికారి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ మండ్రు శ్రీకర్ప్రమోద్ సోమవారం స్పందనలో వినతిపత్రం అందించారు. స్థానికంగా ఉండాల్సి ఉన్నా వైద్యాధికారి విజయవాడ రూరల్ నుంచి రాకపోకలు చేస్తున్నారని, ఎఫ్ఆర్ఎస్ కూడా ఇంటి వద్ద నుంచే వేస్తున్నారని, పీహెచ్సీలోని ఉద్యోగులు సైతం అదేవిధంగా హాజరు వేస్తున్నారన్నారు. ఇక్కడే పని చేసిన ఓ ఉద్యోగి గతేడాది జులై, ఆగస్టు నెలల్లో విధులకు గైర్హాజరయ్యారని, అయినా వారు విధుల్లో ఉన్నట్లు రిజిస్టర్లో వైట్నర్తో హాజరు వేస్తూ ప్రభుత్వ నిధులు జీతం రూపంలో దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. అధికారులు దీనిపై విచారించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
హమాలీలకు కూలి ఇవ్వాలని వినతి
గుంటూరు నగరం, రూరల్, పెదకాకాని, వట్టిచెరుకూరు, మేడికొండూరు, ఫిరంగిపురం, మంగళగిరి మండలాల్లో నిత్యవసర సరకులు అందించే ముఠా కార్మికులకు కూలి ఇవ్వాలని కోరుతూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో స్పందనలో వినతిపత్రం అందించారు. గతంలో డీలర్స్ కూలి ఇచ్చేవారని, గత నెలలో ఇవ్వలేదని హమాలీలు వినతిలో పేర్కొన్నారు. ప్రభుత్వమే ఇస్తుందని చెబుతున్నారని, అధికారులు స్పందించి తమకు కూలి ఇప్పించాలని హమాలీలు కోరారు. వినతిపత్రం అందించిన వారిలో సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, హమాలీలు ఎ.కోటయ్య, ఎస్.రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు.
కొలకలూరుకు రెగ్యులర్ కార్యదర్శిని నియమించాలి
తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శిని నియమించాలని కోరుతూ పంచాయతీ సర్పంచి ప్రీతి, ఉప సర్పంచి, పాలకవర్గ సభ్యులు స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందించారు. రెగ్యులర్ సర్వీసులు ప్రతి రోజు నిర్వహించాల్సినవి ఉన్నాయన్నారు. మేజర్ పంచాయతీ కొలకలూరుకు తక్షణం రెగ్యులర్ కార్యదర్శిని నియమించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..