అందరి‘కన్నా’ మిన్న అని..
ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి తెదేపా ఇన్ఛార్జిగా ఆ పార్టీ నియమించింది. ఇప్పటివరకు సత్తెనపల్లి నియోజకవర్గంలో నలుగురైదుగురు నేతలు సీటు ఆశిస్తున్న నేపథ్యంలో కన్నాను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడంతో సందిగ్ధతకు తెరపడింది.
లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి తెదేపా బాధ్యతలు
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే, సత్తెనపల్లి: ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి తెదేపా ఇన్ఛార్జిగా ఆ పార్టీ నియమించింది. ఇప్పటివరకు సత్తెనపల్లి నియోజకవర్గంలో నలుగురైదుగురు నేతలు సీటు ఆశిస్తున్న నేపథ్యంలో కన్నాను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడంతో సందిగ్ధతకు తెరపడింది. తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఎప్పుడూ తమ కంచుకోటగా చెప్పుకునే సత్తెనపల్లి నియోజకవర్గానికి తొలిసారిగా సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందే ఇన్ఛార్జిని నియమించింది. తెదేపా ఆవిర్భావం తరువాత 1983 నుంచి 2019 వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ చివరి క్షణంలో అభ్యర్థులను ఎంపిక చేసేవారు. ఇందుకు భిన్నంగా కన్నాకు బుధవారం బాధ్యతలు అప్పగించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 23న కన్నా తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. కన్నా చేరిక నుంచే ఆయనకు గుంటూరు పశ్చిమ, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఏదో ఒకటి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం పార్టీలో జరిగింది. పార్టీలో చేరినప్పటి నుంచి కన్నా ఉమ్మడి జిల్లాలో తెదేపా నేతలతో కలిసి పర్యటనలు చేస్తున్నారు. సతె్తెనపల్లి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. తెదేపా కూడా అక్కడ వైకాపా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అంబటి రాంబాబుకు దీటైన ప్రత్యర్థిని నిలపాలని భావించింది. మాజీ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు మృతి తర్వాత అక్కడ గ్రూపులు ఏర్పడ్డాయి. నేతల మధ్య సయోధ్య లేక పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. కన్నా నియామకంతో వీటన్నిటికి తెర పడనుందని పార్టీ అధిష్ఠానం భావించి నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్ర స్థాయిలో కన్నా లక్ష్మీనారాయణకు పార్టీలో ప్రాముఖ్యత పెరుగుతోంది.
కలిసొచ్చిన రెండు మండలాలు...
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సుదీర్ఘకాలం మంత్రిగా పని చేసిన కన్నా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన పెదకూరపాడు నుంచి నాలుగుసార్లు వరుసగా విజయం సాధించారు. ఆ నియోజకవర్గం పరిధిలోని రాజుపాలెం, నకరికల్లు మండలంలోని కొన్ని గ్రామాలుండేవి. ప్రస్తుతం అ మండలాలు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం. గతంలో ఆయన గెలుపునకు ఈ రెండు మండలాలే కీలకంగా ఉన్నాయి. మరోవైపు సత్తెనపల్లి పట్టణంలో కూడా ఆయనకు అనుచరగణం ఉంది. కాంగ్రెస్ పార్టీ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఈక్రమంలో రెండు పార్టీల స్థానిక నాయకులతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. దీనికితోడు ప్రస్తుతం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అంబటి రాంబాబుకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో అదే సామాజికవర్గానికి చెందిన కన్నాకు పార్టీ అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. కన్నా నియామకంతో తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. తెదేపా వ్యూహాత్మకంగా కన్నాను సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ఎంపిక చేసినట్లు ఆపార్టీ సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలోనూ పలు నియోజకవర్గాల్లో కన్నా ప్రభావం ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పల్నాడు జిల్లాలో తనకు వ్యక్తిగతంగా పరిచయమున్న పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో పర్యటించి పాత మిత్రులను తెదేపాలోకి ఆహ్వానిస్తున్నారు.
సత్తెనపల్లి పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించక ముందే ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో పలువురు నేతలను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారు. పార్టీ శ్రేణులు, వివిధ వర్గాలతో ఆయన మమేకమయ్యారు. బుధవారం కన్నా నియోజకవర్గంలో సీనియర్ నేతలతో మాట్లాడి కలిసి పనిచేద్దామని కోరారు. మరోవైపు పార్టీ అధిష్ఠానం కూడా పలువురు నేతలతో మాట్లాడి కన్నాతో కలిసి అడుగులు వేయాలని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతికూల వాతావరణం.. చంద్రబాబు మాచర్ల పర్యటన రద్దు
[ 10-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు మాచర్ల పర్యటన రద్దయింది. -
పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ ఆదేశాలు
[ 10-05-2024]
పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ ఆదేశాలు జారీ చేసింది. -
వైకాపా ప్రలోభాల పర్వం.. మంగళగిరిలో రూ.25కోట్లు సీజ్
[ 10-05-2024]
పోలింగ్ దగ్గర పడుతున్న వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. -
సూపర్-6తో భవిష్యత్తు గ్యారెంటీ
[ 10-05-2024]
‘అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ఇక్కడ నివసిస్తున్న వివిధ వృత్తుల వారు చేసే పనికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఆదాయం పెరిగేలా చేస్తాం. ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసి అక్కడ పని చేసుకోవడానికి అన్ని వసతులు.. -
ఈ అరాచకాల్ని.. ఆపేదెవరు..?
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు మూడు రోజుల సమయమే ఉంది. శనివారం సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. సోమవారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పల్నాడులో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం కత్తిమీదసాములా మారింది. -
అన్నవి హామీలే.. కర్షకులకు కష్టాలే
[ 10-05-2024]
జిల్లాలో పంటలు చేతికొచ్చే వేళ మిగ్జాం తుపానుతో రైతులు సర్వం కోల్పోయారు. కోత కోసి ఓదెల మీద ఉన్న వరి పనలు తడిచిపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలకొరిగి నష్టం జరిగింది. -
ప్రతీ నెలా నిరీక్షణే.. జీవితకాలం నష్టమే..
[ 10-05-2024]
2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2022లో పీఆర్సీని ప్రకటించారు. 11వ పీఆర్సీలో ఫిట్మెంట్ 23 శాతానికి ప్రభుత్వం తగ్గించడంతో విశ్రాంత ఉద్యోగుల పింఛన్లో 4 శాతం కోత పడింది. -
బరితెగించిన వైకాపా
[ 10-05-2024]
గుంటూరు నగరంలో వైకాపా తరఫున బరిలో నిలిచిన అభ్యర్థి బరి తెగించారు. ప్రజల నుంచి మద్దతు లేదని గుర్తించిన సదరు వ్యక్తులు అడ్డదారుల్లోనైనా గెలవాలనే లక్ష్యంతో సామ, దాన, దండోపాయాలు అవలంబిస్తున్నారు. -
నా సోదరి మాధవిని గెలిపించండి
[ 10-05-2024]
గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన నా సోదరి గళ్లా మాధవిని గెలిపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. జనసేన కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె పవన్ కల్యాణ్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. -
ఐఎఫ్ఎస్కు నడింపల్లి యువతి ఎంపిక
[ 10-05-2024]
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో చెరుకుపల్లి మండలం నడింపల్లికి చెందిన వెన్నం అనూష 73వ ర్యాంక్ సాధించారు. ఎన్నో ప్రయత్నాల తరువాత ఆమె ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. -
అంతర్ జిల్లాల బ్యాలట్లు గల్లంతు
[ 10-05-2024]
పోస్టల్ బ్యాలట్ మొదలైనప్పటి నుంచి అంతర్ జిల్లాల ఉద్యోగుల విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. తొలి రోజు నుంచి బ్యాలట్ల కొరత ఉందని చెబుతూనే.. -
మంగళగిరి ప్రజలూ నా కుటుంబ సభ్యులే
[ 10-05-2024]
మంగళగిరి ప్రజలు తనకు సొంత కుటుంబ సభ్యులతో సమానమని కూటమి తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరి మండలం కురగల్లు, నిడమర్రు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తల్లి నారా భువనేశ్వరితో కలసి గురువారం ‘రచ్చబండ’ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
దోశలో ఇనుప వాషర్ బోల్ట్
[ 10-05-2024]
గుంటూరులోని కొందరు హోటల్స్ నిర్వాహకులు ఆహార పదార్థాల తయారీలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గురువారం కొరిటెపాడులోని ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్లిన వినియోగదారుడికి ఎదురైన సంఘటనే తార్కాణం. -
రోశయ్య, ఆళ్ల మాట తప్పారు
[ 10-05-2024]
పెదకాకాని హజరత్ సయ్యద్ బాజిషహీద్ అవులియా బాబా దర్గా నిర్వహణ బాధ్యతల విషయంలో ఎమ్మెల్యేలు రోశయ్య, ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట తప్పారు. ఈ కారణంగా ముత్తవల్లీ, ముజావర్ల వంశాలకు చెందిన 200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. -
‘వైకాపా అభ్యర్థులను అన్ని చోట్లా ఓడించండి’
[ 10-05-2024]
దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ దళితుల్ని నిలువునా వంచించారని ప్రభుదా రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావ్,
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం