దశ‘దిశ’లా.. ఆక్రందనలే..!
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది.
అన్నతోడంటివి.. కొత్త చట్టంతో ఒరిగిందేంటి?
మహిళలపై అఘాయిత్యాలు ఆగలేదే
సంచలన కేసుల్లో నిందితులు పరారీలోనే
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే, గుంటూరు నేరవార్తలు, మేడికొండూరు
వైకాపా ప్రభుత్వ పదవీకాలం ముగుస్తున్నా ఇప్పటికీ ఆ చట్టానికి కోరలు లేవు. దాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు. ఉనికిలో లేని చట్టం గురించి పదేపదే ప్రచారం చేసుకోవడం జగన్ సర్కార్ తీరుగా మారింది. నాలుగేళ్ల కిందట ఈ చట్టం తీసుకొచ్చిన సందర్భంలో సీఎం మొదలు మంత్రులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు మహిళల రక్షణ కోసం ఈ సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చామని గొప్పలకు పోయారు. ఆచరణలో అవి ఉత్తిమాటలేనని తేలిపోయింది. మేడికొండూరు, తాడేపల్లి స్టేషన్ల పరిధిలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనల్లో ఇప్పటికీ నిందితులు కొందరు పట్టుబడలేదు. రెండు నెలల్లోపే నిందితుల్ని పట్టుకుని ఛార్జిషీట్ వేస్తామన్నారు. సకాలంలో ఛార్జిషీట్ వేయడం, శిక్షలు పడేలా చేయడం దేవుడెరుగు అసలు కొన్ని కేసుల్లో దర్యాప్తులే నెలల తరబడి సాగుతున్నాయి. ఈ దుస్థితిలో దిశ ఉంది.
దిశ చట్టం గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న సీఎం జగన్ (పాతచిత్రం)
మహిళలు, యువతులు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడాలంటేనే ఎవరైనా భయపడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చింది. ఫోన్లో దిశ యాప్ ఉంటే అన్న తోడుగా ఉన్నట్లే. ప్రతి మహిళతో డౌన్లోడ్ చేయించాలి.
అసెంబ్లీలో, పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలివి
2021 సెప్టెంబరు 8 రాత్రి 11గంటలు.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన దంపతులు బంధువుల ఇంట్లో శుభకార్యం కోసం మేడికొండూరు మండలం పాలడుగు వచ్చారు. చీకటి పడడంతో ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి బయలుదేరారు. ఊరికి కొద్దిదూరం వచ్చాక రోడ్డుకి అడ్డంగా చెట్టు కొమ్మ పడేసి భార్యాభర్తలను అడ్డగించారు. కత్తులతో బెదిరించి భర్తను చితకబాదారు. బలవంతంగా ఇద్దరినీ పక్కనున్న పొలంలో చెట్టు కిందకు తీసుకెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు, చేతులు కట్టేశారు. మహిళపై వరుసగా నలుగురు సామూహిక అఘాయిత్యానికి పాల్పడ్డారు. బంగారం, నగదు దోచుకుని పరారయ్యారు. బాధితులు తొలుత సత్తెనపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఘటన స్థలి తమ పరిధిలోకి రాదని చెప్పడంతో అక్కడి నుంచి మేడికొండూరు స్టేషన్కు వెళ్లారు. అప్పుడు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం నలుగురు నిందితుల్లో రెండో నిందితుడు దాసరి సుంకన్నను ఇప్పటికీ పోలీసులు పట్టుకోలేకపోయారు. అదేమంటే నిందితులు చరవాణి వాడడం లేదని, అందుకే ఆచూకీ తెలియడం లేదని సాకులు చెబుతున్నారు.
2021 జూన్ 19.. సీఎం నివాసానికి సమీపంలో జరిగిన సామూహిక లైంగిక దాడి ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. తాడేపల్లి పరిధిలో సీతానగరం ఘాట్లో కాబోయే భర్తతో కలిసి ఆటవిడుపుగా వచ్చిన ఓ యువతిని నిర్బంధించి ఇద్దరు కామాంధులు అత్యాచారం చేశారు. ఆ ఘటన జరిగి సుమారు మూడున్నరేళ్లయినా ఇప్పటికీ వెంకటేశ్వరరెడ్డి అనే నిందితుడిని మాత్రం పట్టుకోలేదు. ఏళ్లు గడుస్తున్నా నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడంటే దిశ స్టేషన్ల పని తీరు ఎంత దారుణంగా తయారైందో ఈ ఉదంతం చెప్పకనే చెబుతోంది.
2022 సెప్టెంబరు.. గుంటూరు గ్రామీణ మండలానికి చెందిన ఓ యువతిని ఓ యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మించి కోరిక తీర్చుకున్నాడు. పెళ్లి చేసుకోమని అడిగితే తనపై స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడంటూ బాధితురాలు తన తల్లితో కలిసి ఓ మహిళా డీఎస్పీని ఆశ్రయించింది. పోలీసు అధికారిణి కనికరించకపోగా నువ్వు తిరుగుబోతువంట అని కుటుంబ సభ్యుల ముందు తిట్టడంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకొన్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
‘దిశ’ మారని ఠాణా
మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పింది. ఓ డీఎస్పీ సహా సీఐలు, ఎస్సైలు, సిబ్బందిని కేటాయించారు. వారికి ఇతర స్టేషన్లకంటే అధిక జీతభత్యం కేటాయించారు. ఇక్కడ మహిళల ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, నగదు తీసుకొని కూడా నిందితులకే పోలీసులు సహకరిస్తున్నారని సాక్షాత్తూ ఎస్పీకే బాధిత మహిళలు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు.
నిరుపయోగంగా వాహనాలు...
దిశ యాప్ ఒక్కసారి ఊపితే వెంటనే పోలీసులు వచ్చి రక్షణ, భద్రత కల్పిస్తారంటూ ఊదరకొట్టారు. నేరుగా స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేయడం లేదు. ఇక యాప్లో సమాచారం ఇస్తే ఎవరు పట్టించుకుంటారని పెద్ద సంఖ్యలో మహిళలు విమర్శిస్తున్నారు. రూ.లక్షలు పెట్టిన కొనుగోలు చేసిన వాహనాలతో తొలుత కొద్దిరోజులు హడావుడి చేశారు. ఆ తరువాత మూలపడేశారనే అపవాదు ఉంది.
మహిళలకు న్యాయం జరగడం లేదు
- ఎల్.అరుణకుమారి, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి
దిశ పోలీస్స్టేషన్ల వల్ల ఏ ఒక్క మహిళ తమకు న్యాయం జరిగిందని చెప్పడం లేదు. అక్కడ ఎవరు డబ్బులిస్తే వారికే అధికారులు వత్తాసు పలుకుతారు. ఇటీవల ఓ యువతి దిశలో పట్టించుకోలేదని మా వద్దక వచ్చి ఆవేదన చెందింది. దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫోన్ ఊపితే పోలీసులు వచ్చి రక్షిస్తారని హడావుడి చేశారు. 5లక్షల మందితో యాప్ డౌన్లోడ్ చేయించారు.దీని వల్ల ప్రయోజనమేంటి. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఆగలేదు. కఠిన చట్టాలు తీసుకురావాలి. వాటిని పోలీసులు పారదర్శకంగా అమలు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. 46,389 పోలింగ్ కేంద్రాలు
[ 02-05-2024]
రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్మీనా తెలిపారు. -
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి తెదేపా విజ్ఞప్తి
[ 02-05-2024]
ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయంలో మార్పులు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెదేపా కోరింది. -
రోడ్డు ప్రమాదంలో రాయపాటి అరుణకు గాయాలు
[ 02-05-2024]
జిల్లాలోని జె.పంగులూరు మండలం రేణింగవరం వద్ద కారు డివైడర్ను ఢీకొంది. -
గర్జించిన గుంటూరు.. చంద్రబాబుకు అభిమాన నీరాజనం
[ 02-05-2024]
‘గుంటూరు మిరప ఘాటు ఎలా ఉంటుందో సత్తా చూపారు. ర్యాలీ అదుర్స్’ అని రోడ్షోలో భారీగా స్వాగతం పలికిన, సభకు హాజరైన జనాన్ని చూసి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఇలా స్పందించారు. -
పాలకుల పాపాలు.. సమిధలయ్యె ప్రాణాలు
[ 02-05-2024]
రక్షితనీరు.. ప్రజల ప్రాథమిక అవసరం.. కానీ జగన్ పాలనలో దీన్ని పూర్తిగా విస్మరించారు. తాగు నీటి సరఫరా, నిర్వహణపై అధికారులతో ఎప్పుడూ సమీక్షించింది లేదు. -
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది
[ 02-05-2024]
న్యాయం చేయాలని అయిదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపడితే వైకాపా రాక్షస ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి శ్రీ లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కలల గృహం.. కల్లోలం
[ 02-05-2024]
అర్హులైన ప్రతి పేదకు ఇంటి స్థలంతో పాటు గృహాన్ని నిర్మించి ఇచ్చే బాధ్యత మాది. మీరు సొంతంగా ఇల్లు నిర్మించుకుంటామంటే పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లిస్తాం. -
అమరావతిపై జగన్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం
[ 02-05-2024]
‘అమరావతి అంటే ఏంటి..అది ఎక్కడ ఉంది’ అని ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై రాజధాని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేతలు.. ‘మేత’లు
[ 02-05-2024]
జేపీ కంపెనీ ఇసుక తవ్వకాల నుంచి తప్పుకున్న తర్వాత ఇసుక వ్యాపారాన్ని పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి చేజిక్కించుకున్నారు. -
కోడ్ ఉల్లంఘనపై 60 కేసులు
[ 02-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 60 కేసులు నమోదు చేశారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు ఎం.వేణుగోపాల్రెడ్డి తెలిపారు. -
చంద్రబాబును గెలిపించండి
[ 02-05-2024]
రాజధానిని నిర్మించే నాయకుడు చంద్రబాబును గెలిపించాలని అమరావతి రాజధాని రైతులు మంగళగిరి కొత్తపేటలో బుధవారం సాయంత్రం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. -
యువకుల ప్రాణాలు కాపాడిన బీచ్ పోలీసులు
[ 02-05-2024]
సూర్యలంక తీరంలో విహారానికి వచ్చి సముద్ర స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోతున్న మంగళగిరికి చెందిన ఇద్దరు యువకుల ప్రాణాలను బీచ్ పోలీసులు బుధవారం కాపాడారు. -
వైకాపా నుంచి తెదేపాలోకి భారీ వలసలు
[ 02-05-2024]
తెనాలిలో వైకాపా నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కూటమిలోకి వరుసగా వస్తున్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం పట్టణంలోని 23వ వార్డు కౌన్సిలర్ తోక శిరీష, వాసు దంపతులు, -
ప్రాణాలు పోతున్నా పట్టదా..!
[ 02-05-2024]
వైౖకాపా పాలకుల వైఫల్యం వల్ల ప్రజలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురవుతున్నారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కై ‘నాకింత.. -
స్వచ్ఛమైన నీరు ఎక్కడ.. కిలారి
[ 02-05-2024]
పుర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అనేక సందర్భాల్లో వేదికలపై నుంచి చెప్పారు. -
అవకాశవాదులను తెదేపాలో చేర్చుకోం
[ 02-05-2024]
-
జీఎంసీకి రూ.5 లక్షల జరిమానా
[ 02-05-2024]
గుంటూరు వైద్య కళాశాల(జీఎంసీ)లో ప్రస్తుతం ఉన్న 250 ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా తగినంత మంది బోధనానిపుణులు, ఇతర సదుపాయాలు లేనందున రూ.5 లక్షలు జరిమానా చెల్లించాలని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) అధికారులు ఆదేశించారు. -
పోస్టల్ బ్యాలట్ల దరఖాస్తులు తీసుకోవడానికి నిరాకరణ
[ 02-05-2024]
బాపట్ల జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఓటు హక్కు కలిగిన ఒప్పంద ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ తీసుకోవడానికి గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని తహసీల్దార్లు నిరాకరించడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
డీఎస్పీ టెక్నాలజీతో బౌల్ట్ సౌండ్బార్.. ధర, ఫీచర్లివే..!
-
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్సిరీస్ ఎలా ఉంది?
-
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
-
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
-
దుబాయ్లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్లైన్స్