logo

మనస్తాపంతో లారీ డ్రైవర్‌

ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఓ లారీ డ్రైవర్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామాయంపేట పట్టణంలో సోమవారం వెలుగు చూసింది. ఎస్‌ఐ రాజేష్‌

Published : 07 Dec 2021 01:22 IST

రామాయంపేట, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఓ లారీ డ్రైవర్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామాయంపేట పట్టణంలో సోమవారం వెలుగు చూసింది. ఎస్‌ఐ రాజేష్‌ వివరాల ప్రకారం మెదక్‌ మండల ఔరంగాబాద్‌ గ్రామానికి చెందిన చాకలి నాగరాజు (34) తన భార్య లక్ష్మితో కలిసి సుమారు ఆరేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం రామాయంపేటకు వచ్చారు. ఈ క్రమంలో స్థానికంగా ట్రాన్స్‌ పోర్టులో డ్రైవరుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. పోషణ భారమై మనస్తాపానికి గురై ఈ నెల 5న రాత్రి తన భార్యతో చెప్పి బాధపడ్డారు. ఆమె నిద్రించిన తరువాత ఇంట్లోనే చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె ఉదయం నిద్రలేచి చూసే సరికి విషయం వెలుగుచూసింది. మృతుని తండ్రి నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. వీరికి ఓ కుమార్తె ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని