logo

Crime News: వనస్థలిపురంలో దారుణం.. కట్టేసి కొట్టి.. మూటలో కట్టి!

గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా కొట్టి చంపి దుప్పట్లో చుట్టి రోడ్డు పక్కన పడేసిన సంఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం గురువారం సాయంత్రం బీఎన్‌రెడ్డినగర్‌ పరిధి శివసింధూ

Updated : 17 Dec 2021 10:20 IST

గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య

వనస్థలిపురం, న్యూస్‌టుడే: గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా కొట్టి చంపి దుప్పట్లో చుట్టి రోడ్డు పక్కన పడేసిన సంఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం గురువారం సాయంత్రం బీఎన్‌రెడ్డినగర్‌ పరిధి శివసింధూ చౌరస్తా సమీపంలో రోడ్డు పక్కన ఓ ప్రహరి సమీపంలో పొదల మాటున ఓ మూట కనిపించింది.  కొందరు పరిశీలించగా అందులో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గుర్తించి వెంటనే కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులకు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కాళ్లు కట్టేసి ఉండి.. ఒంటిపై, తలపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. కట్టేసి కొట్టి చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి దర్యాప్తు ప్రారంభించారు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, సీఐ సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్‌ లచ్చిరెడ్డి పరిశీలించారు.  కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. సమీపంలోని సీసీ ఫుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారు. మృతుడి వయసు సుమారు 40 ఏళ్లు ఉంటాయని, ముఖం గుర్తు పట్టేందుకు వీలులేకుండా కుళ్లిపోయి ఉందని పోలిసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని