ప్రత్యేక కార్యాచరణ.. రక్తహీనత నియంత్రణ
మహిళల్లో రక్తహీనతకు అడ్డుకట్టవేసేందుకు ప్రత్యేక పోషకాలను అందించేందుకు కసరత్తు మొదలైంది. ఆరోగ్యకరమైన అతివల సమాజాన్ని రూపొందించేందుకు కార్యాచరణ అమలులోకి రాబోతోంది. జాతీయ
గవర్నర్ చొరవతో పోషకాల కిట్కు సన్నాహాలు
కొనసాగుతున్న శిబిరాలు
బుద్ధారంలో పరీక్షలు చేస్తున్న సిబ్బంది
మహిళల్లో రక్తహీనతకు అడ్డుకట్టవేసేందుకు ప్రత్యేక పోషకాలను అందించేందుకు కసరత్తు మొదలైంది. ఆరోగ్యకరమైన అతివల సమాజాన్ని రూపొందించేందుకు కార్యాచరణ అమలులోకి రాబోతోంది. జాతీయ పోషకాహార సంస్థ ఆధ్వర్యంలో అమలుకానున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై చొరవతో ఆర్థిక వనరులు సమకూరనున్నాయి. ఇందులో భాగంగానే జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మండలానికి ఒక గ్రామంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితులను గుర్తించి కేసీఆర్ కిట్ తరహాలో ‘పోషకాల కిట్’ త్వరలో అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం.
న్యూస్టుడే, తాండూరుగ్రామీణ
జిల్లా వ్యాప్తంగా స్త్రీలు, పిల్లలు రక్తహీనతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిని పూర్తి స్థాయిలో గుర్తించి అవసరమైన సహకారం అందించేందుకు గవర్నర్ తమిళిసై ప్రత్యేక చొరవ చూపుతున్నారు. అలాంటి వారికి పోషకాలను ఉచితంగా అందించాలని సంకల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా రక్తహీనత కలిగిన వారిని గుర్తించేందుకు భారత వైద్య పరిశోధన (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్), జాతీయ పోషకాల సంస్థ (నేషనల్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్)కు సూచించింది. ఈ సంస్థలు 2011లో నిర్వహించిన సర్వే అధారంగా అత్యధికంగా రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు వికారాబాద్లో ఉన్నారని గుర్తించారు. దీంతో జిల్లాను పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. తొమ్మిది ఏళ్ల నుంచి 48 ఏళ్ల వయసున్న వారికి పరీక్షలు చేసి హిమోగ్లోబిన్ శాతాన్ని నమోదు చేస్తున్నారు.
ఏఏ మండలాల్లో: తాండూరు మండలం కోటబాస్పల్లి, పూడూరు మండలం కండ్లపల్లి, మోమిన్పేట మండలం అమ్రాదికలాన్, వికారాబాద్ పీరంపల్లి, పరిగి మాదారం, కుల్కచర్ల అంతారం, దోమ బొంపల్లి, కోట్పల్లి రాంపూర్, ధారూరు ధర్మాపూర్, పెద్దేముల్ బుద్ధారంలో శిబిరాలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. 250 మందిని పరిశీలిస్తే 157మందిలో పదకొండు శాతం ఉండాల్సిన హిమోగ్లోబిన్ అంతకంటె తక్కువ ఉన్నట్లు గుర్తించామన్నారు. మిగిలిన మండలాల్లోని గ్రామాల్లోనూ చేపడితే ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
శాశ్వత పరిష్కారానికి..
బాలికలు, యువతులు, మహిళల్లో ఈ సమస్యలకు కారణాలను సైతం అన్వేషించనున్నారు. పరీక్షల ప్రకారం పేరు, బరువు, ఎత్తు, ఆధార్, చరవాణి సంఖ్య వంటి వివరాలను నమోదు చేయనున్నారు. దీంతోపాటు గ్రామాల్లోని బోరు నీరు, భగీరథ జలాలు, శుద్ధి నీటి ప్లాంటు నీటి నమూనాలను సైతం సేకరిస్తున్నారు. వాటిని ల్యాబ్కు తరలించి ప్రయోగాల అనంతరం కారణాలను తేల్చనున్నారు. ఆయా గ్రామాలకు రెండుమూడు నెలల తర్వాత వచ్చి ప్రయోగాల ఫలితాలతోపాటు గ్రామస్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య నియమాల గురించి అవగాహన కల్పించనున్నారు.
త్వరలో సరఫరా: జిల్లావ్యాప్తంగా శిబిరాల నిర్వహణ పూర్తయ్యాక, ఆయా గ్రామాల వారీగా జాబితా రూపొందించి బాలికలు, యువతులు, మహిళలకు పోషకాలతోకూడిన కిట్ను ఉచితంగా అందించనున్నారు. 25 రోజులకు ఒకసారి అందించే కిట్లో బాదాం, పిస్తా, సేంద్రియంగా తయారు చేసిన రాగి లడ్డూలు, బెల్లంతో చేసిన పల్లీపట్టీలు వంటివి ఇవ్వనున్నారు.
వివరాలు నమోదు చేస్తున్నాం: ప్రవీణ్కుమార్యాదవ్, జాతీయ పోషకాల సంస్థ ప్రతినిధి
గవర్నర్ చొరవతో రక్తహీనత కల్గిన వారిని గుర్తించి ప్రత్యేకంగా పోషకాల కిట్ను త్వరలో సరఫరా చేస్తాం. మండలానికి ఒక గ్రామంలో శిబిరం నిర్వహించి వివరాలు నమోదు చేస్తున్నాం. ఈ సమస్యను అధిగమించడం ద్వారా బాలికలు, యువతులు, మహిళల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
నేతలు రోడ్డెక్క.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇంధనం ఏదమ్మాఝ
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ హాట్ ఠాణా
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.