అప్రమత్తతేఆయుధం..కట్టడి అవసరం
ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జ్వర సర్వే చేపట్టింది. జిల్లా యంత్రాంగం అందుకు అనుగుణంగా బృందాలను ఏర్పాటు చేసి, ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తోంది. ఈ సమయంలో వేలాది మంది ఇంట్లోనే ఉంటూ జ్వరం, జలుబు, దగ్గు,
జిల్లాలో భారీగా కరోనా అనుమానితులు
జ్వర సర్వేలో వెల్లడి
కొడంగల్లో సర్వే చేస్తున్న సిబ్బంది..
* ధారూర్ మండలం నాగసమందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఫీవర్ సర్వే బృందాలు మంగళవారం 200 కుటుంబాలను పరిశీలించాయి. ఇందులో 70 కుటుంబాల్లో జ్వరం, జలుబు, దగ్గు, ఇతర అనారోగ్య లక్షణాలు గుర్తించారు. దీంతో వారికి మందుల కిట్లు అందించారు.
* కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామంలో 482 కుటుంబాలున్నాయి. ఇటీవల జ్వర సర్వేకు వెళ్లినపుడు ప్రతి ఇంట్లో ఒకరికైనా జ్వరం, జలుబు, దగ్గు, ఇతర లక్షణాలు ఉన్నాయని సర్పంచి చెబుతున్నారు. వైద్యుల బృందం మాత్రం 70 మందిలోనే లక్షణాలు గుర్తించినట్లు పేర్కొంటున్నారు.
* మోమిన్పేట్ మండలం దేవరంపల్లి సబ్ సెంటర్ పరిధిలో చక్రంపల్లి, బాల్రెడ్డిగూడెం, చీమలదరి, దేవరంపల్లి గ్రామాలు ఉన్నాయి. మంగళవారం జ్వర సర్వే బృందం 659 మందిని పరిశీలించారు. అందులో ఆరుగురికి జ్వరం రావడంతో మందుల కిట్లు అందించారు.
ఈనాడు డిజిటల్, వికారాబాద్, న్యూస్టుడే, కొడంగల్, మోమిన్పేట్
ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జ్వర సర్వే చేపట్టింది. జిల్లా యంత్రాంగం అందుకు అనుగుణంగా బృందాలను ఏర్పాటు చేసి, ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తోంది. ఈ సమయంలో వేలాది మంది ఇంట్లోనే ఉంటూ జ్వరం, జలుబు, దగ్గు, ఇతర రోగాలతో బాధపడుతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరికొన్ని చోట్ల క్షేత్ర స్థాయిలో రోగాల తీవ్రత ఎక్కువగా ఉన్నా వైద్య సిబ్బంది నివేదికల్లో వాటిని తక్కువగా చూపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
9.20 లక్షల మంది జనాభా
జిల్లాలో 2.20 లక్షల నివాస గృహాలున్నాయి. సమారు 9.20 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ నుంచి 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మొత్తం 745 బృందాలు జ్వర సర్వే చేపడుతున్నాయి. ఇప్పటి వరకు 1.61 లక్షల కుటుంబాలను పరిశీలించిన వైద్య బృందాలు 7 వేల మందిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. మందుల కిట్లు ఇచ్చి పరిస్థితి సీరియస్ అనిపిస్తే సమీప పీహెచ్సీలకు వెళ్లాలన్నారు. అలా వెళ్లిన 3,099 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 299 మందికి పాజిటివ్గా తేలింది. అత్యధికంగా పెద్దేముల్ మండలంలో 49 మంది, వికారాబాద్లో 36 మంది ఉన్నారు. యాలాల మండలంలో మొత్తం 9 వేల నివాస గృహాలను సర్వే బృందాలు సందర్శించగా కేవలం 224 కుటుంబాల్లోనే లక్షణాలు గుర్తించారు. అందులో 92 మందికి పరీక్షలు చేయగా కేవలం ఒక్కరికే పాజిటివ్ వచ్చిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
అధికారిక లెక్కలు ఇలా
సర్వే బృందాలు: 745
మొత్తం నివాస గృహాలు: 2,20,386
ఇప్పటి వరకు సర్వే చేసినవి: 1,61,808
కరోనా లక్షణాలు గుర్తించిన కుటుంబాలు: 7,078
వాస్తవ దూరమని విమర్శలు
సర్వే నివేదికలు వాస్తవ దూరంగా ఉన్నాయని వైద్య బృందాలతో పర్యటించిన ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు పేర్కొంటున్నారు. అధికారిక నివేదికలకు, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు పొంతనే లేదని విమర్శిస్తున్నారు. సర్వే బృందం ఇంటికి వచ్చినపుడు చిన్నచిన్న లక్షణాలు ఉన్నా చెప్పడానికి కొంత మంది ఇష్టపడటంలేదని, మరికొన్ని సందర్భాల్లో చిన్నపాటి జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉన్నా వాటిని వైద్యుల బృందం పరిగణలోకి తీసుకోవడంలేదని తెలిపారు. కొన్ని చోట్ల కుటుంబ సభ్యులు సరైన సమాచారం ఇవ్వడంలేదని తెలుస్తోంది. ఫలితంగా కరోనా లక్షణాలున్న వ్యక్తులు ఎంత మంది ఉన్నారనేది స్పష్టం తేలే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు.
* మరోవైపు కరోనా కష్టకాలంలోనూ రాజకీయ నేతలు సభలు, సమావేశాలంటూ ప్రజలను పోగు చేయడం విమర్శలకు తావిస్తోంది. అభివృద్ధి కార్యక్రమాల పేరు చెప్పి సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల కరోనా వ్యాప్తి తొందరగా జరుగుతుందని వైద్యులు సూచిస్తున్నా పట్టించుకుంటున్న దాఖలాలు తక్కువే..
వ్యక్తిగత జాగ్రత్తలే ముఖ్యం
తుకారాం, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జ్వర సర్వే చేపట్టాం. కచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తున్నాం. అనుమానితులు, లక్షణాలు ఉన్న వ్యక్తులకు పరీక్షలు చేయించి, మందులు అందిస్తున్నాం. కరోనా కట్టడికి వ్యక్తిగత జాగ్రత్తలు ముఖ్యమని ప్రతి ఒక్కరూ భావించాలి. ఏ మాత్రం జ్వరం, జలుబు, దగ్గు ఇతర లక్షణాలు కనిపించినా సమీపంలోని వైద్య సిబ్బందిని సంప్రదించి, కరోనా పరీక్షలు చేయించుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.