అడ్డాకూలీ హత్య కేసులో విద్యార్థులు.. గంజాయి మత్తులో మైనర్ల దారుణం
తల్లిదండ్రులు అడ్డాకూలీలు.. పిల్లల్ని చదివించాలనుకున్నారు. కట్టుతప్పిన ఆ విద్యార్థులు చెడు స్నేహాలతో గంజాయికి బానిసలయ్యారు. చివరకు హంతకులుగా మారారు. కొత్తూరు వైజంక్షన్ సమీపంలో అడ్డాకూలీ హత్యకేసును పోలీసులు ఛేదించారు.
కొత్తూరు, న్యూస్టుడే: తల్లిదండ్రులు అడ్డాకూలీలు.. పిల్లల్ని చదివించాలనుకున్నారు. కట్టుతప్పిన ఆ విద్యార్థులు చెడు స్నేహాలతో గంజాయికి బానిసలయ్యారు. చివరకు హంతకులుగా మారారు. కొత్తూరు వైజంక్షన్ సమీపంలో అడ్డాకూలీ హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేశారు. కొత్తూరు పోలీస్స్టేషన్లో గురువారం ఏసీపీ కుషాల్కర్, ఇన్స్పెక్టర్ బాలరాజు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఉత్తరాది నుంచి 35 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం వచ్చిన కుటుంబాలు శివారు ప్రాంతాల్లో ఉంటున్నాయి. రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు. ఒకరు 10వ తరగతి పూర్తిచేసి ఖాళీగా ఉండగా.. మరో విద్యార్థి శంషాబాద్లోని కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరూ ఒకే పాఠశాలలో చదవడంతో స్నేహితులయ్యారు. తల్లిదండ్రుల స్థానికంగా పరిశ్రమలతో పనులకు వెళ్తుండేవారు. పర్యవేక్షణ లేకపోవటంతో మద్యం, గంజాయికి అలవాటు పడ్డారు. ద్విచక్ర వాహనాలు దొంగిలించి వాటిపై తిరుగుతుండేవారు. ఒంటరిగా కనిపించిన వ్యక్తులను బెదిరించి, దాడిచేసి డబ్బులు గుంజుకునేవారు. ఆ సొమ్ముతో జల్సాలు చేస్తుండేవారు. వీరిద్దరిపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ నెల 9న రాత్రి వారిద్దరూ గంజాయి మత్తులో ద్విచక్రవాహనంపై కొత్తూరు వైజంక్షన్ సమీపంలోని అండర్పాస్ వద్దకు చేరారు. అదే సమయంలో మధ్యప్రదేశ్కు చెందిన అడ్డాకూలీ దిలీప్ బోబ్డే(35) మద్యం మత్తులో వెళ్తున్నాడు. అతడిని గమనించిన మైనర్లు ద్విచక్రవాహనంపై ఎక్కితే ఇంటి వద్ద దించుతామన్నారు. అతడు నిరాకరించటంతో గొడవకు దిగారు. అతను కొట్టడంతో.. బండరాయితో మోది హత్య చేశారు. మృతుడి పర్సులో రూ.11వేలు, గొలుసు తీసుకొని పారిపోయారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పట్టిచ్చిన కొట్టేసిన బైక్.. పోలీసులు పలు ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. 10వ తేదీ రాత్రి కొత్తూరు రైల్వేస్టేషన్ సమీపంలోని ఇంటి ముందు ద్విచక్రవాహనాన్ని ఓ బాలుడు చోరీ చేయటాన్ని గుర్తించారు. అతడి గురించి ఆరా తీస్తున్న సమయంలో.. బుధవారం రాత్రి షాద్నగర్ రైల్వేస్టేషన్ సమీపంలో ద్విచక్రవాహనం అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించగా హత్యలో కేసులో నిందితులని తేలింది. వారి వద్ద నుంచి ద్విచక్రవాహనం రూ.3,200 నగదు, గొలుసు, పర్సు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు ఎందరు.? దిలీప్ బోబ్డే హత్య కేసులో ఇద్దరు మైనర్లతో పాటూ మరో ఇద్దరు ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ హత్య జరిగిన మరుసటిరోజు కొత్తూరు పారిశ్రామిక వాడలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభించింది. ఇది కూడా హత్యేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.ఈ హత్యలో నలుగురు ప్రమేయం ఉన్నట్లు అంచనా వేశారు. గురువారం పోలీస్ స్టేషన్ వద్ద మైనర్ల కుటుంబ సభ్యులు ‘ఇద్దరినే జైలుకు పంపుతున్నారు.. మిగిలిన ఇద్దరినీ ఎందుకు వదిలి పెట్టారంటూ ప్రశ్నించినట్టు సమాచారం. దీనిపై స్పందించిన పోలీసులు రెండు హత్యల్లో వేర్వేరు నిందితులు ఉన్నట్టు గుర్తించామని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
నేతలు రోడ్డెక్క.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇంధనం ఏదమ్మాఝ
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ హాట్ ఠాణా
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.