అనుభవాలు పదిలం.. అభివృద్ధికి ఆయుధం!
కష్టాలు, అవరోధాలను ఎదుర్కొని తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుతున్నారీ ధీరవనితలు. చదువు రాకున్నా హస్తకళ ఉత్పత్తులు తయారు చేసి గుర్తింపు పొందుతోంది ఓ మహిళ. స్నాక్స్ అందిస్తూ ఆరోగ్యాన్ని పంచాలని అంకుర సంస్థను స్థాపించి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది మరో మహిళ.
స్ఫూర్తిదాయకంగా మహిళా ఔత్సాహికవేత్తల జీవన గమనం
ఈనాడు, హైదరాబాద్: కష్టాలు, అవరోధాలను ఎదుర్కొని తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుతున్నారీ ధీరవనితలు. చదువు రాకున్నా హస్తకళ ఉత్పత్తులు తయారు చేసి గుర్తింపు పొందుతోంది ఓ మహిళ. స్నాక్స్ అందిస్తూ ఆరోగ్యాన్ని పంచాలని అంకుర సంస్థను స్థాపించి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది మరో మహిళ.
రుచికర బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్
ఆరోగ్యం పాడవుందని చెబుతున్నా పిల్లలు, పెద్దలు జంక్ ఫుడ్నే ఇష్టంగా తింటున్నారు. ఇందుకు కారణం ఆరోగ్యకర స్నాక్స్ అందుబాటులో లేకపోవడమేనని గుర్తించిన ఫుడ్ సైంటిస్ట్ సౌమ్య స్వయంగా పరిశోధనలు చేసి మిలినోవా ఫుడ్స్ అంకుర సంస్థను ఏర్పాటు చేశారు. సౌమ్య వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ అసోసియేట్గా ఆహారం, న్యూట్రిషన్, క్వాలిటీ కంట్రోల్పై పరిశోధనల్లో పాల్గొన్నారు. తృణధాన్యాలు, పళ్లు, కూరగాయల కలయికతో ఫార్ములా రూపొందించి స్నాక్స్ను తయారు చేశారు. మిల్లెట్ పరిశోధన సంస్థ, ఇక్రిశాట్, ఐఎస్బీ నుంచి గుర్తింపు లభించింది. ఎనర్జీ బార్స్ తయారీలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సౌమ్య తెలిపారు. బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ప్రొటీన్, క్యాల్షియం సమానంగా శరీరానికి అందేలా.. ఒక బార్ తయారు చేశారు. శరీరానికి ప్రొటీన్, ఫైబర్ ఎంత ముఖ్యమో క్యాల్షియం, జింక్, ఐరన్ సైతం అందాల్సి ఉంటుంది. ఒత్తిడి తగ్గించడంలో ఇవి ఉపయోగపడుతాయి.
4 భాషలు నేర్చుకొని
12 ఏళ్లకే కవితకు పెళ్లయింది. భర్తతోపాటూ ఉపాధి వెతుక్కుంటూ విజయనగరం నుంచి హైదరాబాద్ వచ్చారు. నలుగురు పిల్లల కుటుంబం భర్త ఒక్కరి సంపాదనతో నడవడం కష్టం కావటంతో శిల్పారామంలో ఒక స్టాల్లో పనికి చేరారు. చదువురాదు కాబట్టి వచ్చిన కొలువులో చేరారు. అక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది. తెలుగు తప్ప మరే భాష తెలియని దశ నుంచి అక్కడికి వచ్చే వేర్వేరు రాష్ట్రాల వాసులతో మాట్లాడి క్రమంగా తెలుగు, హిందీ, ఆంగ్లం, తమిళం నేర్చుకున్నారు. స్టాల్స్ యజమానులు విక్రయించే దుస్తులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎక్కడ డిజైన్ చేయిస్తున్నారనే విషయాలు తెలుసుకున్న తర్వాత తనే సొంతంగా కవితా హ్యాండిక్రాఫ్ట్స్ స్టాల్ను ఏర్పాటు చేశారు. ముద్ర పథకంలో రుణం తీసుకుని మంగళగిరి, కళంకారి, ఇకత్ వస్త్రాలను ఆయా ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. సొంతంగా కొన్ని డిజైన్స్ చేస్తున్నారు. చీరలు, డ్రెస్ మెటీరియల్స్, జ్యుయలరీ వర్క్ చేస్తున్నారు. తాను ఉపాధి పొందడమే కాదు మరో ఇద్దరు దర్జీలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి మహిళా పారిశ్రామికవేత్తగా మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.