logo

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలి

పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి రాజకీయ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌పటేల్‌గౌడ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం కాచిగూడలో జరిగిన మహాసభ హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల సమావేశంలో

Published : 05 Jul 2022 01:21 IST

బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌పటేల్‌గౌడ్‌

కాచిగూడ, న్యూస్‌టుడే: పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి రాజకీయ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌పటేల్‌గౌడ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం కాచిగూడలో జరిగిన మహాసభ హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ జనాభాలో 54 శాతం ఉన్న బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం 14 శాతానికి మించి లేదన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.కృష్ణ, పులిజాల కృష్ణ, ప్రధాన కార్యదర్శి మెట్టు ముత్యాలురావు, కార్యదర్శులు సీహెచ్‌ ప్రదీప్‌గౌడ్‌, నల్లెల్ల కిశోర్‌, కోశాధికారి శ్రీనివాస్‌గౌడ్‌, మెట్టు వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని