logo

బిడ్డా నీకు నచ్చిన భోజనం తెస్తున్నామని చెప్పి.. అంతలోనే అనంతలోకాలకు

బిడ్డా నీకు ఇష్టమైన భోజనం తీసుకొస్తున్నాం.. అంటూ నగరంలో చదువుకుంటున్న పెద్ద కుమార్తె వద్దకు బయలుదేరిన తల్లిదండ్రులు, చెల్లెలిని మృత్యువు వెంటాడింది.

Published : 05 Dec 2022 04:48 IST

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

మృతిచెందిన అంజలి, గోపాల్‌, స్వాతి

శంషాబాద్‌, షాద్‌నగర్‌: బిడ్డా నీకు ఇష్టమైన భోజనం తీసుకొస్తున్నాం.. అంటూ నగరంలో చదువుకుంటున్న పెద్ద కుమార్తె వద్దకు బయలుదేరిన తల్లిదండ్రులు, చెల్లెలిని మృత్యువు వెంటాడింది. అమ్మనాన్నల రాక కోసం ఎదురు చూస్తున్న కుమార్తెను చూడకుండానే తల్లిదండ్రుల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన ఆదివారం శంషాబాద్‌ మండల పరిధి పెద్దషాపూర్‌లో చోటు చేసుకుంది. శంషాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.శ్రీధర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఫారూక్‌నగర్‌ మండలం కడియాల కుంట తాండాకు చెందిన గోపాల్‌ నాయక్‌(47) లారీడ్రైవర్‌. భార్య అంజలి(42), పన్నెండేళ్ల లోపు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె చంపాపేటలోని వసతి గృహంలో ఉంటూ 6వ తరగతి చదువుతోంది. ఆదివారం కావడంతో భార్య, రెండో కుమార్తె స్వాతి(9)తో కలిసి గోపాల్‌ బైక్‌పై చంపాపేట బయలుదేరాడు. పెద్దషాపూర్‌ వద్దకు రాగానే డీసీఎం.. ముందు వెళుతున్న ఓ కారును ఢీకొని అదుపు తప్పి దంపతులు ప్రయాణిస్తున్న బైక్‌ మీదుగా దూసుకెళ్లింది. ప్రమాదంలో తల్లిదండ్రులు, కుమార్తె ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. దంపతుల ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని