logo

ఏటీఎంలలో చోరీకి యత్నం.. ముగ్గురి రిమాండ్‌

ఏటీఎంలలో చోరీలకు యత్నించిన ముగ్గురు నిందితులను ఓయూ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ చేశారు.

Published : 25 Jan 2023 01:46 IST

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఏటీఎంలలో చోరీలకు యత్నించిన ముగ్గురు నిందితులను ఓయూ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ చేశారు. మంగళవారం ఓయూలో కాచిగూడ ఏసీపీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. సోమవారం హబ్సిగూడ వద్ద తనిఖీలు చేస్తున్నప్పుడు ద్విచక్రవాహనంపై వస్తున్న ముగ్గురిపై అనుమానంతో స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా నాలుగు ఏటీఎంలలో చోరీలకు ప్రయత్నించినట్లు నేరాన్ని అంగీకరించారన్నారు. ఈనెల 12, 13 తేదీల్లో ఓయూ, చిలకలగూడ, నాచారం, ఉప్పల్‌ ఠాణా పరిధిలో ఏటీఎంలలో చోరీలకు విఫలయత్నం చేశారు. నిందితులలో ఒక మైనర్‌ ఉండగా, ఉప్పల్‌కు చెందిన ముక్కపాటి మనోహర్‌(22), తాడూరీ దీపక్‌(19) ఉన్నారు. వారి నుంచి ఓ ద్విచక్ర వాహనం, ఐదు ఫోన్లు, స్క్రూ డ్రైవర్‌ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌నాయక్‌, డీఐ పి.ఆంజనేయులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని