logo

Hyderabad: ప్రేయసి పెళ్లి ఫొటోలు చూసి ఆత్మహత్య.. మృతుడి జేబులో మంగళసూత్రం

జీవితాంతం తోడుంటానని మాటిచ్చిన ప్రేయసి మరొకరితో ఏడడుగులు నడిచిందని తెలిసి తల్లడిల్లిపోయాడు. ఆపై వారి వివాహ చిత్రాలు కంటపడడంతో ప్రేమించిన గుండె తట్టుకోలేకపోయింది.

Updated : 15 Mar 2023 09:14 IST

గణేశ్‌

హయత్‌నగర్‌, న్యూస్‌టుడే : జీవితాంతం తోడుంటానని మాటిచ్చిన ప్రేయసి మరొకరితో ఏడడుగులు నడిచిందని తెలిసి తల్లడిల్లిపోయాడు. ఆపై వారి వివాహ చిత్రాలు కంటపడడంతో ప్రేమించిన గుండె తట్టుకోలేకపోయింది. తాను కట్టాలనుకున్న తాళిని జేబులో పెట్టుకొని తరువుకు ఉరివేసుకుని తనువు చాలించాడు. ఈ ఘటన హయత్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. పందిగొట్ల లక్ష్మయ్య, అనంతమ్మ దంపతులు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరు గ్రామం వినాయకనగర్‌ కాలనీలో ముగ్గురు కుమారులతో కలిసి నివాసముంటున్నారు. వీరి రెండో కుమారుడైన గణేశ్‌(23) లారీ డ్రైవర్‌. స్థానికంగా నివాసముంటున్న ఓ యువతిని ఏడాదిగా ప్రేమిస్తూ.. పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఆమెకు తల్లిదండ్రులు ఇటీవలే మరో యువకుడితో వివాహం జరిపించారు. ఆ పెళ్లి ఫొటోలను ఆమె.. గణేశ్‌కి వాట్సప్‌లో పంపింది. అవిచూసి తీవ్ర మనస్తాపానికి గురై.. సోమవారం రాత్రి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం మునగనూరు శివారులో ఓ చెట్టుకు ఉరేసుకొని వేలాడుతూ ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలిపారు. అతని జేబులో మంగళసూత్రం ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని