తనిఖీలే కాదు.. అవగాహన
నగరంలో బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలు, గోదాంలలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం సరిగా స్పందించడం లేదు.
వాణిజ్య సముదాయాలు, సంస్థల జోలికి వెళ్లని అధికారులు
ప్రమాదం జరిగిన స్వప్నలోక్ భవనం
ఈనాడు, హైదరాబాద్: నగరంలో బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలు, గోదాంలలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం సరిగా స్పందించడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడి లోపాలపై ఒకటి, రెండు రోజులు హడావుడి చేయడం తప్ప.. జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, పోలీస్, విద్యుత్తు శాఖ అధికారులు ఎవరూ బహుళ అంతస్తుల భవనాల్లో భద్రత పరిశీలించడం లేదు. తనిఖీలు చేయడం లేదు. ఇంతే కాదు... కంపెనీలు, కార్యాలయాలు, దుకాణాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి అనూహ్యంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఎలా రక్షించుకోవాలన్న అంశాలపై అవగాహన కల్పించడం లేదు. ఫలితంగా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం జరుగుతోంది.
మార్పులు.. చేర్పులు..
వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పూర్తయ్యాక జీహెచ్ఎంసీ అధికారులు నివాసయోగ్య పత్రం ఇస్తున్నారు. అనంతరం భవనాల యజమానులు, దుకాణాలు, కంపెనీల యజమానులు ఆధునికీకరణ పేరుతో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఎక్కువగా ఐటీ సంస్థలు, ప్రైవేటు సంస్థల్లో అద్దాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ్య విశాలమైన గదులను గోప్యత, భద్రత పేరుతో చిన్న గదులుగా మార్చి వాటికి అద్దాలు, ఖరీదైన కలప తలుపులు బిగిస్తున్నారు. మార్పులు, చేర్పులను జీహెచ్ఎంసీ అధికారులు, అగ్నిమాపకశాఖ అధికారులు పరిశీలించడం లేదు. ్య అగ్నిమాపక శాఖ అధికారులు రెండేళ్ల నుంచి ‘వార్షిక నిర్వహణ పత్రం’ పేరుతో భవనాలు, వాణిజ్య సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీల నుంచి అగ్నిమాపక భద్రత పత్రాలను తీసుకుంటున్నారు. వాటిలో ఉన్నదే చూస్తున్నారు తప్ప.. అక్కడికి వెళ్లి పరిశీలించడం లేదు. నీళ్లపైపు, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఇసుక, తప్పనిసరి. అయినా చాలా భవనాల్లో ఎక్కడా కనిపించవు.
ఆపద వేళ ఏం చేయాలో తెలీక..
అగ్నిప్రమాదం జరిగితే మంటలను ఎలా ఆర్పాలి, ఎవరికి సమాచారం ఇవ్వాలి? అందుబాటులో నీళ్లుంటే ఎలా వినియోగించాలి? విద్యుత్తు సరఫరా ఎప్పుడు నిలిపేయాలి? గ్యాస్ సిలిండర్లుంటే ఏం చేయాలన్న అంశాలపై దుకాణాలు, కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వారికి అగ్నిమాపక శాఖ అవగాహన కల్పించాలి. లిఫ్టులు ఉపయోగించకుండా ప్రత్యామ్నాయాలు ఎలా ఎంచుకోవాలి? అనేది ప్రయోగాత్మకంగా వివరించాలి. ఈ విషయం తెలియకనే స్వప్నలోక్ కాంప్లెక్స్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు.
బాధిత కుటుంబాలకే శిక్ష.. కారకులకేది?
ఈనాడు, హైదరాబాద్: వందల కిలోమీటర్ల నుంచి పొట్టకూటికి వచ్చిన బిహార్ కూలీలు.. అర్ధరాత్రి హాహాకారాలు చేస్తూ బూడిదగా మారారు. కుటుంబం కోసం కాయకష్టం చేసుకుందామని దుకాణంలో కార్మికులుగా చేరిన ముగ్గురు గుజరాతీయులు ఆనవాళ్లు లేకుండా పోయారు. తాజాగా కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన ఆరుగురు యువతీ యువకులు ఆకస్మిక అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సికింద్రాబాద్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదాల్లో ప్రాణాలొదిలిన పేద బతుకులు.. యజమానుల ఉదాసీనత, అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి ఉదాహరణలు. సికింద్రాబాద్ డెక్కన్ మాల్లో ఘోర అగ్ని ప్రమాదం తర్వాత అగ్నిమాపక శాఖ వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో తనిఖీలు చేపట్టింది. కొద్దిరోజుల సోదాల్లోనే 1800 వాణిజ్య సముదాయాలు, రసాయన, వ్యర్థాలు నిల్వచేసే గోదాముల్లో కనీస అగ్ని నివారణ సౌకర్యాలు లేవంటూ నిర్ధారించి.. నోటీసులిచ్చింది.
హెచ్చరికలతోనే సరి..
ఏటేటా పెరుగుతున్న అగ్నిప్రమాదాల్లో ఆస్తి, ప్రాణనష్టం పెరుగుతోంది. ఏదైనా ప్రమాదం జరగ్గానే ఆగమేఘాలపై అధికారులు హెచ్చరికలు జారీచేస్తున్నారు. యజమానులు త్రుణమో.. ఫణమో బాధితులకు సాయం అందించినట్టు నటించి కేసుల నుంచి బయటపడుతున్నారు. అగ్నిమాపకశాఖ, జీహెచ్ఎంసీ, పోలీసుల సమన్వయ లోపం సామాన్యుల ప్రాణాల మీదకు తెస్తోంది. అగ్నిప్రమాదానికి భవన యజమానులు, వ్యాపారులే కారణమంటూ నివేదికల్లో నిగ్గు తేల్చినా.. ఏ ఒక్కరికీ శిక్షలు పడిన దాఖలాల్లేవు. మరోవైపు తమవారికి కోల్పోయిన కుటుంబాలు భారంగా బతుకీడుస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక