logo

డీజీపీ కార్యాలయ ఉద్యోగులకు వైద్య శిబిరం

డీజీపీ కార్యాలయ అధికారులు, ఉద్యోగుల కోసం సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

Published : 28 Mar 2023 02:49 IST

శిబిరాన్ని ప్రారంభిస్తున్న డీజీపీ అంజనీకుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: డీజీపీ కార్యాలయ అధికారులు, ఉద్యోగుల కోసం సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రాయల్‌ పెర్ల్‌ స్కాల్‌ ఇనిస్టిట్యూట్‌తో కలిసి వాసవి హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఈ శిబిరాన్ని డీజీపీ అంజనీకుమార్‌ ప్రారంభించారు. శిబిరానికి హాజరైన వారికి మొత్తం 11 రకాల వైద్య పరీక్షలు జరిపారు. అదనపు డీజీ అభిలాష బిస్త్‌, డీఐజీ రమేష్‌రెడ్డి, వాసవి హాస్పిటల్‌ వైద్యులు టి.నారాయణ జానకిరామ్‌, శిల్పి భాటియా శర్మ, అవినాష్‌, శివకుమార్‌, భవ్య, సీమ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని