logo

‘యోగా మహోత్సవ్’.. ఏర్పాట్లను పరిశీలించిన కిషన్‌రెడ్డి

అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్‌ 21) సందర్భంగా 25 రోజుల కౌంట్‌డౌన్‌తో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం యోగా మహోత్సవ్ చేయబోతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

Published : 26 May 2023 19:21 IST

హైదరాబాద్‌: అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్‌ 21) సందర్భంగా 25 రోజుల కౌంట్‌డౌన్‌తో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం యోగా మహోత్సవ్ చేయబోతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే మొదటిసారిగా యోగా మహోత్సవ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామన్నారు. రేపు ఉదయం వేల మంది యోగా గురువుల ఆధ్వర్యంలో ‘యోగా మహోత్సవం’ ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మంత్రులు, సినిమా ఆర్టిస్ట్‌లు, క్రీడాకారులను కార్యక్రమానికి ఆహ్వానించినట్లు కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ మేరకు పరేడ్‌ గ్రౌండ్స్‌లో యోగా మహోత్సవ్‌ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను కిషన్‌రెడ్డి పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని