బూడిద తరలింపు సాగేనా..!
ఎన్టీపీసీలో బొగ్గు వినియోగం తర్వాత వెలువడే బూడిదకు డిమాండ్ పెరిగింది. మరోవైపు బూడిద వినియోగించే పరిశ్రమలు కచ్చితంగా ఆన్లైన్లో ఈ-వేలంలో పాల్గొని తమ పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్రం సూచించింది.
దళారుల ప్రవేశంతో సమస్యలు
ఎన్టీపీసీలో బూడిద రవాణా (పాతచిత్రం)
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి: ఎన్టీపీసీలో బొగ్గు వినియోగం తర్వాత వెలువడే బూడిదకు డిమాండ్ పెరిగింది. మరోవైపు బూడిద వినియోగించే పరిశ్రమలు కచ్చితంగా ఆన్లైన్లో ఈ-వేలంలో పాల్గొని తమ పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్రం సూచించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ, శక్తి వనరుల శాఖలు సంయుక్తంగా ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల మూలంగా చిన్నతరహా పరిశ్రమలకు బూడిద తరలింపు అవరోధంగా మారింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 400కు పైగా ఇటుకబట్టీలున్నాయి. వీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది జీవిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు సైతం రామగుండంలోని ఎన్టీపీసీలోని బూడిద అవసరమవుతుంది. కాగా ఈ బూడిదను ఆన్లైన్లో ఈ-వేలం పాట నిర్వహించి అత్యధిక ధర కోట్ అయిన తర్వాత ఆ ధరకే కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఆన్లైన్లో నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఇచ్చి వేలం ప్రక్రియ ముగిసినట్లు ప్రకటించింది. ఆన్లైన్లో వేలం గురించి ఇటుకబట్టీల నిర్వాహకులకు పూర్తిస్థాయిలో తెలియకపోవడంతో టెండర్లు వేయలేకపోయారు. ఇదే క్రమంలో బడావ్యాపారులు, దళారులు, రాజకీయ నాయకులు బినామీ పేర్లతో టెండర్లు దక్కించుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాము చెప్పిన ధరకే కొనుగోలు చేయాలని ఆంక్షలు విధిస్తుండంతో బట్టీల యజమానులకు భారంగా మారింది. ఒక్కోలారీ బూడిదకు గతంలో రూ.4వేలు చెల్లించేవారు. ప్రస్తుతం అదే బూడిదకు రూ.18వేల వరకు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రస్తుతం ఒక్కో ఇటుక రూ.6కు హోల్సేల్గా లభిస్తుండగా వేలం పాట తర్వాత కొనుగోలు చేసిన బూడిదతో ఇటుకలు తయారు చేస్తే దాదాపు ఒక్కో ఇటుక రూ.15 వరకు పలికే అవకాశం ఉంది. దీంతో ప్రజలపై, భవన నిర్మాణ రంగంపై ఆర్థిక భారం పడనుంది. ఇదంతా ఎందుకు వచ్చిన తంటా అనుకుంటూ కొందరు ఇటుక బట్టీల నిర్వాహకులు తయారీని నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నారు.
మూసివేత దిశగా ఇటుకబట్టీలు
ఎన్టీపీసీ నుంచి వచ్చే బూడిద తెలంగాణవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని ఇటుక బట్టీలకు తరలివెళుతోంది. దీని ద్వారా దాదాపు 6 లక్షల పైచిలుకు మందికి ఉపాధి దొరుకుతుంది. కాగా గత సెప్టెంబర్ నెలలో పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం బూడిదను ఉచితంగా ఇవ్వవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్టోబర్ 29న ఎన్టీపీసీ నుంచి బూడిద కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు ఆన్లైన్లో వేలం పాటలో పాల్గొనాలని పేర్కొంది. ఈ వేలం పాటలో కొందరు రాజకీయ నాయకులు, దళారులు రంగప్రవేశం చేసి ఎక్కువ ధరకు బూడిద తరలింపు కాంట్రాక్టు దక్కించుకున్నారు. చెప్పిన ధరకే కొనుగోలు చేయాలని తమపై జులం ప్రదర్శిస్తున్నారని పలువురు చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారుల రంగప్రవేశం వల్ల టన్ను బూడిదకు రూ.404 ధర పలుకుతుంది. దీంతో ఇటుకబట్టీల యజమానులపై భారం పడుతుంది. దీనికి తోడు పెట్రోల్, డీజిల్, జీఎస్టీ, ఇతరత్రా రవాణా ఖర్చులు భరించలేని స్థితికి చేరుకోవడంతో కొన్ని బట్టీలు మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికైనా ఎన్టీపీసీ అధికారులు అనర్హులైన దళారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పోటీవల్లే ఈ దుస్థితి
ఎన్టీపీసీలో వెలువడే 40 లక్షల టన్నుల బూడిదకు టెండర్లు పిలవడంతో ఇటుకబట్టీల వ్యాపారులు, కొందరు దళారులు కలిసి 26లక్షల టన్నుల బూడిదకు రూ.404 చొప్పున టెండర్లు దక్కించుకున్నారు. ఎన్టీపీసీ అమ్ముకునే బూడిదకు సంవత్సరానికి దాదాపు రూ.165 కోట్ల ఆదాయం రానుంది. వీళ్లు టెండర్లు దక్కించుకున్నప్పటికీ వర్క్ ఆర్డర్ పొందకుండా జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వీరు అనుమతులు పొందితే సంవత్సరానికి ఎన్టీపీసీకి రూ.120 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇంత మొత్తంలో చెల్లించేందుకు సుముఖంగా లేకపోవడంతో టెండర్లు, దళారులు లేకుండా బూడిద సరఫరా చేసేలా ఎన్టీపీసీ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు జమ్మికుంటకు సీఎం.. 8న వేములవాడకు పీఎం
[ 30-04-2024]
పెరుగుతున్న ఉష్ణోగ్రతల మాదిరిగానే పార్టీలు ప్రచార వేడిని క్రమంగా పెంచుతున్నాయి. ఉత్తర తెలంగాణలో కీలకమైన జిల్లాగా పేరొందిన ఉమ్మడి కరీంనగర్పై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి. -
ఎన్నికల బరిలో 99మంది
[ 30-04-2024]
ఎట్టకేలకు లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిచే వారెవరో తేలింది.. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం మధ్యాహ్నంతో ముగియడంతో అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైంది.. -
సెలవు పెట్టలేదు.. విధులకు రాలేదు!
[ 30-04-2024]
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని పలువురు వైద్యులు సెలవు పెట్టకుండా, విధులకు హాజరుకాకపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులుపడ్డారు. -
తగ్గుతున్న మామిడి ధర
[ 30-04-2024]
మామిడి ధరలు రోజురోజుకు తగ్గుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
కమల దళంలో మారిన సమీకరణలు
[ 30-04-2024]
పెద్దపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ నేత బోర్లకుంట వెంకటేశ్నేత భాజపా గూటికి చేరారు. -
నెరవేరని వస్త్రోత్పత్తి లక్ష్యం
[ 30-04-2024]
ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి ఏకరూప దుస్తులు విద్యార్థులకు సిద్ధం చేయడం అసాధ్యమనిపిస్తోంది. -
చైతన్య పలితం.. శాంతియుతం
[ 30-04-2024]
ఒకప్పుడు ఎన్నికలంటేనే గ్రామాల్లో పగలు, ప్రతీకారాలు కనిపించేవి. నిత్యం గొడవలతో ఘర్షణ వాతావరణం నెలకొనేది. -
యువత.. కురిపించాలి మమత
[ 30-04-2024]
నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. -
సుర్రుమంటూ సూరీడు.. ఉసూరుమంటూ నాయకుడు
[ 30-04-2024]
‘ మెల్లగా తెల్లారిందే అలా..!’ అనుకుంటూ రాజకీయ నాయకులు ప్రచారానికి పరుగులెత్తిన కొద్దిసేపటికే భానుడు సుర్రుమంటున్నాడు.. ఉదయం ఏడింటికే భగభగ మండుతున్నాడు.. -
రిజర్వేషన్లు రద్దు చేయబోమని ప్రకటించరెందుకు?
[ 30-04-2024]
రిజర్వేషన్లు రద్దు చేయబోమని భాజపా, ఆర్ఎస్ఎస్ ఎందుకు ప్రకటించడం లేదని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీగౌడ్ ప్రశ్నించారు. -
ఏసీబీకి చిక్కిన హెడ్కానిస్టేబుల్
[ 30-04-2024]
జగిత్యాల జిల్లా బీర్పూర్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సామల్ల మనోహర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. -
ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
[ 30-04-2024]
జిల్లాలో అందిస్తున్న ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో తెలిపారు.