షడ్రుచులు..సమ్మిళిత ఫలితాలు!
వసంత రుతువు సాక్షిగా వెలుగులు పంచేందుకు శుభకృత్ పేరు మార్చుకుని శోభకృత్గా మన ముంగిటకొచ్చింది. వసంతమై పరవశిస్తూ.. శిశిరంలో రాలిన ఆకుల్లా ‘చేదు’ జ్ఞాపకాలను మరిపిస్తూ కొత్త చిగురు తొడిగిన కొమ్మలా ‘తీపి’ గురుతులు పంచాలని ఉవ్విళ్లూరుతోంది
కొత్త సంవత్సరం శుభాలు కలగాలి
నేడు శోభకృత్ నామ ఉగాది
న్యూస్టుడే, మేడిపల్లి, ఈనాడు, కరీంనగర్
వసంత రుతువు సాక్షిగా వెలుగులు పంచేందుకు శుభకృత్ పేరు మార్చుకుని శోభకృత్గా మన ముంగిటకొచ్చింది. వసంతమై పరవశిస్తూ.. శిశిరంలో రాలిన ఆకుల్లా ‘చేదు’ జ్ఞాపకాలను మరిపిస్తూ కొత్త చిగురు తొడిగిన కొమ్మలా ‘తీపి’ గురుతులు పంచాలని ఉవ్విళ్లూరుతోంది.. ఈ ఉగాది శుభ సమయాన మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పంచాంగాన్ని అక్షరీకరిస్తే ఎలా ఉంటుందో మీ కోసం...
* మహిళలే మహారాణులు అని కొలిచే జిల్లాలో అధికారులుగానూ, ప్రజాప్రతినిధులు గానూ మహిళలు పదవుల్లో ఉన్నారు. కానీ గృహహింస పేరిట గత మూడేళ్లలో 3,357 కేసులు నమోదయ్యాయనే చేదు వార్త అందరినీ కలచి వేస్తోంది. ఈ ఏడాది నుంచయినా మనమంతా అతివలకు అండగా ఉందాం.
* కొత్త ఏడాదిలో అడుగు పెట్టే సమయానికే టీఎస్పీఎస్సీ పరీక్షలు రద్దు చేశారని తెలిసి యువకులు నైరాశ్యంలో ఉన్నారు. అక్టోబరులో జరిగిన గ్రూప్-1ను ఉమ్మడి జిల్లా నుంచి 27,100 మంది యువత పరీక్షలు రాశారు. పరీక్షల ఫలితంతో ‘తీపి’ కబురు చేరుతుందనుకుంటే ‘వగరు’ లాంటి లీకేజీ వార్త యువకులను కలచి వేసింది. ప్రవేశ పరీక్ష లీకేజీకి, జిల్లాకూ సంబంధాలుండటం యువకులను ‘కారాలు’ మిరియాలు నూరేలా చేస్తోంది. అయినా వెలుగులు పంచేందుకే వచ్చిన శోభకృత్ నామ సంవత్సరం యువకుల్లో మనోధైర్యం కోల్పోకుండా అండగా ఉంటుంది. గతాన్ని చేదు అనుభవంగా భావించి మళ్లీ నిర్వహించనున్న పరీక్షలకు యువకులు సిద్ధం కావాలి. పదో తరగతి, ఇంటర్, జేఈఈ, నీట్ లాంటి పరీక్షలు రాసే విద్యార్థులకు కూడా ఈ ఏడాది శ్రమకు తగిన ‘తీపి’ కబురు అందాలి.
ఉగాది అనగానే షడ్రుచుల మిళితమైన పచ్చడి గుర్తుకు వస్తుంది. తీపి, వగరు, కారం, చేదు, పులుపు, ఉప్పు.. వీటన్నింటినీ సమపాళ్లలో తీసుకుంటేనే ఆరోగ్యం అన్నట్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ అన్ని రుచులను పోలిన ఘటనలే కనిపిస్తున్నాయి. నూతన తెలుగు వత్సరాది రాకమునుపే వడగళ్లు, అకాల వర్షం రైతన్నకు ‘చేదు’ అనుభవాన్ని మిగిల్చాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో జరిగిన పంట నష్టం రైతన్నకు కడగండ్లను మిగిల్చింది. కారం లాంటి ఘటనలు ఎదురైనా పంటలపై మమకారం కలిగిన రైతులు శ్రమనే నమ్ముకుంటే ఈ శోభకృత్ నామ సంవత్సరంలో తీపి దిగుబడులు సాధిస్తారనడంలో అతిశయోక్తి లేదు.
ఈ సంవత్సరం పాడి పంటలకు బలరామకృష్ణులు అధినాయకులని పంచాంగం చెబుతోంది. సకాలంలో వర్షాలు, పాడి పంటల వృద్ధి, ప్రాణికోటికి సుఖంగా ఉన్నందున తొలుత వ్యయం ఎక్కువైనా ఆదాయం పెరిగేలా దిగుబడులపై దృష్టి నిలపాలి.
* వాతావరణ మార్పులు పంటలపై ప్రభావం చూపుతున్నాయి. ఉగాది పచ్చడిలో వేప పువ్వు కలుపుదామనుకుంటే చాలా ప్రాంతాల్లో వేప చెట్లకే ఫంగస్ వ్యాపించింది. మామిడి కాయలపై వడగళ్లు ప్రభావం చూపాయి. పసుపునకు మద్దతు ధర కరవైంది. ముత్యంపేట చక్కెర కర్మాగారం మూతబడి చెరకు రైతులు చేదు ఫలితాలను అనుభవిస్తున్నారు. రైతుల గోస తీరేలా, పంటల దిగుబడి బాగుండేలా శోభకృత్ నామ సంవత్సరం శుభ ఫలితాలను ఇవ్వాలని కోరుకుందాం.
* ఈ ఏడాది ఎన్నికల నామ సంవత్సరంగా పేర్కొంటున్నారు. ఇప్పటికే పాదయాత్రల పేరిట రాజకీయ వేడి పెరిగింది. అవమానాలు ఎదురైనా, రాజపూజ్యం దక్కక పోతుందా అని పలువురు రాజకీయ నాయకులు ఎదురు చూస్తున్నారు. గతంలో చేదు ఫలితాలు పొందిన నాయకులు ఇప్పుడు తీపి కబురు అందకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. పులుపు, ఉప్పు కలగలిపి మరీ ఓటరు నాడి పట్టుకునేందుకు యత్నిస్తారు. టికెట్ల వేటలో ప్రత్యర్థుల ‘గ్రహణం’ పట్టినా ఎలాగోలా ‘రాజు’ దృష్టిలో పడేందుకు నానా తంటాలూ పడతారు.
‘ఆదాయం’ ఘనమైనా..!
ఉమ్మడి జిల్లా స్థూల ఆదాయం మరింత పెరగాలి. ఇప్పటికే ప్రతి ఆర్థిక సంవత్సరంలో సహజ సంపద (గనులు, ఇసుక) ద్వారా సమకూరుతున్న కోట్లాది రూపాయల రాబడితో రాష్ట్రంలోనే తొలి ఐదుస్థానాల్లో నిలుస్తోంది. ఇదే సమయంలో తలసరి ఆదాయం విషయంలో నాలుగు జిల్లాలు దాదాపుగా రూ.1.75 లక్షల సగటుతో జోరుమీదున్నాయి. గతేడాది జిల్లాభివృద్ధికి వచ్చే నిధులు దండిగానే అందాయి. ఆదాయం, వ్యయం విషయంలో సమతూకమనే పాత్ర పోషిస్తున్నా.. ఇంకా ప్రగతి అన్ని విధాలుగా అందేందుకు ఈ నవవసంతం వేదికగా మారాలి.
శుభకృత్ నుంచి శోభకృత్గా మారిన తెలుగు సంవత్సరంలో యువకులు, మహిళలు, విద్యార్థులు.. అన్ని రంగాల వారు శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ.. షడ్రుచుల్లో చేదు, వగరు, కారం ఫలితాలు తగ్గి.. తీపి ఎక్కువుండాలని.. జిల్లా వృద్ధి చెందాలని ఆశిద్దాం!!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజామాబాద్ను గుండెల్లో పెట్టుకుంటా
[ 07-05-2024]
‘‘ నేను గులాబీ జెండా ఎత్తిన నాడు.. నిజామాబాద్ నా వెంట నిలిచి జిల్లా పరిషత్తును గెలిపించింది. -
కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిరసన
[ 07-05-2024]
కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిబ్బందిపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం, రికార్డులను ఎత్తుకెళ్లిన ఘటనపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సునీతారాణి తెలిపారు. -
భాజపాశ్రేణుల్లో జోష్!
[ 07-05-2024]
రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రూ.7 వేల కోట్లతో పునరుద్ధరించి వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం.. కేంద్ర పథకాలతో ప్రజలు పెద్దఎత్తున లబ్ధి పొందారు.. -
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
[ 07-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల కమిషనింగ్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. -
ఇలాగైతే ఓటేసేదెలా?
[ 07-05-2024]
సినిమా థియేటర్లో సీట్ల సంఖ్యను బట్టి టిక్కెట్లు విక్రయిస్తారు. ప్రేక్షకుల్లో ఆదరణను అంచనా వేస్తూ అదే సినిమాను రెండు, మూడు థియేటర్లలోనూ ఆడిస్తారు. -
ఇదీ మా ఎజెండా
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఆయా పార్టీలు మ్యానిఫెస్టోలు ప్రకటించి ఇప్పటికే జనంలోకి తీసుకెళ్లాయి. -
భాజపాను ఇంటికి సాగనంపాలి
[ 07-05-2024]
గత ఎన్నికల్లో దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను వంచించిన నరేంద్రమోదీని, మతోన్మాద ముసుగులో దేశాన్ని పరిపాలిస్తున్న భాజపాను ఇంటికి సాగనంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
ప్రచార ఖర్చులు విధిగా సమర్పించాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రచార ఖర్చుల వివరాలను విధిగా సమర్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. -
ఈవీఎం కమిషనింగ్ పూర్తి చేయాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా రామగుండం నియోజకర్గం పరిధిలో నిర్వహించే ఓటింగ్కు సంబంధించి ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, పెద్దపల్లి ఎన్నికల అధికారి ముజమ్మిల్ఖాన్ సోమవారం పరిశీలించారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
[ 07-05-2024]
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని, మే 13న పోలింగ్ సజావుగా జరిగేలా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి పేర్కొన్నారు.