విభిన్న పార్టీలు..ఈ గ్రామాలు...
నేరెళ్ల, మెట్పల్లి, బుగ్గారం, ఇందుర్తి, మేడారం ఇవన్నీ తెలిసిన పేర్లే అనుకుంటున్నారా! ఆగండి. వాటికో ప్రత్యేకత ఉంది.
నాడు నియోజకవర్గ కేంద్రాలు
బుగ్గారం గ్రామంలోని గడి
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: నేరెళ్ల, మెట్పల్లి, బుగ్గారం, ఇందుర్తి, మేడారం ఇవన్నీ తెలిసిన పేర్లే అనుకుంటున్నారా! ఆగండి. వాటికో ప్రత్యేకత ఉంది. ఇవన్నీ ఒకప్పుడు శాసనసభ నియోజకవర్గాల పేర్లు. 1957 నుంచి 2009 నియోజకవర్గాల పునర్విభజన వరకు అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఒక వెలుగు వెలిగిన ప్రాంతాలు. వీటిలో కొన్ని ఇప్పుడు మండల కేంద్రాలు కాగా, ఒకటి పురపాలక సంఘంగా ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే పోరాటాల పుట్టినిల్లు. 1952లో తొలి ఎన్నికలు జరిగే నాటికి కమ్యూనిస్టులపై నిషేధం ఉండటంతో వారంతా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పేరుతో పోటీ చేయగా కాంగ్రెస్కు గట్టి పోటీనిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎంతో మంది ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల నేపథ్యంలో ఈ నియోజకవర్గాల గురించి, వాటి ప్రస్తుత పరిస్థితిపై ఒకసారి అవలోకనం చేసుకుందాం.
బుగ్గారం: 1957లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఆది నుంచి కాంగ్రెస్, తెదేపా, స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోరు నడిచింది. మొదటి ఎమ్మెల్యే మోహన్రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. 1978లో ఇందిరా గాంధీ ప్రభంజనంలో కాంగ్రెస్ అభ్యర్థిగా అంబల్ల రాజారాం, 1983లో కడకంట్ల గంగారాం గెలుపొందారు. 1985, 1994లో శికారి విశ్వనాథం (తెదేపా), 1989, 1999, 2004లో జువ్వాడి రత్నాకర్రావు తొలుత స్వతంత్ర అభ్యర్థిగా తర్వాత వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్సార్ మంత్రి వర్గంలో దేవాదాయశాఖ మంత్రిగా పని చేశారు. 2009లో ఈ నియోజకవర్గం పెగడపల్లి, గొల్లపల్లి, మేడారం, వెల్గటూరు, ధర్మారం, బుగ్గారం, ధర్మపురి మండలాలతో ధర్మపురి (ఎస్సీ రిజర్వుడు) నియోజకవర్గంగా మారింది. 2016 జిల్లాల పునర్విభజన, కొత్త మండలాల ఏర్పాటులో బుగ్గారం 11 గ్రామాలతో మండల కేంద్రమైంది.
మేడారం: 1957లో ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి జనరల్ స్థానంలో పీడీఎఫ్ నుంచి జి.లక్ష్మారెడ్డి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983, 1989లో రెండు సార్లు కాంగ్రెస్ తరఫున, 1999లో తెదేపా తరఫున మాతంగి నర్సయ్య మొత్తం మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో చివరిసారి కొప్పుల ఈశ్వర్ ఎన్నికయ్యారు. కాకతీయుల సామంతుడు మేడరాజు పాలనకు సాక్ష్యంగా ఇక్కడ నందిని ఏర్పాటు చేశారు. ధర్మారం మండలంలోని నందిమేడారం గ్రామంగా ప్రాచుర్యంలో ఉంది. పేరుకే ఇది నియోజకవర్గ కేంద్రమైనా ప్రభావం అంతా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోనే ఉండేది. ప్రస్తుతం ఈ గ్రామం ధర్మపురి నియోజకవర్గంలో ఉండగా రామగుండం ప్రత్యేక నియోజకవర్గమైంది.
కమలాపూర్: 1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గం జనరల్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా 1967లో కాంగ్రెస్ తరఫున కేవీ నారాయణరెడ్డి గెలుపొందారు. 1972, 1978లో స్వతంత్ర జనతా పార్టీ నుంచి పరిపాటి జనార్దన్రెడ్డి గెలుపొందారు. 1985, 1989, 1994, 1999లలో తెదేపా నుంచి ముద్దసాని దామోదర్రెడ్డి ఎన్నికయ్యారు. చివరగా 2004లో ఈటల రాజేందర్ గెలుపొందారు. 2009లో హుజూరాబాద్లో కలిసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కమలాపూర్ మండలం జిల్లాల పునర్విజనలో హనుమకొండలో కలిసింది.
మెట్పల్లి: ఖాదీ వస్త్రాలకు చిరునామాగా నిలిచిన ఈ పట్టణానికి ఉమ్మడి జిల్లాలో ఎంతో ప్రత్యేకత ఉంది. 1957లో జనరల్ స్థానంగా ఏర్పడిన ఈ నియోజకవర్గానికి మొదటి ఎమ్మెల్యేగా పీడీఎఫ్ పార్టీ నుంచి జె.ఆనందరావు ఎన్నికయ్యారు. కాంగ్రెస్, భాజపా, స్వతంత్ర అభ్యర్థులు వివిధ ఎన్నికల్లో గెలిచారు. భాజపా సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్రావు 1985, 1989, 1994లో మూడు సార్లు జయకేతనం ఎగురవేశారు. నియోజకవర్గం రద్దయిన 2004లో చివరిసారిగా కొమిరెడ్డి రాములు జేపీ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రంగా కొనసాగిన మెట్పల్లి తర్వాత కోరుట్ల నియోజకవర్గంలో కలిసిపోయింది. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ప్రముఖ పురపాలక సంఘంగా, రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కొనసాగుతోంది. ఇక్కడ రాజకీయ, వాణిజ్య కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి.
నేరెళ్ల: సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్లపల్లి మండలంలో ఉన్న ఈ గ్రామం నియోజకవర్గ కేంద్రంగా ఉండేది. 1952లో ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున బండారి జానకీరాం తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1967, 1972లలో స్వతంత్ర అభ్యర్థిగా గొట్టె భూపతి గెలిచారు. 1978, 1983, 1989లలో కాంగ్రెస్ నుంచి పాటిరాజం ప్రాతినిధ్యం వహించారు. 1994, 1999లలో తెదేపా నుంచి సుద్దాల దేవయ్య, 2004లో చివరగా భాజపా నుంచి కాసిపేట లింగయ్య గెలుపొందారు. తర్వాత పూర్తిగా సిరిసిల్ల నియోజకవర్గంలో కలిసి ప్రస్తుతం గ్రామ పంచాయతీగా కొనసాగుతోంది.
ఇందుర్తి: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాటానికి వేదికగా నిలిచిన హుస్నాబాద్ ప్రాంతంలోనిదే ఈ నియోజకవర్గం. 1957లో ఈ జనరల్ స్థానం నుంచి పీడీఎఫ్ తరఫున పి.చొక్కారావు తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1972లో ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు బద్దం ఎల్లారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. 1978, 1985, 1989లో మూడు సార్లు దేశిని చినమల్లయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో చాడ వెంకట్రెడ్డి చివరి సారి ఎన్నిక కాగా, 2009లో ఈ నియోజకవర్గం కొహెడ, చిగురుమామిడి, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, హుస్నాబాద్, సైదాపూర్ మండలాలతో కలిపి హుస్నాబాద్ నియోజకవర్గంగా ఏర్పడింది. చిగురుమామిడి మండలంలో ప్రస్తుతం ఇందుర్తి ఒక గ్రామంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభ్యర్థులను చూసి ఓటు వేయండి
[ 27-04-2024]
కాంగ్రెస్, భారాసలకు ఆ పార్టీల కార్యకర్తలే ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
జాతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యం
[ 27-04-2024]
జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క పని కూడా కాలేదని, అభివృద్ధి జరగాలంటే గులాబీ జెండా ఎంపీ అవసరమని కరీంనగర్ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
వేసవి వేళ.. ఆటల వేడుక
[ 27-04-2024]
వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడితో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తరువాత ఊపిరి పీల్చుకుంటారు. -
బొగ్గు బాయిల చుట్టూ రాజకీయం
[ 27-04-2024]
ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం మొత్తం బొగ్గు బాయిల చుట్టే తిరుగుతోంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులున్నారు. దీంతో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. -
ఎన్నికల వేళ నగదు కష్టాలు
[ 27-04-2024]
ఎన్నికల కోడ్ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. -
నారీమణులే నిర్ణేతలు
[ 27-04-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే అతివల సంఖ్యే అధికంగా ఉంది. -
ఇంటి నంబర్ల గోల్మాల్!
[ 27-04-2024]
కరీంనగర్ శివారు ప్రాంతాల్లో భూఆక్రమణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. -
భానుడి భగభగ...
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 27-04-2024]
ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తండ్రి కళ్లెదుటే నీటి మునిగి మృతి చెందిన సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది. -
పశుపక్షాదుల దాహం తీర్చేలా..
[ 27-04-2024]
వేసవిలో ఎండల తీవ్రతకు మనుషులే దప్పికతో అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై సంచరించే పశువులు, పక్షులకు తాగునీరు అందక అల్లాడి ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొనకుండా ఉండేందుకు కోరుట్ల పట్టణంలో పుర కమిషనర్ బట్టు తిరుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
[ 27-04-2024]
ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సౌకర్యాలు లేక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
[ 27-04-2024]
అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్లో జాబితా సిద్ధమవుతోంది. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
అడవిని మింగేస్తున్న అనకొండలు
[ 27-04-2024]
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. -
కబ్జాల పర్వం!
[ 27-04-2024]
అక్రమార్కుల కన్ను మున్సిపల్ లేఅవుట్ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్ లేఅవుట్ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం. -
మద్యం, నగదు అక్రమ రవాణా నివారణకే తనిఖీలు
[ 27-04-2024]
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ సదుపాయం.. వినియోగానికి దూరం
[ 27-04-2024]
ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే నామపత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. -
హరిత లక్ష్యం.. కార్యాచరణ సిద్ధం
[ 27-04-2024]
పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు గ్రామాల్లోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?