విద్యార్థి నాయకుడి నుంచి..
భాజపా పెద్దపల్లి అభ్యర్థి ఎంపికలో పది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు పార్టీలో సీనియారిటీకే ప్రాధాన్యం దక్కింది.
న్యూస్టుడే, పెద్దపల్లి: భాజపా పెద్దపల్లి అభ్యర్థి ఎంపికలో పది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు పార్టీలో సీనియారిటీకే ప్రాధాన్యం దక్కింది. పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి దుగ్యాల ప్రదీప్కుమార్కు అభ్యర్థిత్వం ఖరారైంది. 35 సంవత్సరాలుగా భాజపా, అనుబంధ సంస్థల్లో పని చేస్తున్నారు. ఉన్నత పాఠశాలలో చదువుకునే రోజుల్లో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1985లో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో సుల్తానాబాద్ జూనియర్ కళాశాల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1986-87లో ఏబీవీపీ భాగ్ ప్రముఖ్గా పని చేశారు. 1988-89లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏబీవీపీ కన్వీనర్గా వ్యవహరించారు. 1989-90లో నెల్లూరు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, 1990-92 వరకు నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, 1992-97 వరకు భాగ్యనగర్ విభాగ్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పని చేశారు. 1997-98, 1998-99 రెండు పర్యాయాలు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు. అనంతరం భాజపాలో వివిధ బాధ్యతలు చేపట్టారు. కమిటీల సభ్యుడిగా పని చేశారు. 2012-14లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులు కాగా, 2014 నుంచి ప్రధానకార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
వ్యక్తిగతం
పేరు: దుగ్యాల ప్రదీప్కుమార్
విద్యార్హతలు: ఎంఎ, ఎల్ఎల్బీ
వృత్తి: న్యాయవాది
పుట్టిన తేదీ: 1966 మే 1
తల్లిదండ్రులు: సుశీల, పురుషోత్తమరావు
భార్య: శ్రీదేవి
పిల్లలు:శ్రీతజా, శివపురుషోత్తమరావు
స్వస్థలం: జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అస్త్రశస్త్రాలతో ప్రచారానికి సిద్ధం
[ 28-04-2024]
నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచారు.. ఓటర్ల మన్ననలు పొందేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించుకుని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. -
జిల్లా అభివృద్ధి చెందాలంటే వినోద్ గెలవాలి
[ 28-04-2024]
కరీంనగర్ అభివృద్ధి చెందాలంటే ప్రజలు భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను గెలిపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు కోరారు. -
గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు పోటీ
[ 28-04-2024]
గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు మధ్య పోటీ అని.. ఎటు వైపు ఉంటారో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కోరారు. -
పెరిగిన ఓటర్లు.. 8,758
[ 28-04-2024]
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓటర్లు పెరిగారు. ఫిబ్రవరి నెల 8వ తేదీన విడుదలైన ఓటరు ముసాయిదా తుది జాబితాతో పోలిస్తే ప్రస్తుతం ఓటు వేసే వారి సంఖ్య పెరిగింది. -
విదేశాల్లో ఉన్నా వదిలేదే లే!
[ 28-04-2024]
కరీంనగర్ భూ దందాలో భాగమై కేసులు నమోదైన వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే కొందరు అరెస్టై జైలుకెళ్లగా ఇంకొందరు తప్పించుకు తిరుగుతున్నారు. -
కరీంనగర్లో 6.. పెద్దపల్లిలో 4
[ 28-04-2024]
దేశంలో 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన సార్వత్రిక, ఉప ఎన్నికల్లో కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్లు జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులను ఆదరించారు. -
66.44 శాతమే అధికం
[ 28-04-2024]
మొదటి రెండు పర్యాయాలు కరీంనగర్ ద్విసభ్య నియోజకవర్గ పరిధిలో ఉన్న పెద్దపల్లి లోక్సభ స్థానానికి 1962 నుంచి విడిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 16 విడతల్లో ఎన్నికలు జరిగినా ఎప్పుడూ 67 శాతానికి మించి పోలింగ్ నమోదు కాలేదు. -
అనిశా వలలో ఇన్ఛార్జి సబ్రిజిస్ట్రార్
[ 28-04-2024]
గిఫ్ట్ డీడ్ కింద పట్టా మార్పిడి కోసం రూ.10 వేల లంచం తీసుకుంటూ గంగాధర ఇన్ఛార్జి సబ్రిజిస్ట్రార్ సురేశ్బాబు శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. -
మొత్తం ఓటర్లు 15,96,430
[ 28-04-2024]
ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా కొలిక్కివచ్చింది. కొద్ది రోజులుగా క్షేత్ర స్థాయిలో అధికారులు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి నుంచి కొత్తగా స్వీకరించిన దరఖాస్తుల వడబోత చేపట్టారు. -
ఆస్తుల పరిరక్షణ.. చోరీల నియంత్రణ
[ 28-04-2024]
సింగరేణి ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించామని.. చోరీల నియంత్రణకు నిరంతరం అధికారులతో చర్చిస్తున్నామని సింగరేణి ముఖ్య భద్రతాధికారి దీక్షితులు అన్నారు. -
అభివృద్ధి చూపి ఓట్లడగాలి
[ 28-04-2024]
గత ఎంపీ ఎన్నికల్లో తన భార్య మంగళసూత్రాలు అమ్మి పోటీ చేశానని చెబుతున్న బండి సంజయ్ అయిదేళ్లలో రూ.వందల కోట్లు ఎలా సంపాదించారని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంతి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ఎన్నికల వేళ... పెరగని మద్యం అమ్మకాలు
[ 28-04-2024]
ఎన్నికలు అనగానే పోటీలో ఉన్న అభ్యర్థులు మద్యం పంపిణీ, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. కానీ జిల్లాలో మాత్రం మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం చూపలేదు. -
వెంటాడుతున్న అకాల వర్ష భయం
[ 28-04-2024]
అన్నదాతలు వరి గింజలు పూర్తిగా ఎండకుండానే... కమతాలు తడారకుండానే వరి కోతలు చేపడుతున్నారు. అకాల వర్షాల భయంతో ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ముమ్మరం చేశారు. వరి కోత యంత్రాలకు భారీగా వ్యయం చేస్తున్నారు. -
విస్తరించని జాతీయ మార్కెట్ వ్యవస్థ
[ 28-04-2024]
రైతుల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలందిస్తూ దేశవ్యాప్తంగా విపణిపై పట్టుసాధించటం.. పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు నల్లబజారుకు తరలకుండా చూసి.. సరకుల నియంత్రణతో ధరల అదుపు ప్రధాన ఉద్దేశంగా కేంద్రప్రభుత్వం ఈ-నామ్(ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్)ను 2016 ఖరీఫ్నకు ముందు ప్రవేశపెట్టింది. -
కాంగ్రెస్ పాలనలోనే సంక్షేమ పథకాలు
[ 28-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుతో కలిసి కార్నర్ సమావేశంలో మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్