logo

కాంగ్రెస్‌, భారాస కుమ్మక్కు

రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ సర్వే చూసినా కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో భాజపా భారీ మెజార్టీతో గెలుస్తుందని చెబుతున్నాయని, కాంగ్రెస్‌, భారాస కుమ్మకై తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయని ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

Published : 27 Mar 2024 03:18 IST

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌

 మాట్లాడుతున్న బండి సంజయ్‌

 తెలంగాణచౌక్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ సర్వే చూసినా కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో భాజపా భారీ మెజార్టీతో గెలుస్తుందని చెబుతున్నాయని, కాంగ్రెస్‌, భారాస కుమ్మకై తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయని ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం కరీంనగర్‌లో పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని మండలాల ఇన్‌ఛార్జులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు వాటి పరిష్కారంలో గత భారాస, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాల వైఫల్యాలు ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ వర్సెస్‌ రాహుల్‌గాంధీగా పార్లమెంట్‌ ఎన్నికలు జరగబోతున్నాయని, ఇదే అంశాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని కోరారు. ఆరు గ్యారంటీల అమల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాన్ని ఊరూరా ప్రస్తావించాలన్నారు. పార్టీలో చేరికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, బూత్‌ కమిటీలను పటిష్ఠం చేయాలన్నారు. అభివృద్ధికి తాను తీసుకొచ్చిన నిధులను ప్రస్తావించాలని సూచించారు. సమావేశంలో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సి.హెచ్‌.విఠల్‌, జిల్లా ఇన్‌ఛార్జి మీసాల చంద్రయ్య, పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ బోయినిపల్లి ప్రవీణ్‌రావు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని