చెరువులకు చెర !
కరీంనగర్కు ఆనుకుని ఉన్న తీగలగుట్టపల్లి, ఆరెపల్లి సమీపంలోని ఓ రెండు కుంటలు కాలక్రమేణా కనుమరుగై పోయాయి.
శిఖం, ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణలు
కుంచించుకుపోయిన ఊరకుంట
కరీంనగర్కు ఆనుకుని ఉన్న తీగలగుట్టపల్లి, ఆరెపల్లి సమీపంలోని ఓ రెండు కుంటలు కాలక్రమేణా కనుమరుగై పోయాయి. వీటితోపాటు స్థిరాస్తి వ్యాపారుల వల్ల ఇక్కడి మాలకుంట కుంచించుకుపోయింది. ఇదే తరహాలో ఉడతకుంట, అవుసుల కుంటలు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. తీగలగుట్టపల్లి ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఊరకుంటలోనూ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరిగాయని ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. ఇక్కడి 8.2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిని ఎలాగైనా తమ వశం చేసుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు.
బొమ్మకల్ భూ మాఫియా ఆగడాల వల్ల ఇక్కడి పెద్ద చెరువులకు ‘చెర’ తప్పలేదు. ఇక్కడ వందలాది ఎకరాలు పరుల వశమైనట్లే.. ఇక్కడి విలువైన చెరువుల్లోనూ దర్జాగా కబ్జాకాండ కొనసాగింది. జక్కప్ప చెరువు (46.21 ఎకరాలు), రావికుంట (9.10 ఎకరాలు), గోపాల్ చెరువు (28.10 ఎకరాలు), నల్ల చెరువు (16.10 ఎకరాలు), గోదుమకుంట (12 ఎకరాలు).. ఇలా ముఖ్యమైన వాటన్నింటికి ముప్పు ఎదురైంది. చాలాచోట్ల వీటి శిఖం స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరిగాయి. ఇవేకాకుండా రెండు మూడు చిన్న కుంటలు మాయమై అందులో స్థిరాస్తి వ్యాపారం సాగుతోంది.
కరీంనగర్ చుట్టే కాదు.. జిల్లాలోని పలు మండలాల్లోనూ చెరువుల కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. పక్కనే ఉన్న భూములే ఆసరాగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో వస్తున్న అర్జీల్లో చెరువులు, కుంటల ఆక్రమణపైనే ఎక్కువ. ఇటీవల గంగాధర మండలం గర్షకుర్తి ఊర చెరువులో దాదాపుగా 2 ఎకరాల స్థలంలో మట్టిని నింపారని గ్రామానికి చెందిన మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. నీళ్లు నిలిచి ఉండే స్థానంలో మట్టి నింపడంతో ఇబ్బంది కలుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈనాడు, కరీంనగర్: భూముల ధరలకు రెక్కలు రావడంతో ప్రభుత్వ భూములతోపాటు చెరువులపై కొందరు స్థిరాస్తి వ్యాపారులు కన్నేస్తున్నారు. రూ.కోట్లు సంపాదించడానికి సులువైన మార్గం కావడం.. అధికారులను, నాయకులను మచ్చిక చేసుకుంటే సరిపోవడంతో జల వనరులను ఆక్రమించేస్తున్నారు. కరీంనగర్, జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, గంగాధరలాంటి ప్రాంతాల్లో గుంట ధర రూ.15- రూ.20 లక్షలు పలుకుతుండటంతో పాత దస్త్రాలను తారుమారు చేసి వీటిని శిఖం పట్టాగా మార్చుకుంటున్నారు. సమీపంలో వెంచర్ల ఏర్పాటుతో కొందరు వ్యాపారులు మెల్లిగా తమ జాగాలో వీటి సరిహద్దులను కలిపేసుకుంటున్నారు. నిబంధనల్ని అతిక్రమించి చెరువుకు నీరందించే కాలువల రూపురేఖల్నే మారేస్తున్నారు.
సం‘రక్షణ’ లేకనే..!
- కబ్జా కాకుండా కాపాడే విషయంలో జిల్లాలో స్పష్టంగా లోపాలు కనిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నా.. చర్యలు తీసుకున్న దాఖలాలు తక్కువగానే ఉంటున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, ఇతరత్రా ప్రలోభాల ఎరతో యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి.
- హైకోర్టు ఇటీవల జల వనరుల కబ్జాలపై స్పందించింది. చెరువుల ఆక్రమణల్ని తీవ్రంగా పరిగణించాలని.. లేదంటే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవని వ్యాఖ్యలు చేసింది. ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్)లో నిర్మాణాలు, మట్టితో పూడ్చడం, కట్టలను తొలగించడంపై దృష్టి పెట్టాలని, కఠిన చర్యలుండాలని ఆదేశించింది.
- కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలన్నీ కలిపి 1008 ఉంటాయి. దాదాపుగా 13,456.91 హెక్టార్లలో వీటి విస్తీర్ణం ఉంటుంది. పెద్ద చెరువులకు కొద్దిగా ముప్పు తక్కువగా ఉన్నా.. చిన్న కుంటలు మాత్రం చాలా చోట్ల ఆక్రమణలకు గురయ్యాయి. ఎక్కడా హెచ్చరిక బోర్డులు లేక కబ్జా కోరులకు చిక్కాయి.
సర్వే చేయించి చర్యలు
జిల్లాలో చెరువుల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి పెడతాం. ప్రస్తుతం చెరువులో నీటిమట్టం తగ్గడం వల్ల నీటి నిల్వ స్థాయిని (ఎఫ్టీఎల్) గుర్తించేందుకు సర్వే చేయిస్తామని ఇటీవలే ఉన్నతాధికారులకు లేఖ రాశాం. ఆదేశాలు రాగానే అన్ని చెరువులపై ఒక నివేదికను తయారు చేసి సంరక్షణకు చర్యలు తీసుకుంటాం.
- శివకుమార్, ఎస్ఈ, నీటిపారుదలశాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారం
[ 27-04-2024]
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
82 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా శుక్రవారం నామపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించి 34 మందివి తిరస్కరించి, 82 మందివి ఆమోదించారు. -
గ్యారంటీలను అమలు చేస్తాం : మంత్రి పొన్నం
[ 27-04-2024]
‘పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ సవాల్ విసిరారు. -
అభ్యర్థులను చూసి ఓటు వేయండి
[ 27-04-2024]
కాంగ్రెస్, భారాసలకు ఆ పార్టీల కార్యకర్తలే ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
జాతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యం
[ 27-04-2024]
జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క పని కూడా కాలేదని, అభివృద్ధి జరగాలంటే గులాబీ జెండా ఎంపీ అవసరమని కరీంనగర్ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
వేసవి వేళ.. ఆటల వేడుక
[ 27-04-2024]
వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడితో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తరువాత ఊపిరి పీల్చుకుంటారు. -
బొగ్గు బాయిల చుట్టూ రాజకీయం
[ 27-04-2024]
ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం మొత్తం బొగ్గు బాయిల చుట్టే తిరుగుతోంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులున్నారు. దీంతో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. -
ఎన్నికల వేళ నగదు కష్టాలు
[ 27-04-2024]
ఎన్నికల కోడ్ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. -
నారీమణులే నిర్ణేతలు
[ 27-04-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే అతివల సంఖ్యే అధికంగా ఉంది. -
ఇంటి నంబర్ల గోల్మాల్!
[ 27-04-2024]
కరీంనగర్ శివారు ప్రాంతాల్లో భూఆక్రమణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. -
భానుడి భగభగ...
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 27-04-2024]
ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తండ్రి కళ్లెదుటే నీటి మునిగి మృతి చెందిన సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది. -
పశుపక్షాదుల దాహం తీర్చేలా..
[ 27-04-2024]
వేసవిలో ఎండల తీవ్రతకు మనుషులే దప్పికతో అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై సంచరించే పశువులు, పక్షులకు తాగునీరు అందక అల్లాడి ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొనకుండా ఉండేందుకు కోరుట్ల పట్టణంలో పుర కమిషనర్ బట్టు తిరుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
[ 27-04-2024]
ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సౌకర్యాలు లేక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
[ 27-04-2024]
అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్లో జాబితా సిద్ధమవుతోంది. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
అడవిని మింగేస్తున్న అనకొండలు
[ 27-04-2024]
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. -
కబ్జాల పర్వం!
[ 27-04-2024]
అక్రమార్కుల కన్ను మున్సిపల్ లేఅవుట్ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్ లేఅవుట్ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం. -
మద్యం, నగదు అక్రమ రవాణా నివారణకే తనిఖీలు
[ 27-04-2024]
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ సదుపాయం.. వినియోగానికి దూరం
[ 27-04-2024]
ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే నామపత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. -
హరిత లక్ష్యం.. కార్యాచరణ సిద్ధం
[ 27-04-2024]
పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు గ్రామాల్లోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్