మంతనాలు.. భేటీలు
క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉంది.. తమ పార్టీ వారెవరైనా ఇతర పార్టీల వైపు చూస్తున్నారా.. ప్రత్యర్థి ప్రచారం ఎలా సాగుతోంది.. అని అభ్యర్థులు ఓ వైపు తమ పార్టీ నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు..
ప్రచారంలో జోరు పెంచుతున్న అభ్యర్థులు
ఈనాడు, కరీంనగర్
క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉంది.. తమ పార్టీ వారెవరైనా ఇతర పార్టీల వైపు చూస్తున్నారా.. ప్రత్యర్థి ప్రచారం ఎలా సాగుతోంది.. అని అభ్యర్థులు ఓ వైపు తమ పార్టీ నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు.. మరోవైపు కార్యకర్తలు.. వివిధ వర్గాల వారితో సమావేశమవుతూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.. ఇన్నాళ్లూ కొనసాగించిన ప్రచారం ఒక ఎతైతే ఇక మీదట మరింత జోరు పెంచాల్సిన తరుణంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ వ్యూహాలు రూపొందించుకుంటున్నారు.. ఆయా పార్టీల ముఖ్య నేతలను ఆహ్వానిస్తూ అభ్యర్థులు శాసనసభ సెగ్మెంట్ల వారీగా సన్నాహక సమావేశాల్ని నిర్వహిస్తున్నారు. మండలాల వారీగా పోలింగ్ కేంద్రాల్లో బాధ్యులుగా ఉన్న కార్యకర్తలు హాజరయ్యే ఈ సమావేశాల్లో కీలకమైన విషయాల్ని వివరిస్తున్నారు. ప్రత్యుర్థులు దీటుగా ఎలా ముందుకు వెళ్లాలనే విషయాన్ని తెలియజెప్పడంతోపాటు రోజువారీగా శ్రేణులకు ప్రచార కార్యాచరణను అందిస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ బూత్ల వారీగా ప్రతి 100 మందికి ఒకరిని ఇన్ఛార్జిగా అన్ని పార్టీలు ఇప్పటికే నియమించాయి. ఈ విషయంలో కరీంనగర్ నియోజకవర్గ భాజపా, భారాస అభ్యర్థులు ముందు వరుసలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన విధానాలను ఈసారీ పక్కాగా ఆచరణలో చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో ఇదే పంథాను అవలంబిస్తుండగా.. నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలో కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలపై ఇటీవలే ఈ తరహా కసరత్తును షురూ చేశారు. కరీంనగర్లో మాత్రం అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఈ దిశగా ఇంకా కసరత్తు మొదలు పెట్టలేదు.
హామీలతో కరపత్రాలు
భాజపా, భారాస, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కరపత్రాలు, ఇంటికి అతికించే స్టిక్కర్ల పంపిణీ ప్రారంభించారు. కరీంనగర్ భాజపా అభ్యర్థి బండి సంజయ్కు చెందిన కరపత్రాలు సోమవారం ఒకే రోజున వీలైనన్ని ఎక్కువ ఇళ్లకు వెళ్లే విధంగా శ్రేణులను సిద్ధం చేసి పంపిణీ చేయించారు. ఇదే తరహాలో భారాస అభ్యర్థి వినోద్కుమార్ కూడా ఆయా మండలాలకు పంపించారు. అటు నుంచి వాటిని ఇంటింటికి చేరే బాధ్యతను మండలాధ్యక్షులకు అందించారు. నిజామాబాద్, పెద్దపల్లి స్థానాల్లోనూ పోటీదారులు ఇలాంటి కరపత్రాలతో తమ ఎజెండాను ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. తాము గెలిస్తే ప్రజలకేం చేస్తామో కరపత్రాల్లో ప్రస్తావిస్తున్నారు. భాజపా అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిని తమ ప్రచారానికి వాడుకుంటుండగా.. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఏఐసీసీ విడుదల చేసిన మ్యానిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. భారాస అభ్యర్థులు మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తి చూపడాన్ని తమ ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్నారు.
బలాబలాల విశ్లేషణ
ఏ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి? అక్కడ మనకు వచ్చిన ఓట్లెన్ని? అనే విషయమై మండలాల వారీగా ముఖ్య నేతలతో అభ్యర్థులు ఫోన్లో లేదా వీలుని బట్టి ప్రత్యక్ష సమీక్షలను నిర్వహిస్తూ పరిస్థితిపై అంచనాకు వస్తున్నారు. ఓట్లు రాబట్టే వ్యూహంలో భాగంగా భారాస, కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు తమ బలాబలాలను శాసనసభ నియోజకవర్గాల వారీగా విశ్లేషించుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో మూడు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్, భారాసలకు ఎక్కువ శాతం ఓట్లు పడ్డాయి. దీంతో ఆ ఓట్లను కాపాడుకుంటూనే ప్రత్యర్థి పార్టీ ఓటు బ్యాంకును కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. మూడో స్థానానికి పరిమితమైన భాజపా 2019 లోక్సభ ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయన్న ధీమాతో ఉంది. గత లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ స్థానాల్ని ఆ పార్టీ కైవసం చేసుకున్న విషయం విదితమే. అయినా ఏ అవకాశాన్ని వదలకుండా ప్రత్యర్థుల ఎత్తుగడలను గమనిస్తూ భాజపా అభ్యర్థులు వ్యూహాలు రూపొందించుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరిలో ఉండేదెవరు?
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీలో ఉండేదెవరో సోమవారం తేలిపోనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 3 గంటల వరకే సమయం ఉండటంతో ఎవరు బరిలో ఉంటారు..? ఎవరు నామపత్రాలు వెనక్కి తీసుకుంటారో నేడు వెల్లడి కానుంది. -
44 రోజులు.. రూ.9.71 కోట్లు
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. -
ఉపాధి పని... ఉదయపు నడక
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార సరళి మారింది. ఎండలు మండుతుండటంతో ఇంటింటికీ తిరగడానికి నాయకులు జంకుతున్నారు. ఎక్కువ మంది ఓటర్లు ఉండే ప్రాంతాలకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. -
ఓట్లు అడిగే హక్కు వినోద్కే ఉంది
[ 29-04-2024]
కరీంనగర్లో అభివృద్ధి చేసిన వినోద్కుమార్కే ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఉందని.. ఇతర పార్టీల అభ్యర్థులకు లేదని భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
ప్రజా శ్రేయస్సు పట్టని కాంగ్రెస్, భారాస
[ 29-04-2024]
కాంగ్రెస్, భారాసలు ఏనాడూ ప్రజల కోసం పని చేయలేదని ఎంపీ బండి సంజయ్కుమార్ అన్నారు. -
పదేళ్ల భాజపా పాలనలో ప్రగతి శూన్యం
[ 29-04-2024]
కేంద్రంలో కొనసాగిన పదేళ్ల భాజపా పాలనలో ప్రగతి శూన్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. -
ఆగని అక్రమ తవ్వకాలు..
[ 29-04-2024]
రాజకీయ నాయకుల అండదండలు.. అధికారుల నిర్లక్ష్యం వెరసి అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. -
ధాన్యం తూకాల్లో వేగం ఏదీ?
[ 29-04-2024]
జిల్లాలో వరి కోతలు 80 శాతం పూర్తయ్యాయి. వచ్చే నెల 15 నాటికి కోతలు ముగుస్తాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. -
రాష్ట్రానికి గులాబీ జెండా అవసరం
[ 29-04-2024]
గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు భారాసకు ఉన్న శక్తి, క్యాడర్ ఏ జాతీయ పార్టీకి లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి గులాబీ జెండా అవసరమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. -
ఓటుహక్కు వినియోగంలో మహిళా చైతన్యం
[ 29-04-2024]
2019 సార్వత్రిక ఎన్నికల్లో జగిత్యాల జిల్లాలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ సంఖ్యలో ఓటేశారు. -
బరిలో ఇద్దరు వారసులు
[ 29-04-2024]
స్థానిక సంస్థల నుంచి లోక్సభ ఎన్నికల వరకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల వారసులు బరిలో నిలుస్తుంటారు. -
టోల్ఫ్రీ నంబరు ఎలా వచ్చిందంటే..!
[ 29-04-2024]
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది.