రేపటి నుంచి మూడంచెల భద్రతా వ్యవస్థ
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘడియలు సమీపిస్తున్నాయి. పాలనా ప్రాంగణంలో ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ స్వీకరించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.
కలెక్టరేట్లో రిటర్నింగ్ కార్యాలయం ముస్తాబు
పెద్దపల్లి కలెక్టరేట్, న్యూస్టుడే : లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘడియలు సమీపిస్తున్నాయి. పాలనా ప్రాంగణంలో ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ స్వీకరించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం నుంచే భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. రోడ్డుకిరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారి(కలెక్టర్) ఛాంబర్ నుంచి 100 నుంచి 300 మీటర్ల వరకు పోలీసు బలగాల పహారాతో మూడంచెల భద్రత వ్యవస్థ మధ్య నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కలెక్టరేట్ ఉద్యోగులకు వారి గుర్తింపు కార్డుల ఆధారంగా విధుల్లోకి అనుమతి ఇస్తారు. సందర్శకులకు మధ్యాహ్నం 3 తర్వాతే అనుమతి ఉంటుంది.
అడుగడుగునా నిఘా
కలెక్టరేట్ ఆవరణలో అడుగడుగునా భద్రత చర్యలు తీసుకుంటున్నారు. నామపత్రాల స్వీకరణలో ఎలాంటి ఘర్షణలు, అల్లర్లకు తావులేకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అభ్యర్థుల ర్యాలీలను రెండు వందల మీటర్ల లోపు నిలిపి వేయనున్నారు. మూడు వాహనాలను వంద మీటర్ల వరకు.. అక్కడి నుంచి అభ్యర్థితో పాటు మరో నలుగురిని లోపలికి అనుమతిస్తారు. ప్రతీ అంశాన్ని వీడియోలో చిత్రీకరించనున్నారు.
సర్వం సిద్ధం
- ఎంపీ పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 15,92,996 ఓటర్లు ఉండగా ఇందులో 7,87,140 పురుషులు, 8,05,755 మహిళలు, 101 ఇతర ఓటర్లుగా నమోదయ్యారు.
- కలెక్టరేట్ రెండో బ్లాక్ నుంచి ఉద్యోగులను విధులకు అనుమతించనున్నారు. నామినేషన్ స్వీకరణ సమయంలో సందర్శకులకు అనుమతి నిరాకరించనున్నారు.
- ఎంపీ స్థానం ఎస్సీ రిజర్వు కావడంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రూ.12,500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
- నామినేషన్ వేసే ముందు రోజు తాజా బ్యాంక్ ఖాతా తెరిచిన పాసుపుస్తకాన్ని తప్పనిసరిగా తీసుకురావాలి. నేరచరిత ఆధారాలు పొందుపరచాలి. నమోదైన కేసుల వివరాలు నివేదించాలి. అభ్యర్థులు నాలుగు సెట్ల నామపత్రాలు దాఖలు చేయాలి. ఎన్నిక సంఘం నిర్దేశించిన ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల బరిలో 99మంది
[ 30-04-2024]
ఎట్టకేలకు లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిచే వారెవరో తేలింది.. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం మధ్యాహ్నంతో ముగియడంతో అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైంది.. -
నేడు జమ్మికుంటకు సీఎం.. 8న వేములవాడకు పీఎం
[ 30-04-2024]
పెరుగుతున్న ఉష్ణోగ్రతల మాదిరిగానే పార్టీలు ప్రచార వేడిని క్రమంగా పెంచుతున్నాయి. ఉత్తర తెలంగాణలో కీలకమైన జిల్లాగా పేరొందిన ఉమ్మడి కరీంనగర్పై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి. -
సెలవు పెట్టలేదు.. విధులకు రాలేదు!
[ 30-04-2024]
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని పలువురు వైద్యులు సెలవు పెట్టకుండా, విధులకు హాజరుకాకపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులుపడ్డారు. -
తగ్గుతున్న మామిడి ధర
[ 30-04-2024]
మామిడి ధరలు రోజురోజుకు తగ్గుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
కమల దళంలో మారిన సమీకరణలు
[ 30-04-2024]
పెద్దపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ నేత బోర్లకుంట వెంకటేశ్నేత భాజపా గూటికి చేరారు. -
నెరవేరని వస్త్రోత్పత్తి లక్ష్యం
[ 30-04-2024]
ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి ఏకరూప దుస్తులు విద్యార్థులకు సిద్ధం చేయడం అసాధ్యమనిపిస్తోంది. -
చైతన్య ఫలితం.. శాంతియుతం
[ 30-04-2024]
ఒకప్పుడు ఎన్నికలంటేనే గ్రామాల్లో పగలు, ప్రతీకారాలు కనిపించేవి. నిత్యం గొడవలతో ఘర్షణ వాతావరణం నెలకొనేది. -
యువత.. కురిపించాలి మమత
[ 30-04-2024]
నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. -
సుర్రుమంటూ సూరీడు.. ఉసూరుమంటూ నాయకుడు
[ 30-04-2024]
‘ మెల్లగా తెల్లారిందే అలా..!’ అనుకుంటూ రాజకీయ నాయకులు ప్రచారానికి పరుగులెత్తిన కొద్దిసేపటికే భానుడు సుర్రుమంటున్నాడు.. ఉదయం ఏడింటికే భగభగ మండుతున్నాడు.. -
రిజర్వేషన్లు రద్దు చేయబోమని ప్రకటించరెందుకు?
[ 30-04-2024]
రిజర్వేషన్లు రద్దు చేయబోమని భాజపా, ఆర్ఎస్ఎస్ ఎందుకు ప్రకటించడం లేదని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీగౌడ్ ప్రశ్నించారు. -
ఏసీబీకి చిక్కిన హెడ్కానిస్టేబుల్
[ 30-04-2024]
జగిత్యాల జిల్లా బీర్పూర్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సామల్ల మనోహర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. -
ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
[ 30-04-2024]
జిల్లాలో అందిస్తున్న ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో తెలిపారు.