మామిడి కొనుగోళ్లు ప్రారంభం
బహిరంగ వేలం చేపట్టిన వ్యాపారులు
న్యూస్టుడే- జగిత్యాల ధరూర్క్యాంపు
జగిత్యాల చల్గల్ మామిడిమండీలో కాయల క్రయవిక్రయాలు మొదలయ్యాయి. నిబంధనల ప్రకారం వ్యాపారులు కొనుగోళ్ల మధ్యవర్తిత్వానికిగాను రైతుల నుంచి కమీషన్ తీసుకున్నపుడు కాయలను బహిరంగ వేలం పద్ధతిన కొనుగోలు చేయాలి. కానీ దాదాపు 18 సంవత్సరాల్లో ఒకటిరెండుసార్లు మాత్రమే వేలానికి చర్యలు చేపట్టినా అమల్లోకి రాలేదు. యార్డులో సదుపాయాలు లేవన్న కారణంతో ట్రేడింగ్ పద్ధతిలోనే కొనుగోళ్లు జరిపారు. కాగా ఈ సారి యార్డులో షెడ్లు, వాలంతరి నుంచి అదనంగా తీసుకున్న 10 ఎకరాల స్థలం అందుబాటులోకి రావడంతో తప్పనిసరిగా బహిరంగ వేలం పద్ధతిలోనే కాయలను కొనాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మామిడి వ్యాపారుల సంఘం అధ్యక్షుడు ఎం.డి.మొయిన్ వేలం పద్ధతిన కాయలను కొనగా బంగినపల్లి రకానికి టన్నుకు రూ.36 వేల నుంచి రూ.55 వేల వరకు ధర పలికింది. మిగిలిన వ్యాపారులు కూడా వేలం పద్ధతిని అనుసరించేలా డీఎంవో ప్రకాశ్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ పేర్కొన్నారు.
- నాగ్పూర్ మార్కెట్లో ఉదయంపూట కాయలను వేలం వేస్తారు. కానీ చల్గల్ మండీకి రైతులు సాయంత్రం నుంచి రాత్రివరకు కాయలను తెస్తారు కాబట్టి రాత్రిపూట వేలాన్ని కొనసాగించేలా చూడాలి.
- ఈ సీజన్లో పూత బాగావచ్చినా ప్రతికూల వాతావరణంతో కాయల దిగుబడి భారీగా తగ్గినట్లు రైతులు, తోటల గుత్తేదారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నిలకడైన ధరకు, రైతుల అవగాహనకు నాగ్పూర్, విజయవాడ, హైదరాబాద్, దిల్లీ తదితర మార్కెట్ల ధరలను చల్గల్మండీలో ప్రతిరోజూ ప్రదర్శించాలి.
- యార్డువెలుపల కాయల క్రయవిక్రయాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించవద్దు. కాయల గ్రేడింగ్, ప్యాకింగ్, లోడింగ్ పనులకు తరలివచ్చే వేలాది కార్మికులకు వసతులు కల్పించాల్సిఉంది. చల్గల్లోని రైపెనింగ్ ఛాంబర్ను అందుబాటులోకి తేవాలి.
- ప్రభుత్వం ప్రకటించినట్లుగా జగిత్యాల బ్రాండ్ పేరిట కాయలను ఎగుమతి చేయాలి. మహిళా సంఘాలు, అపెడ, ఉద్యానశాఖల ద్వారా మామిడి కొనుగోళ్లను చేపట్టాలి. గతంలో మాదిరిగా జగిత్యాల నుంచి ఈ సీజన్లోనూ కిసాన్రైలు ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు కాయలను ఎగుమతి చేయాలి.
- యార్డులోని ధర్మకాంటాలను రైతులకు అందుబాటులోకి తెచ్చి తూకంపక్కాగా జరిగేలా చూడాలి. ప్రతి కొనుగోలుపైనా మార్కెట్ఫీజును వసూలు చేయాలి. తరుగు, చిన్నకాయల పేరిట కోతలు విధించకుండా, సకాలంలో డబ్బులు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
- చల్గల్తో పాటుగా మెట్పల్లి, కోరుట్ల, మేడిపల్లి, రాయికల్ తదితర ప్రాంతాల్లోనూ కొందరు లైసెన్స్లేని వ్యాపారులు నేరుగా రైతులనుంచి మామిడిని కొంటుండగా వీరికి లైసెన్స్లు జారీచేసి యార్డులద్వారానే కొనుగోళ్లు జరిపేలా తక్పట్టీలు జారీచేసి క్రయవిక్రయాలను ప్రభుత్వ ఆధీనంలోకి తేవాలి.
- సీజన్ ఆరంభంలో ధరలు బాగుంటున్నా స్థానికుల గుత్తాధిపత్యంతో ధరలు తగ్గించటం రివాజుగా ఉంటుండగా దిల్లీ, నాగ్పూర్ తదితర ప్రాంతాలకు చెందిన లైసెన్స్డ్ వ్యాపారులకూ కొనుగోళ్లకు అవకాశం కల్పిస్తే పోటీపెరిగి ధరల్లో స్థిరత్వముండి రైతులకు లాభిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరిలో ఉండేదెవరు?
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీలో ఉండేదెవరో సోమవారం తేలిపోనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 3 గంటల వరకే సమయం ఉండటంతో ఎవరు బరిలో ఉంటారు..? ఎవరు నామపత్రాలు వెనక్కి తీసుకుంటారో నేడు వెల్లడి కానుంది. -
44 రోజులు.. రూ.9.71 కోట్లు
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. -
ఉపాధి పని... ఉదయపు నడక
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార సరళి మారింది. ఎండలు మండుతుండటంతో ఇంటింటికీ తిరగడానికి నాయకులు జంకుతున్నారు. ఎక్కువ మంది ఓటర్లు ఉండే ప్రాంతాలకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. -
ఓట్లు అడిగే హక్కు వినోద్కే ఉంది
[ 29-04-2024]
కరీంనగర్లో అభివృద్ధి చేసిన వినోద్కుమార్కే ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఉందని.. ఇతర పార్టీల అభ్యర్థులకు లేదని భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
ప్రజా శ్రేయస్సు పట్టని కాంగ్రెస్, భారాస
[ 29-04-2024]
కాంగ్రెస్, భారాసలు ఏనాడూ ప్రజల కోసం పని చేయలేదని ఎంపీ బండి సంజయ్కుమార్ అన్నారు. -
పదేళ్ల భాజపా పాలనలో ప్రగతి శూన్యం
[ 29-04-2024]
కేంద్రంలో కొనసాగిన పదేళ్ల భాజపా పాలనలో ప్రగతి శూన్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. -
ఆగని అక్రమ తవ్వకాలు..
[ 29-04-2024]
రాజకీయ నాయకుల అండదండలు.. అధికారుల నిర్లక్ష్యం వెరసి అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. -
ధాన్యం తూకాల్లో వేగం ఏదీ?
[ 29-04-2024]
జిల్లాలో వరి కోతలు 80 శాతం పూర్తయ్యాయి. వచ్చే నెల 15 నాటికి కోతలు ముగుస్తాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. -
రాష్ట్రానికి గులాబీ జెండా అవసరం
[ 29-04-2024]
గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు భారాసకు ఉన్న శక్తి, క్యాడర్ ఏ జాతీయ పార్టీకి లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి గులాబీ జెండా అవసరమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. -
ఓటుహక్కు వినియోగంలో మహిళా చైతన్యం
[ 29-04-2024]
2019 సార్వత్రిక ఎన్నికల్లో జగిత్యాల జిల్లాలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ సంఖ్యలో ఓటేశారు. -
బరిలో ఇద్దరు వారసులు
[ 29-04-2024]
స్థానిక సంస్థల నుంచి లోక్సభ ఎన్నికల వరకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల వారసులు బరిలో నిలుస్తుంటారు. -
టోల్ఫ్రీ నంబరు ఎలా వచ్చిందంటే..!
[ 29-04-2024]
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్