logo

అమ్మ కోసం వెళ్లి అనంతలోకాలకు

కుమారుడిని పాఠశాల(ప్రైవేటు) బస్సు ఎక్కించేందుకు తల్లి వెళ్లగా.. ఆమె కోసం వెళ్లిన చిన్నారి ప్రమాదవశాత్తు అదే బస్సు కింద పడి దుర్మరణం చెందిన సంఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.

Published : 17 Apr 2024 05:31 IST

పాఠశాల బస్సు కింద పడి చిన్నారి దుర్మరణం

మల్యాల, న్యూస్‌టుడే: కుమారుడిని పాఠశాల(ప్రైవేటు) బస్సు ఎక్కించేందుకు తల్లి వెళ్లగా.. ఆమె కోసం వెళ్లిన చిన్నారి ప్రమాదవశాత్తు అదే బస్సు కింద పడి దుర్మరణం చెందిన సంఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. ఎస్సై అబ్దుల్‌ రహీం తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మద్దుట్ల గ్రామానికి చెందిన రజాక్‌-హసీనా దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మంగళవారం ఉదయం కుమారుడు సాజిల్‌ను పాఠశాల బస్సు ఎక్కించేందుకు తల్లి హసీనా వెళ్లింది. ]

]

తల్లి వెనుకే 18 నెలల కుమార్తె అరిబా బస్సు ముందుకు వెళ్లింది. డ్రైవర్‌ గమనించక వాహనాన్ని ముందుకు కదిలించడంతో చిన్నారి తలపై నుంచి వెనుక చక్రం వెళ్లింది. తీవ్ర గాయాలైన కుమార్తెను ఎలాగైనా బతికించుకునేందుకు తండ్రి రజాక్‌ వెంటనే ఆటోలో జగిత్యాల ఆసుపత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చిన్నారి మృతికి కారణమైన బస్సు డ్రైవర్‌ రవిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని