అన్ని వివరాలు పూరించాల్సిందే!
సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. అభ్యర్థులకు కీలకమైన ఈ దశలో ఏ మాత్రం తప్పుదొర్లినా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
నామినేషన్ దాఖలులో అప్రమత్తత అవసరం
న్యూస్టుడే, గోదావరిఖని, కరీంనగర్ పట్టణం
సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. అభ్యర్థులకు కీలకమైన ఈ దశలో ఏ మాత్రం తప్పుదొర్లినా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రతి కాలమ్నూ జాగ్రత్తగా పూరించాల్సి ఉంటుంది. నామపత్రంతో పాటు అఫిడవిట్లోనూ పూర్తి వివరాలు ఉండేలా చూసుకోవాలి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను పూరించే తీరుపై న్యాయవాదులతో సంప్రదిస్తున్నారు.
ఒక్కటి వదిలేసినా తిరస్కరణే
అభ్యర్థులు ప్రమాణ పత్రంలోని ప్రతి కాలమ్నూ పూరించాలి. ఒక్కదాన్ని వదిలేసినా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. సంబంధం లేని అంశం వద్ద ‘నిల్’ వర్తించదు అని రాయాలి. ప్రమాణ పత్రంలో ఏదైనా సమాచారం లేకపోతే ఎన్నికల అధికారి నోటీసు ఇస్తారు. దాన్ని సవరించి తిరిగి అందజేయాలి. అప్పటికీ తప్పులుంటే పరిశీలన సమయంలో నామినేషన్ను తిరస్కరిస్తారు. అభ్యర్థులు దాఖలు చేసిన ప్రమాణ పత్రాలను నోటీసు బోర్డుతో పాటు వెబ్సైట్లో పొందుపరుస్తారు.
ఆస్తుల వివరాలన్నీ రాయాల్సిందే
అఫిడవిట్లో స్థిర, చరాస్తుల వివరాలను తప్పనిసరిగా పొందుపరచాలి. బ్యాంకు ఖాతాల్లో నగదు, డిపాజిట్లు, సేవింగ్స్, బీమా పాలసీలు, అప్పుల వివరాలు నమోదు చేయాలి. చేతిలో ఉన్న నగదును కూడా పేర్కొనాలి. ఆభరణాలు, వాహనాలు, వ్యవసాయ భూములు, వాణిజ్య సముదాయాలు, నివాస స్థలాల వివరాలను ప్రస్తావించడంతో పాటు అవి ఎలా వచ్చాయో కూడా రాయాలి. స్థిరాస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ చూపాలి. అభ్యర్థితో పాటు కుటుంబ సభ్యుల పేరిట రుణాలు, వాటి వివరాలు, వారి ఆదాయ మార్గాలు, ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో కాంట్రాక్టులుంటే వాటి వివరాలు నమోదు చేయాలి.
శిక్షలు.. కేసులు
నేర చరిత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రమాణ పత్రంలో నమోదు చేయాలి. ఏదైనా నేరానికి సంబంధించిన శిక్షలు పడి ఉంటే వివరాలు ప్రస్తావించాలి. అప్పీలుకు వెళ్లినా వివరాలు నమోదు చేయాలి. సామాజిక మాధ్యమాల ఖాతాలను తెలియజేయాలి. నోటరీ తప్పనిసరిగా చేయించాలి. అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను ప్రముఖ దినపత్రికల్లో స్పష్టంగా కనిపించేలా ప్రకటన ఇవ్వాలి.
ఓటర్లకు అవగాహన
ఎన్నికల సమయంలో అభ్యర్థికి సంబంధించిన పూర్తి సమాచారం ఓటర్లకు తెలియాలి. కేంద్ర ఎన్నికల సంఘం అభ్యర్థుల పూర్తి సమాచారంతో కూడిన అఫిడవిట్ను వెబ్సైట్లో ఉంచుతుంది. నిబంధనలకు లోబడి ఫారం-26 ద్వారా అభ్యర్థులు తప్పనిసరిగా అఫిడవిట్ సమర్పించాలి. అందులోనే ఆస్తులు, అప్పులు, కేసులు, ఇతర పూర్తి సమాచారం అందులో ఉండటంతో ఓటర్లు తెలుసుకొనే అవకాశం ఉంటుంది. తద్వారా ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకొనే అవకాశం ఉంటుంది.
పారదర్శకంగా పొందుపరచాలి
-ఎం.అనిల్కుమార్, న్యాయవాది, కరీంనగర్
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫాం 26 ద్వారా ఎన్నికల నిబంధనలకు లోబడి పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్ను సమర్పించాలి. అందులో పేరు, పుట్టిన తేదీ, కులం వివరాలు ఉండాలి. ముఖ్యంగా ఆస్తులు, అప్పులు, నేర వివరాలను పారదర్శకంగా పొందుపరచాలి. అఫిడవిట్ను నోటరీ చేయించాలి. తప్పులుంటే న్యాయపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. అభ్యర్థుల వివరాలను ప్రజలు తెలుసుకునే అవకాశముంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరిలో ఉండేదెవరు?
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీలో ఉండేదెవరో సోమవారం తేలిపోనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 3 గంటల వరకే సమయం ఉండటంతో ఎవరు బరిలో ఉంటారు..? ఎవరు నామపత్రాలు వెనక్కి తీసుకుంటారో నేడు వెల్లడి కానుంది. -
44 రోజులు.. రూ.9.71 కోట్లు
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. -
ఉపాధి పని... ఉదయపు నడక
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార సరళి మారింది. ఎండలు మండుతుండటంతో ఇంటింటికీ తిరగడానికి నాయకులు జంకుతున్నారు. ఎక్కువ మంది ఓటర్లు ఉండే ప్రాంతాలకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. -
ఓట్లు అడిగే హక్కు వినోద్కే ఉంది
[ 29-04-2024]
కరీంనగర్లో అభివృద్ధి చేసిన వినోద్కుమార్కే ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఉందని.. ఇతర పార్టీల అభ్యర్థులకు లేదని భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
ప్రజా శ్రేయస్సు పట్టని కాంగ్రెస్, భారాస
[ 29-04-2024]
కాంగ్రెస్, భారాసలు ఏనాడూ ప్రజల కోసం పని చేయలేదని ఎంపీ బండి సంజయ్కుమార్ అన్నారు. -
పదేళ్ల భాజపా పాలనలో ప్రగతి శూన్యం
[ 29-04-2024]
కేంద్రంలో కొనసాగిన పదేళ్ల భాజపా పాలనలో ప్రగతి శూన్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. -
ఆగని అక్రమ తవ్వకాలు..
[ 29-04-2024]
రాజకీయ నాయకుల అండదండలు.. అధికారుల నిర్లక్ష్యం వెరసి అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. -
ధాన్యం తూకాల్లో వేగం ఏదీ?
[ 29-04-2024]
జిల్లాలో వరి కోతలు 80 శాతం పూర్తయ్యాయి. వచ్చే నెల 15 నాటికి కోతలు ముగుస్తాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. -
రాష్ట్రానికి గులాబీ జెండా అవసరం
[ 29-04-2024]
గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు భారాసకు ఉన్న శక్తి, క్యాడర్ ఏ జాతీయ పార్టీకి లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి గులాబీ జెండా అవసరమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. -
ఓటుహక్కు వినియోగంలో మహిళా చైతన్యం
[ 29-04-2024]
2019 సార్వత్రిక ఎన్నికల్లో జగిత్యాల జిల్లాలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ సంఖ్యలో ఓటేశారు. -
బరిలో ఇద్దరు వారసులు
[ 29-04-2024]
స్థానిక సంస్థల నుంచి లోక్సభ ఎన్నికల వరకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల వారసులు బరిలో నిలుస్తుంటారు. -
టోల్ఫ్రీ నంబరు ఎలా వచ్చిందంటే..!
[ 29-04-2024]
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!