గౌరవ వేతనం జాడేది?
కరీంనగర్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏటా అంబేడ్కర్ స్టేడియం వేదికగా ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. నగరంతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి తల్లిదండ్రులు పిల్లలను ఇక్కడకు పంపిస్తుంటారు.
వేసవి శిబిరాల కోచ్ల ఎదురుచూపులు
న్యూస్టుడే, కరీంనగర్ క్రీడా విభాగం
కరీంనగర్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏటా అంబేడ్కర్ స్టేడియం వేదికగా ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. నగరంతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి తల్లిదండ్రులు పిల్లలను ఇక్కడకు పంపిస్తుంటారు. గతేడాది మే, జూన్ నెలలో నిర్వహించిన శిక్షణ శిబిరాల్లో సుమారు 2500 మంది చిన్నారులు శిక్షణ పొందారు. పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు సుమారు 70 మంది కోచ్లను క్రీడా శాఖ ఎంపిక చేసింది. శిక్షణ కాలంలో కోచ్లకు గౌరవ వేతనంగా కొంత మొత్తాన్ని నగరపాలక సంస్థ ఇస్తోంది. గత వేసవి క్రీడా శిబిరంలో కోచ్లకు గౌరవ వేతనం ఇప్పటికీ అందలేదు.
పట్టించుకునే వారు కరవు..
కరీంనగర్ బల్దియా ఆధ్వర్యంలో 2023 మే 5 నుంచి జూన్ 7 వరకు 28 అంశాల్లో శిక్షణ ఇచ్చారు. అనంతరం కోచ్లకు గౌరవ వేతనం ఇవ్వడం ఆనవాయితీ. వేసవి సెలవుల్లో అందరూ విహారయాత్రలకు వెళ్తుంటే 70 మంది కోచ్లు మాత్రం విద్యారులకు క్రీడా నైపుణ్యాలను అందించారు. శిబిరం ముగిసిన తర్వాత వారిని పట్టించుకునే వారే కరవయ్యారు. మళ్లీ వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా గౌరవ వేతనం ఇవ్వాలని కోచ్లు కోరుకుంటున్నారు. తామందరం ప్రైవేటు పాఠశాలల్లో పీఈటీలుగా, క్రీడలకు కోచ్లుగా చాలీచాలని జీతాలతో పని చేస్తున్నామని మొర పెట్టుకున్నా అధికారులు ఆలకించలేదని కోచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేయర్, డీవైఎస్వో, జిల్లా ఒలింపిక్ సంఘం బాధ్యులకు విన్నవించుకున్నా లాభం లేదని వాపోతున్నారు. 2018, 2019లో నిర్వహించిన శిబిరాల్లో పాల్గొన్న కోచ్లకు ఆరు నెలలు గడిచిన తర్వాత గౌరవ వేతనం ఇచ్చారు. తర్వాత కరోనా కారణంగా శిబిరాలు నిర్వహించలేదు. గతేడాది 2022లో నిర్వహించగా.. ఇప్పటికీ ఇవ్వలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరిలో ఉండేదెవరు?
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీలో ఉండేదెవరో సోమవారం తేలిపోనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 3 గంటల వరకే సమయం ఉండటంతో ఎవరు బరిలో ఉంటారు..? ఎవరు నామపత్రాలు వెనక్కి తీసుకుంటారో నేడు వెల్లడి కానుంది. -
44 రోజులు.. రూ.9.71 కోట్లు
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. -
ఉపాధి పని... ఉదయపు నడక
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార సరళి మారింది. ఎండలు మండుతుండటంతో ఇంటింటికీ తిరగడానికి నాయకులు జంకుతున్నారు. ఎక్కువ మంది ఓటర్లు ఉండే ప్రాంతాలకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. -
ఓట్లు అడిగే హక్కు వినోద్కే ఉంది
[ 29-04-2024]
కరీంనగర్లో అభివృద్ధి చేసిన వినోద్కుమార్కే ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఉందని.. ఇతర పార్టీల అభ్యర్థులకు లేదని భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
ప్రజా శ్రేయస్సు పట్టని కాంగ్రెస్, భారాస
[ 29-04-2024]
కాంగ్రెస్, భారాసలు ఏనాడూ ప్రజల కోసం పని చేయలేదని ఎంపీ బండి సంజయ్కుమార్ అన్నారు. -
పదేళ్ల భాజపా పాలనలో ప్రగతి శూన్యం
[ 29-04-2024]
కేంద్రంలో కొనసాగిన పదేళ్ల భాజపా పాలనలో ప్రగతి శూన్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. -
ఆగని అక్రమ తవ్వకాలు..
[ 29-04-2024]
రాజకీయ నాయకుల అండదండలు.. అధికారుల నిర్లక్ష్యం వెరసి అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. -
ధాన్యం తూకాల్లో వేగం ఏదీ?
[ 29-04-2024]
జిల్లాలో వరి కోతలు 80 శాతం పూర్తయ్యాయి. వచ్చే నెల 15 నాటికి కోతలు ముగుస్తాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. -
రాష్ట్రానికి గులాబీ జెండా అవసరం
[ 29-04-2024]
గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు భారాసకు ఉన్న శక్తి, క్యాడర్ ఏ జాతీయ పార్టీకి లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి గులాబీ జెండా అవసరమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. -
ఓటుహక్కు వినియోగంలో మహిళా చైతన్యం
[ 29-04-2024]
2019 సార్వత్రిక ఎన్నికల్లో జగిత్యాల జిల్లాలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ సంఖ్యలో ఓటేశారు. -
బరిలో ఇద్దరు వారసులు
[ 29-04-2024]
స్థానిక సంస్థల నుంచి లోక్సభ ఎన్నికల వరకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల వారసులు బరిలో నిలుస్తుంటారు. -
టోల్ఫ్రీ నంబరు ఎలా వచ్చిందంటే..!
[ 29-04-2024]
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు