వసతుల మెరుగుకు కార్యాచరణ
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరపాలికల్లో కనీస మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రధానంగా తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటారు.
నగరపాలక సంస్థలకు నిధులు
కరీంనగర్లోని నీటిశుద్ధి కేంద్రం
న్యూస్టుడే - కరీంనగర్ కార్పొరేషన్: ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరపాలికల్లో కనీస మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రధానంగా తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం సుమారు 85 శాతం, మిగతా 15 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూర్చాల్సి ఉంటుంది. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్(యూఐడీఎఫ్) పథకం అమలుకు కేంద్ర, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఎన్నికల క్రతువు ముగిసిన తర్వాత పనులు ప్రారంభించనున్నారు. కాగా మొదటి విడతలో లక్షకు పైగా జనాభా కలిగిన నగర పాలికలను ఎంపిక చేశారు. దశల వారీగా ఈ పథకాన్ని విస్తరించనున్నారు.
కరీంనగర్లో భూగర్భ మురుగుకాలువ వ్యవస్థ
కరీంనగర్ నగర పరిధిలో అమృత్ పథకంలో భాగంగా తాగునీటి సరఫరా పటిష్ఠం చేసేందుకు రూ.132.20 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో విలీన కాలనీల్లో పైపులైన్ల విస్తరణ, రిజర్వాయర్లు, సంపులు, నీటిశుద్ధి కేంద్రం వంటి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదించింది. మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మించేందుకు రూ.72.57 కోట్లు కేటాయించారు. తాజాగా యూఐడీఎఫ్ కింద భూగర్భ మురుగునీటి శుద్ధి కేంద్రం పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడానికి, అయిదు జోన్లుగా విభజించి, విలీన కాలనీల నుంచి అనుసంధానం చేసేందుకు రూ.198 కోట్లు కేటాయించారు. సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్, మ్యాన్హోల్స్ నిర్మించడం, 96 కిలోమీటర్ల పొడవునా పైపులైను వేసి, పాడైన రోడ్డుకు మరమ్మతు చేస్తారు.
రామగుండంలో తాగునీటికి ప్రాధాన్యం
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అమృత్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థకు రూ.206.66 కోట్లు కేటాయించారు. ఇప్పటికే శుద్ధి కేంద్రం ఉండగా పెరిగిన కాలనీలను దృష్టిలో ఉంచుకొని, అధునాతన సౌకర్యాలతో యూజీడీ నిర్మిస్తారు. మరో వైపు యూఐడీఎఫ్ స్కీంలో భాగంగా తాగునీటి పథకానికి ప్రాధాన్యం ఇచ్చారు. దీనికోసం రూ.88.90 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో నీటి శుద్ధి కేంద్రానికి నీటిని తీసుకోవడానికి 300 డయా పైపులైను 6.85 కిలోమీటర్లు, పంపింగ్ పైపులైను 68 కిలోమీటర్లు, కొత్తగా అయిదు రిజర్వాయర్లు, 15,400 ఇళ్లకు కొత్తగా నల్లా కనెక్షన్లు, సర్వీసు రిజర్వాయర్లు 2, స్కాడా మీటర్లు వంటికి ఏర్పాటు చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు జమ్మికుంటకు సీఎం.. 8న వేములవాడకు పీఎం
[ 30-04-2024]
పెరుగుతున్న ఉష్ణోగ్రతల మాదిరిగానే పార్టీలు ప్రచార వేడిని క్రమంగా పెంచుతున్నాయి. ఉత్తర తెలంగాణలో కీలకమైన జిల్లాగా పేరొందిన ఉమ్మడి కరీంనగర్పై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి. -
ఎన్నికల బరిలో 99మంది
[ 30-04-2024]
ఎట్టకేలకు లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిచే వారెవరో తేలింది.. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం మధ్యాహ్నంతో ముగియడంతో అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైంది.. -
సెలవు పెట్టలేదు.. విధులకు రాలేదు!
[ 30-04-2024]
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని పలువురు వైద్యులు సెలవు పెట్టకుండా, విధులకు హాజరుకాకపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులుపడ్డారు. -
తగ్గుతున్న మామిడి ధర
[ 30-04-2024]
మామిడి ధరలు రోజురోజుకు తగ్గుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
కమల దళంలో మారిన సమీకరణలు
[ 30-04-2024]
పెద్దపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ నేత బోర్లకుంట వెంకటేశ్నేత భాజపా గూటికి చేరారు. -
నెరవేరని వస్త్రోత్పత్తి లక్ష్యం
[ 30-04-2024]
ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి ఏకరూప దుస్తులు విద్యార్థులకు సిద్ధం చేయడం అసాధ్యమనిపిస్తోంది. -
చైతన్య పలితం.. శాంతియుతం
[ 30-04-2024]
ఒకప్పుడు ఎన్నికలంటేనే గ్రామాల్లో పగలు, ప్రతీకారాలు కనిపించేవి. నిత్యం గొడవలతో ఘర్షణ వాతావరణం నెలకొనేది. -
యువత.. కురిపించాలి మమత
[ 30-04-2024]
నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. -
సుర్రుమంటూ సూరీడు.. ఉసూరుమంటూ నాయకుడు
[ 30-04-2024]
‘ మెల్లగా తెల్లారిందే అలా..!’ అనుకుంటూ రాజకీయ నాయకులు ప్రచారానికి పరుగులెత్తిన కొద్దిసేపటికే భానుడు సుర్రుమంటున్నాడు.. ఉదయం ఏడింటికే భగభగ మండుతున్నాడు.. -
రిజర్వేషన్లు రద్దు చేయబోమని ప్రకటించరెందుకు?
[ 30-04-2024]
రిజర్వేషన్లు రద్దు చేయబోమని భాజపా, ఆర్ఎస్ఎస్ ఎందుకు ప్రకటించడం లేదని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీగౌడ్ ప్రశ్నించారు. -
ఏసీబీకి చిక్కిన హెడ్కానిస్టేబుల్
[ 30-04-2024]
జగిత్యాల జిల్లా బీర్పూర్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సామల్ల మనోహర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. -
ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
[ 30-04-2024]
జిల్లాలో అందిస్తున్న ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!