పనులకు ఆటంకాలు.. రాకపోకలకు అవస్థలు
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు.
ఓడేడ్ వంతెన నిర్మాణంలో అంతులేని జాప్యం
వంతెన పక్క నుంచి తాత్కాలిక రహదారిపై వెళ్తున్న ద్విచక్రవాహనాలు
ఈనాడు, పెద్దపల్లి-న్యూస్టుడే, మంథని, ముత్తారం: రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. ఎట్టకేలకు వంతెన నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో కష్టాలు తీరతాయని భావించారు. ఎనిమిదేళ్లయినా అతీగతీ లేకపోగా పనుల్లో నాణ్యత లోపాలు బయటపడుతుండటంతో నిరాశే మిగిలింది.
ముత్తారం మండలం ఓడేడ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరు వాగుపై నిర్మించతలపెట్టిన వంతెనకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. పనులు ప్రారంభించిన రెండేళ్లకు ప్రధాన గుత్తేదారు చేతులెత్తేయగా, ఉప గుత్తేదారుకు చెందిన యంత్రాలు, సామగ్రి వరదలకు కొట్టుకుపోవడంతో ఆయన కూడా వదిలేశారు. దీంతో వారధి పనులు అసంపూర్తిగా మిగిలాయి. మరోవైపు ఓడేడ్ వంతెనకు దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో గతంలో రూ.21.46 కోట్లతో చేపట్టిన చెక్డ్యాం నిర్మాణాలు కొట్టుకుపోవడంతో పనులు అసంపూర్తిగా నిలిచాయి.
నాణ్యత లోపం లేదు: డీఈఈ
వంతెన గడ్డర్లు వాగులో వేసిన తాత్కాలిక రహదారిపై పడటంతో రెండు జిల్లాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కాగా ఓడేడ్ వంతెన నిర్మాణం పనుల్లో నాణ్యత లోపం లేదని, ప్రకృతి వైపరీత్యం వల్లే గడ్డర్లు కూలిపోయాయని ఆర్అండ్బీ డీఈఈ ఇమానొద్దీన్ జాఫర్ తెలిపారు. రివైజ్డ్ అంచనాలు రూపొందించి తిరిగి టెండర్లు పిలవాల్సి ఉంటుందని, గుత్తేదారుకు బదులుగా ఏజెన్సీకి పని అప్పగిస్తే ఏడాదిలోగా పనులు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.
విచారణ చేయమని సీఎంను కోరా: మంత్రి
ఓడేడ్ వద్ద వంతెన గడ్డర్లు కూలిన ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డిని కోరినట్లు మంత్రి శ్రీధర్బాబు ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాల ఉల్లంఘన, గుత్తేదారుల నిర్లక్ష్యం తదితర అంశాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు.
రూ.75 లక్షల వరకు నష్టం
మానేరుపై ఓడేడ్-గర్మిళ్లపల్లితో పాటు ఖమ్మంపల్లి-తాడిచెర్ల వంతెనల నిర్మాణం ఒకేసారి చేపట్టారు. ఇక్కడ పనులు ఏళ్ల తరబడి సా..గుతుండగా ఖమ్మంపల్లి వద్ద నిర్మాణం పనులు పూర్తయి, వంతెన మీదుగా రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఓడేడ్ వద్ద పనులు అసంపూర్తిగా నిలవడంతో రెండు జిల్లాల మధ్య వర్షాకాలంలో రవాణా సౌకర్యాలు నిలిచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా వంతెనకు చెందిన మూడు గడ్డర్లు కూలిపోవడంతో దాదాపు రూ.75 లక్షల నష్టం వాటిల్లింది. ఎనిమిదేళ్ల కిందట పనులు ప్రారంభించగా ఇప్పటివరకు 23 పియర్లు, 13 బీములు నిర్మించారు. మరో 11 బీముల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రూ.22 కోట్ల వరకు పనులు చేయగా గుత్తేదారుకు రూ.18 కోట్ల వరకు చెల్లించారు. గుత్తేదారుకు పొడిగించిన అదనపు గడువు కూడా పూర్తి కావడంతో కాంట్రాక్టు రద్దు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దారి పొడవునా గులాబీ దండు!
[ 06-05-2024]
భారాస అధినేత బస్సు యాత్రతో గులాబీ దండులో జోష్ నెలకొంది. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో కొనసాగిన యాత్రకు అపూర్వ స్పందన లభించింది. -
ఆటలు ఆడుకోవాలని ఉంది!
[ 06-05-2024]
‘వేసవి సెలవుల్లో ఆడుకోవాలని తహతహలాడాం. మా తల్లిదండ్రుల అనుమతి కూడా తీసుకున్నాం. కరీంనగర్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏటా అంబేడ్కర్ స్టేడియంలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను అట్టహాసంగా నిర్వహించేవారు. -
హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం
[ 06-05-2024]
శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసగించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ముందుకు వస్తున్నారని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇష్టం లేదా?
[ 06-05-2024]
కరీంనగర్ ఎంపీలుగా బోయినపల్లి వినోద్కుమార్, బండి సంజయ్లు నియోజకవర్గానికి చేసిందేమి లేదని, -
ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా.. నిరంతర నిగా
[ 06-05-2024]
స్వేచ్ఛాయుత, సమర్థవంత ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం సాంకేతిక విధానాన్ని అమలు చేస్తోంది. ఎలాంటి ఘర్షణలు, అల్లర్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. -
క్షేమంగా వెళ్లి వారంలోపే రండి!
[ 06-05-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు మరో వారం రోజులే ఉంది. ఈ నెల 13న పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. -
అస్త్రం సంధించి.. ఆదర్శంగా నిలిచి..
[ 06-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత శక్తిమంతమైన ఓటు అస్త్రాన్ని సంధించడంలో పల్లెలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. -
నిజామాబాద్లోనే పసుపు బోర్డు..
[ 06-05-2024]
కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని.. ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషి వల్లే ఇది సాధ్యమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఏళ్లుగా ఇక్కడి రైతుల డిమాండ్గా ఉన్న బోర్డును సాధించటం కోసం మోదీ వెంటపడి సాధించారన్నారు. -
భాజపాకు బుద్ధి చెప్పాలి
[ 06-05-2024]
శాసనసభ ఎన్నికల్లో భారాసను ఓడించినట్లే పార్లమెంట్ ఎన్నికల్లో భాజపాకు బుద్ధి చెప్పాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. -
ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన
[ 06-05-2024]
కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టి, ఆసుపత్రి ఫర్నిచర్ ధ్వంసం చేయడంతోపాటు వైద్యుడు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. -
జిల్లాల పునర్విభజన నిర్ణయాన్ని మానుకోవాలి
[ 06-05-2024]
జిల్లాల పునర్విభజన నిర్ణయాన్ని ప్రభుత్వం మానుకోవాలని జిల్లా పరిరక్షణ కమిటీ నాయకుడు బొల్లి రామ్మోహన్ కోరారు. -
చిన్నబోయిన బొంకూర్
[ 06-05-2024]
వారంతా రోజూవారీ వ్యవసాయ కూలీలు.. రెక్కాడితేనే కుటుంబం గడిచే పరిస్థితి.. ఎప్పటిలాగే కూలీకి వెళ్లి శ్రమించారు. పనులు పూర్తి చేసుకొని చిరునవ్వులతో ఇళ్లకు తిరుగుపయనమయ్యారు. -
పురలో మారిన ముఖచిత్రం
[ 06-05-2024]
గడిచిన నాలుగేళ్ల జగిత్యాల పురపాలనలో వివిధ పార్టీల కౌన్సిలర్ల బలాబలాలు మారిపోయాయి. అధ్యక్ష పీఠంలో అనూహ్య మార్పులు, పాలకవర్గం కూర్పులో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ నేతలకు సవాల్గా మారాయి. -
పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య
[ 06-05-2024]
మండలంలోని కోర్కల్కు చెందిన పూదరి కుమార్(38) పెళ్లి కాదేమోననే బెంగతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వీణవంక ఎస్ఐ తిరుపతి తెలిపారు. -
అగ్నిగుండం
[ 06-05-2024]
ఈ వేసవి సీజన్లో తొలిసారిగా ఆదివారం జగిత్యాల జిల్లాలోని వెల్గటూరులో 47.1 డిగ్రీల సెల్సియస్ రాష్ట్ర స్థాయి అత్యధిక గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా