logo

ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

బోడులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు సీతారామయ్యను సస్పెండ్‌ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 17 Apr 2024 03:03 IST

టేకులపల్లి, న్యూస్‌టుడే: బోడులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు సీతారామయ్యను సస్పెండ్‌ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ విద్యార్థినులు ఫిబ్రవరి నెలలో హెచ్‌ఎం జగన్‌కు ఫిర్యాదు చేశారు. గత నెలలో హెచ్‌ఎం ఈ విషయమై విచారణ చేపట్టి, నివేదికను జిల్లా విద్యాశాఖాధికారికి నివేదించారు. ఉపాధ్యాయుడు సీతారామయ్యపై డీఈఓ సస్పెన్షన్‌ వేటు వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని