logo

అయిదో రోజూ నామినేషన్ల సందడి

ఖమ్మం లోక్‌సభ స్థానంలో అయిదో రోజు మంగళవారం ఎనిమిది మంది అభ్యర్థులు పదకొండు సెట్ల నామపత్రాలను మంగళవారం సమర్పించారు.

Published : 24 Apr 2024 06:23 IST

ఖమ్మం: రఘురామిరెడ్డి తరఫున నామపత్రాలు అందిస్తున్న బొర్రా రాజశేఖర్‌, స్వర్ణకుమారి, నిరంజన్‌రెడ్డి, రాంబాబు

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: ఖమ్మం లోక్‌సభ స్థానంలో అయిదో రోజు మంగళవారం ఎనిమిది మంది అభ్యర్థులు పదకొండు సెట్ల నామపత్రాలను మంగళవారం సమర్పించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి తరఫున మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు రెండు సెట్ల నామపత్రాలను ఆర్‌ఓ గౌతమ్‌కు అందజేశారు. మార్క్‌ఫెడ్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ బొర్రా రాజేశేఖర్‌, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, డాక్టర్‌ కోట రాంబాబు, ధరావత్‌ రామ్మూర్తినాయక్‌, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక సెట్‌ నామపత్రాలు సమర్పించారు. రఘురామిరెడ్డి అభ్యర్థిత్వాన్ని బొర్రా రాజశేఖర్‌ ప్రతిపాదించారు. రఘురామిరెడ్డి పేరిట నూకల నరేశ్‌రెడ్డి, ముస్తఫా, జగన్‌, జొన్నలగడ్డ రవి, స్వామి రమేశ్‌ మరో సెట్‌ నామపత్రాలు అందించారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుని నామపత్రాలు దాఖలు చేసి మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటివరకు అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించకపోవటం గమనార్హం.

  • భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు తరఫున రెండు సెట్ల నామపత్రాలను ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, గెంటేల విద్యాసాగర్‌, సుగ్గల వెంకటేశ్వరరావు గుప్తా అందించారు.
  • రయీస్‌ అన్వర్‌ (సోషలిస్ట్‌ పార్టీ)-1, కె.నాగేశ్వరరావు (స్వతంత్ర)- 1, ఏవీజే ప్రసాద్‌ (పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా)- 1, అవుటపల్లి రామలింగేశ్వరరావు (స్వతంత్ర)- 1, కాశిమళ్ల నాగేశ్వరరావు (స్వతంత్ర)-1 షేక్‌ సిరాజుద్దీన్‌ (స్వతంత్ర) అభ్యర్థి రెండు సెట్ల నామినేషన్లు వేశారు. 

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానానికి భారాస అభ్యర్థి మాలోత్‌ కవిత ఆ పార్టీ నేతలతో కలిసి నామినేషన్‌ వేశారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌, ములుగు జడ్పీ అధ్యక్షురాలు బడే నాగజ్యోతితో కలిసి  ఆర్‌ఓ అద్వైత్‌కుమార్‌సింగ్‌కు నామపత్రాలు అందజేశారు. మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఇల్లెందు, పినపాక, నర్సంపేట మాజీ ఎమ్మెల్యేలు బానోత్‌ శంకర్‌నాయక్‌, డీఎస్‌ రెడ్యానాయక్‌, హరిప్రియ, పెద్ది సుదర్శన్‌రెడ్డి, మహబూబాబాద్‌ జడ్పీ అధ్యక్షురాలు ఆంగోతు బిందు పాల్గొన్నారు.మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానానికి ఆరుగురు అభ్యర్థులు మంగళవారం నామపత్రాలు దాఖలు చేశారు. ఆదివాసీ ఐకాస సంఘాల తరఫున    మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య, స్వతంత్ర అభ్యర్థులు బానోత్‌ ప్రేమ్‌లాల్‌, పోరిక శ్యామల్‌నాయక్‌, జాటోత్‌ రఘువర్మ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ అభ్యర్థి మోకాళ్ల మురళీకృష్ణ నామినేషన్లు వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని