అయిదో రోజూ నామినేషన్ల సందడి
ఖమ్మం లోక్సభ స్థానంలో అయిదో రోజు మంగళవారం ఎనిమిది మంది అభ్యర్థులు పదకొండు సెట్ల నామపత్రాలను మంగళవారం సమర్పించారు.
ఖమ్మం: రఘురామిరెడ్డి తరఫున నామపత్రాలు అందిస్తున్న బొర్రా రాజశేఖర్, స్వర్ణకుమారి, నిరంజన్రెడ్డి, రాంబాబు
ఖమ్మం నగరం, న్యూస్టుడే: ఖమ్మం లోక్సభ స్థానంలో అయిదో రోజు మంగళవారం ఎనిమిది మంది అభ్యర్థులు పదకొండు సెట్ల నామపత్రాలను మంగళవారం సమర్పించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి తరఫున మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు రెండు సెట్ల నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు. మార్క్ఫెడ్ మాజీ వైస్ ఛైర్మన్ బొర్రా రాజేశేఖర్, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, డాక్టర్ కోట రాంబాబు, ధరావత్ రామ్మూర్తినాయక్, ముదిరెడ్డి నిరంజన్రెడ్డి ఒక సెట్ నామపత్రాలు సమర్పించారు. రఘురామిరెడ్డి అభ్యర్థిత్వాన్ని బొర్రా రాజశేఖర్ ప్రతిపాదించారు. రఘురామిరెడ్డి పేరిట నూకల నరేశ్రెడ్డి, ముస్తఫా, జగన్, జొన్నలగడ్డ రవి, స్వామి రమేశ్ మరో సెట్ నామపత్రాలు అందించారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్కు చేరుకుని నామపత్రాలు దాఖలు చేసి మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించకపోవటం గమనార్హం.
- భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు తరఫున రెండు సెట్ల నామపత్రాలను ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, గెంటేల విద్యాసాగర్, సుగ్గల వెంకటేశ్వరరావు గుప్తా అందించారు.
- రయీస్ అన్వర్ (సోషలిస్ట్ పార్టీ)-1, కె.నాగేశ్వరరావు (స్వతంత్ర)- 1, ఏవీజే ప్రసాద్ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా)- 1, అవుటపల్లి రామలింగేశ్వరరావు (స్వతంత్ర)- 1, కాశిమళ్ల నాగేశ్వరరావు (స్వతంత్ర)-1 షేక్ సిరాజుద్దీన్ (స్వతంత్ర) అభ్యర్థి రెండు సెట్ల నామినేషన్లు వేశారు.
మహబూబాబాద్, న్యూస్టుడే: మహబూబాబాద్ లోక్సభ స్థానానికి భారాస అభ్యర్థి మాలోత్ కవిత ఆ పార్టీ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, ములుగు జడ్పీ అధ్యక్షురాలు బడే నాగజ్యోతితో కలిసి ఆర్ఓ అద్వైత్కుమార్సింగ్కు నామపత్రాలు అందజేశారు. మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లెందు, పినపాక, నర్సంపేట మాజీ ఎమ్మెల్యేలు బానోత్ శంకర్నాయక్, డీఎస్ రెడ్యానాయక్, హరిప్రియ, పెద్ది సుదర్శన్రెడ్డి, మహబూబాబాద్ జడ్పీ అధ్యక్షురాలు ఆంగోతు బిందు పాల్గొన్నారు.మహబూబాబాద్ లోక్సభ స్థానానికి ఆరుగురు అభ్యర్థులు మంగళవారం నామపత్రాలు దాఖలు చేశారు. ఆదివాసీ ఐకాస సంఘాల తరఫున మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య, స్వతంత్ర అభ్యర్థులు బానోత్ ప్రేమ్లాల్, పోరిక శ్యామల్నాయక్, జాటోత్ రఘువర్మ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అభ్యర్థి మోకాళ్ల మురళీకృష్ణ నామినేషన్లు వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు పడక గదుల ఇళ్ల పేరుతో కేసీఆర్ మోసగించారు: జేపీ నడ్డా
[ 06-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ నంబర్ వన్ అవుతోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. -
సార్వత్రిక సమరం.. కసరత్తు ముమ్మరం
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అధికార యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. -
కరుగుతున్న గుట్టలు
[ 06-05-2024]
జిల్లా సరిహద్దు మండలాలైన జూలూరుపాడు, ఏన్కూరు ప్రాంతాల నుంచి మట్టి రవాణా జోరందుకుంది. కొత్తగూడెం, పాల్వంచ చుట్టు పక్కల ప్రాంతాలకు సైతం రవాణా అవుతోంది. -
వేసవి తాపం.. మారిన షిఫ్ట్ సమయం
[ 06-05-2024]
సింగరేణి ఉపరితల గనుల్లో షిఫ్ట్ వేళలు మారాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం, రెండో షిఫ్ట్ సమయాల్లో యాజమాన్యం మార్పులు చేసింది. -
అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ను గెలిపించండి: తుమ్మల
[ 06-05-2024]
తాను మంత్రిగా గతంలో కల్లూరును అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. -
రాజకీయాలకు అతీతంగా అండగా నిలుస్తా: నామా
[ 06-05-2024]
రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అండగా ఉంటానని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. -
ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన: మంత్రి పొంగులేటి
[ 06-05-2024]
ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన సాగిస్తుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
భాజపాలో పలువురి చేరిక
[ 06-05-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో కారు షెడ్డుకు పోయిందని, హామీలు నెరవేర్చక కాంగ్రెస్ పని ఖతమయ్యిందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
‘ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలం’
[ 06-05-2024]
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీలు బి.మోహన్రెడ్డి, పూల రవీందర్ పిలుపునిచ్చారు. -
గాలివాన బీభత్సంతో గాఢాంధకారం
[ 06-05-2024]
ఈదురుగాలులు, పిడుగులతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. -
బ్రహ్మోత్సవాల రాబడి.. తేలేదెప్పుడండీ..?
[ 06-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించినా ఈ క్రతువుపై వచ్చిన ఆదాయం ఎంతన్నది ఇప్పటికీ తేలలేదు. -
వాడి తగ్గని దండా
[ 06-05-2024]
ఎన్నికల్లో గెలుపోటములు ప్రధానం కాదని, ప్రజలను చైతన్యం చేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు భారత విప్లవకారుల సమైక్యతా కేంద్రం(మార్క్సిస్ట్, లెనినిస్ట్)(యూసీసీఆర్ఐ-ఎంఎల్) ఖమ్మం లోక్సభ అభ్యర్థి దండా లింగయ్య. -
భారాస గెలిస్తేనే రాష్ట్రానికి మేలు
[ 06-05-2024]
భారాస కార్యకర్తల కృషి, ఐదు నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో తాను మరోసారి విజయం సాధిస్తానని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. -
అతివల చేతిలో ఓటు చైతన్యం
[ 06-05-2024]
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఓటరు చైతన్యంపై వినూత్న ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
కోడి ధరకు రెక్కలు
[ 06-05-2024]
వేసవి ఎండల ప్రభావానికి కోళ్ల సరఫరా తగ్గడంతో ఉమ్మడి జిల్లాలో మాంసం ధరలు అమాంతం పెరిగాయి. -
బాలికలే సాధకులు
[ 06-05-2024]
తల్లిదండ్రులు బాలురతో సమానంగా బాలికలను ప్రోత్సహిస్తున్నారు. ఇంట్లో ఇద్దరు, ముగ్గురు బాలికలున్నా వేసవి సెలవుల్లో వారిని వెన్నుతట్టి నడిపిస్తున్నారు. -
వైభవంగా రాములోరికి అభిషేకం
[ 06-05-2024]
భద్రాచలం రామాలయ క్యూలైన్లు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. ప్రధాన కోవెలలో అర్చకులు సుప్రభాత సేవ చేసి అభిషేక మహోత్సవాన్ని కొనసాగించారు. -
7న సినీ నటుడు వెంకటేశ్ రాక
[ 06-05-2024]
ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి వియ్యంకుడు సినీ నటుడు విక్టరీ వెంకటేష్ ఈనెల 7న ఖమ్మం రానున్నట్లు ప్రోగ్రాం సమన్వయకర్త తుంబూరు దయాకర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
దంపతులను బలిగొన్న టిప్పర్
[ 06-05-2024]
టిప్పర్ ఢీకొని భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో ఈ ఘటన ఆదివారం చోటుచేసుకొంది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు