logo

అమరావతి వద్దు- మూడు రాజధానులు ముద్దు

మండల కేంద్రమైన సి.బెళగల్‌లో బుధవారం మండల వైకాపా నాయకులు ఎస్‌.ఎం.బాషా, ఆకుల బస్సయ్య, సీబీ తులసీరెడ్డి, సర్పంచి పాండురంగన్న ఆధ్వర్యంలో స్థానిక శివాలయంలో అమరావతి వద్దు- మూడు రాజధానులు ముద్దు అని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Published : 05 Oct 2022 14:54 IST

సి.బెళగల్‌ : మండల కేంద్రమైన సి.బెళగల్‌లో బుధవారం మండల వైకాపా నాయకులు ఎస్‌.ఎం.బాషా, ఆకుల బస్సయ్య, సీబీ తులసీరెడ్డి, సర్పంచి పాండురంగన్న ఆధ్వర్యంలో స్థానిక శివాలయంలో అమరావతి వద్దు- మూడు రాజధానులు ముద్దు అని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వైకాపా నాయకుడు ఎస్‌.ఎం.బాషా మాట్లాడుతూ వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఉంటేనే పరిపాలనా సౌలభ్యం ఉంటుందన్నారు. దీనికి మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు కూడా సహకరించాలని కోరారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహం, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించరు. అమరావతి వద్దు మూడు రాజధానులే ముద్దు అనే నినాదాలతో హోరెత్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని