ఎలిగెత్తిన జనం.. ఎగిరిన త్రివర్ణం
ఎలుగెత్తి పాడారు స్వేచ్ఛాగీతం.. మురిసింది జన పతాకం. గణతంత్ర వేడుకలు గురువారం ఊరువాడలా కనులపండువగా సాగాయి.
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి : కలెక్టర్ కోటేశ్వరరావు
పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్, ఎస్పీ
కర్నూలు సచివాలయం, కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే, బృందం: జనం పదం కదిపారు.. ఎలుగెత్తి పాడారు స్వేచ్ఛాగీతం.. మురిసింది జన పతాకం. గణతంత్ర వేడుకలు గురువారం ఊరువాడలా కనులపండువగా సాగాయి. త్రివర్ణ పతాకాలను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు స్మరించుకున్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు మైదానంలో నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
* జిల్లా సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని కలెక్టర్ పి.కోటేశ్వరరావు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు పరేడ్ మైదానంలో గురువారం ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ సిద్ధార్థ కౌశల్తో కలిసి పెరేడ్ వీక్షించి.. సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ కర్నూలుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ నాగప్ప రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుడు కావడం జిల్లావాసులకు గర్వకారణమన్నారు.
ఎథీనా స్కూలు విద్యార్థుల నృత్య ప్రదర్శన
కలెక్టర్ ప్రగతి నివేదిక వివరిస్తూ... రూ.1,942 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న వేదవతి ఎత్తిపోతల పథకం ద్వారా 80 వేల ఎకరాలకు నీరిచ్చేందుకుగాను పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. రూ.1,985 కోట్ల అంచనా వ్యయంతో రాజోలిబండ కుడిగట్టు కాలువ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. జిల్లాలో రూ.93 కోట్లతో 9,635 ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు 8 ఎత్తిపోతల పథకాలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. ఆదోనిలో రూ.500 కోట్లతో నిర్మిస్తున్న వైద్య కళాశాల పనులు 2025 డిసెంబరు నాటికి పూర్తి చేసేలా పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు.
* సర్వజన వైద్యశాలలో రూ.120 కోట్లతో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుచేస్తున్నామని.. త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. కర్నూలు, ఆదోని ఆసుపత్రుల్లో రూ.2 కోట్లతో చేపడుతున్న డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ పనులు త్వరలో పూర్తి కానున్నాయన్నారు.
*ఉగాది నాటికి 13,774 ఇళ్లు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయించేలా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. 29,693 మంది విద్యార్థులు, 2,318 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్లు అందించామన్నారు.
వలసల నివారణకు చర్యలు
వలసల నివారణకు, ఆదోని పశ్చిమ ప్రాంతం అభివృద్దికి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని కలెక్టర్ చెప్పారు. ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాల్లోని అన్ని మండలాలతో కలిపి ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి అన్నివిధాలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మైక్రో ఇరిగేషన్ ద్వారా రానున్న ఐదేళ్లలో ఆదోని ప్రాంతంలోని 5,960 హెక్టార్లను సాగులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఉద్యానశాఖ ద్వారా ఐదేళ్లలో పది వేల మంది రైతుల పొలాల్లో ఉద్యాన పంటల సాగు లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, జేసీ ఎస్.రామ్సుందర్రెడ్డి, సెబ్ అదనపు ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, డీఆర్వో నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రగతి ప్రదర్శన
గణతంత్ర వేడుకల్లో భాగంగా 12 ప్రభుత్వ శాఖల శకటాలను ప్రదర్శించారు. సమగ్రశిక్ష అభియాన్, వ్యవసాయ శాఖకు ప్రథమ, ద్వితీయ బహుమతులు.. గృహ నిర్మాణ, పంచాయతీరాజ్ శాఖ శకటాలకు తృతీయ బహుమతి లభించింది.
మురిసిన విద్యార్థి లోకం
పరేడ్ మైదానంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎడిఫై పాఠశాల.. ఏకదంతాయ పాటకు, యూఆర్ఎస్ పాఠశాల.. ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించిన దేశభక్తి పాటకు, ఎథీనా విద్యార్థులు రామం రాగవం పాటకు, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యార్థులు లంబాడీ పాటకు, కేశవరెడ్డి పాఠశాలకు చెందిన 270 విద్యార్థులు సైరా నరసింహారెడ్డి సినిమా పాటకు నృత్య ప్రదర్శన ఇచ్చారు. కృష్ణగిరి మండలం కేజీబీవీ పాఠశాల విద్యార్థుల రోప్ స్కిప్పింగ్ నృత్యం చేశారు.
సమరయోధుల కుటుంబసభ్యులకు సన్మానం
గణతంత్ర దినోత్సవానికి హాజరైన ఏడుగురు స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబసభ్యులను కలెక్టర్ కోటేశ్వరరావు, ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గుర్రం వెంకటరెడ్డి కుమారుడు జైపాల్రెడ్డి, సర్దార్ నాగప్ప కుమారుడు సర్దార్ బుచ్చిబాబు, జి.సత్యనారాయణ సతీమణి సుబ్బమ్మ, శుభాకర్ భార్య ఎం.సి.ఎంకమ్మ, ఎస్డీ నారాయణరావు కుమారుడు ఎస్డీ నరేంద్ర ప్రసాద్, ఎంఎస్కే బియాబానీ కుమారుడు, కుమార్తె బాషా బియాబాని, జైనత్బీబీ, తుక్కోజీరావు కుమారుడు చంద్రకాంత్ను సన్మానించారు.
ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి నాటకాన్ని పాట రూపంలో ప్రదర్శిస్తున్న కేశవరెడ్డి పాఠశాల విద్యార్థులు
స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను సన్మానిస్తున్న కలెక్టర్, ఎస్పీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి
[ 26-04-2024]
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా నాయకుడు డి.విష్ణువర్థన్ రెడ్డి పేర్కొన్నారు. -
బుగ్గన నామినేషన్ పెండింగ్లో ఉంచిన ఎన్నికల అధికారి
[ 26-04-2024]
డోన్ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి నామినేషన్ను ఎన్నికల అధికారి పెండింగ్లో ఉంచారు. -
ఇంటింటికి తెలుగుదేశం
[ 26-04-2024]
పెద్దకడుబుర్ మండలం జాలవడి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
[ 26-04-2024]
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి కుంటు పడింది
[ 26-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి అన్ని రంగాల్లో కుంటుపడిందని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
[ 26-04-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు.. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినిగించుకోవాలని సీఐ రమేష్బాబు తెలిపారు. -
హంద్రీ నీవా కట్టపై జగన్ కనికట్టు
[ 26-04-2024]
దూదేకొండ, కోతిరాళ్ల, కొత్తపల్లి, కనకదిన్నె, వెలమకూరు, ఆర్.మండగిరి, జె.అగ్రహారం గ్రామాల రైతులకు చెందిన సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. -
చేనేతలను విస్మరించిన వైకాపా
[ 26-04-2024]
సీఎం జగన్ ప్రభుత్వంలో చేనేతలను పూర్తిగా విస్మరించి, ఓట్లు కోసం రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ ఆరోపించారు. -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
[ 26-04-2024]
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
పచ్చని సీమ చేస్తానంటివి.. పచ్చిక లేకుండా చేస్తివి
[ 26-04-2024]
శ్రీశైలం కుడిగట్టు కాల్వ(ఎస్సార్బీసీ)ను 2003లో పూర్తి చేశారు. పాములపాడు మండలం బనకచెర్ల నుంచి అవుకు రిజర్వాయర్ వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 1.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. -
గడప గడపనా జగన్ ధోకా
[ 26-04-2024]
దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేయగా ప్రస్తుతం 91 వివిధ దశల్లో ఉండగా మిగిలినవి ప్రారంభమే కాలేదు. -
నాసిరకం విత్తన ముఠాల నాయకుడు పోచా : బైరెడ్డి
[ 26-04-2024]
: ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నాసిరకం విత్తన ముఠాల లీడరని రైతులే చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. -
ఏకపక్ష పల్లెలు.. అధికారంలో గుబులు
[ 26-04-2024]
అవుకు మండలం గుండ్లశింగవరం బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంతూరు.. ‘అధికారం’ ఉపయోగించి అక్కడ ప్రతిసారి పోలింగ్ ఏకపక్షంగా నడిపిస్తున్నారు. -
గులాబీ రంగుల్లో మునిగితేలారు
[ 26-04-2024]
చిన్నహోతూరు గ్రామస్థులంతా గులాబీ రంగులో మునిగితేలారు. సిద్ధరామేశ్వరస్వామి ఉత్సవాల ముగింపు సందర్భంగా వసంతోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. -
టీజీ.. క్రేజీ
[ 26-04-2024]
కర్నూలు నగరం.. జనసంద్రమైంది. వేలాది మంది తెదేపా, జనసేన, భాజపా, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, తెదేపా అభిమానుల భారీ ర్యాలీ నడుమ తెదేపా కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. -
నిధులు చెత్తపాలు.. సంపద ఉత్తిమాట
[ 26-04-2024]
చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వం చెత్త సందప కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
ఒక కుటుంబం.. రెండు పార్టీలు
[ 26-04-2024]
ఆళ్లగడ్డ రాజకీయం ఎప్పుడూ విచిత్రమే.. ప్రస్తుత ఎన్నికలో మరో విచిత్రం చోటు చేసుకుంది. పురపాలక ఛైర్మన్ కుటుంబంలో సభ్యులు రెండు పార్టీలకు మద్దతు పలుకుతుండటం చర్చనీయాంశంగా మారింది. -
విజేఈఈలు
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. బుధవారం రాత్రి ఫలితాలు విడుదలవగా ఉత్తమ పర్సంటైల్ సాధించారు. -
రామయ్యా.. ఇన్నాళ్లకు గుర్తుకొచ్చామా
[ 26-04-2024]
నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, మేయర్ బీవై రామయ్య గురువారం కర్నూలు నగర పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. -
టీజీ భరత్ నామినేషన్ దాఖలు
[ 26-04-2024]
కర్నూలు అసెంబ్లీ స్థానానికి మొత్తం 56 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని నారాయణ కళాశాలల డీజీఎం గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు