ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చలేదు
కర్నూలు నగరంలో ఈనెల 5న ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
5న ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర మహాసభ
భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తాం
బొప్పరాజు వెంకటేశ్వర్లు
మాట్లాడుతున్న ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: కర్నూలు నగరంలో ఈనెల 5న ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఏపీ ఐకాస అమరావతి జిల్లా అధ్యక్షుడు గిరికుమార్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి.రావు, అసోసియేట్ ఛైర్మన్ టి.వి.ఫణివీర్రాజు, కోశాధికారి వి.వి. మురళీకృష్ణ నాయుడు, కో ఛైర్మన్ కె.మల్లేశ్వరరావుతో కలిసి కర్నూలులో శుక్రవారం మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత గతేడాది ఫిబ్రవరి 6న చలో విజయవాడ పేరుతో వేలాది మంది ఉద్యోగులు తమ సమస్యలపై మహా ప్రదర్శన నిర్వహించారని.. రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఇదే పెద్ద ఉద్యమమని చెప్పారు. ఉద్యోగుల సంఘటితం ద్వారానే ప్రభుత్వం 11వ పీఆర్సీ ప్రకటించిందన్నారు. గతంలో రాయితీలు పోగొట్టుకోకుండా నిలబెట్టుకున్నామని.. కొత్తగా సాధించిందేమీ లేదన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్.. ఇలా అన్నిరకాల ఉద్యోగులు సీఎం జగన్ ఇచ్చిన హామీల అమలుకోసం ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నారన్నారు. ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదన్నారు. కొత్త పీఆర్సీలో రెండు, మూడు ప్రధాన డిమాండ్లు కూడా పరిష్కారానికి నోచుకోలేదంటూ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సంవత్సరం నుంచి సహకారం అందిస్తూ వచ్చామన్నారు. ఏపీ ఐకాస అమరావతి ఏర్పడి మూడేళ్లు పూర్తి చేసుకుందని, ఈ సందర్భంగా 5వ తేదీన కర్నూలు నగర శివారులోని కర్నూలు-బెంగళూరు జాతీయ రహదారిలో ఉన్న జీఆర్సీ కన్వెన్షన్ సెంటరులో మూడో మహాసభను వేలాది మంది ఉద్యోగులతో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 26 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, రాయలసీమ జిల్లాల కార్యవర్గాలు, ఐకాసలో 94 సంఘాల అధ్యక్ష, కార్యదర్శులంతా సమావేశమై అందరితో చర్చలు జరిపి భవిష్యత్తు కార్యాచరణకు నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
నేడు నూతన కార్యవర్గ ఎన్నిక
ఏపీ ఐకాస అమరావతి నూతన కార్యవర్గ ఎన్నికలు కర్నూలు నగరంలో శనివారం జరగనున్నాయని బొప్పరాజు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ జరుగుతుందన్నారు. ఎన్నికల అధికారిగా ఏపీ సహకార శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భావన రుషి, సహాయ ఎన్నికల అధికారిగా ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణ, అదే రోజు రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక పూర్తవుతుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదరరావు, రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, ఐకాస నాయకులు ఈర్ల శ్రీరామ్మూర్తి, గ్రామ సచివాలయ రాష్ట్ర నాయకులు జ్యోతి, సల్మాన్ భాషా, వీఆర్ఏల సంఘం రాష్ట్ర నాయకులు వెంకట్రావ్, సత్యం, వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయులు, సాంబశివరావు తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా గెలిస్తే ఇంటి వద్దకే పింఛన్
[ 10-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇంటి వద్దకే వృద్ధులకు రూ.4,000 పెన్షన్, వికలాంగులకు రూ.6,000 పెన్షన్లు అందిస్తామని తెదేపా మండల కన్వీనర్ షేక్షావలి అన్నరు. -
ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టంతో వైకాపా మోసం
[ 10-05-2024]
వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ ఆక్ట్ చట్టం అమలులోకి తీసుకొచ్చి రైతాంగాన్ని మోసం చేస్తోందని ఎమ్మిగనూరు నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆరోపించారు. -
ఘనంగా బసవేశ్వర స్వామి జయంతి వేడుకలు
[ 10-05-2024]
జిల్లా కేంద్రంలో బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
సున్నిపెంటలో తెదేపా ఎన్నికల ప్రచారం
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెదేపా, జనసేన, భాజపా నాయకులు శుక్రవారం రోడ్ షో నిర్వహించారు. -
ఘనంగా బస్వేశ్వరస్వామి జయంతి వేడుకలు
[ 10-05-2024]
మండల కేంద్రమైన సీబెళగల్లో శుక్రవారం వీరశైవ సంఘం ఆధ్వర్యంలో బసవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
తెదేపా తెచ్చింది.. వైకాపా ఆపింది
[ 10-05-2024]
ప్రజల దాహం తీర్చాలని.. విద్యారంగాన్ని ముందుకు నడిపించాలని.. అతివకు అండగా నిలవాలని.. పల్లెల పొలాలు తడపాలని.. వారధి నిర్మాణంతో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని.. పేదలకు గూడు నిర్మించి నీడ కల్పించాలని భావించారు. -
జగన్ మాటలు వినని జనం
[ 10-05-2024]
నగరంలో ఎస్టీబీసీ కళాశాల ప్రాంతంలో గురువారం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ మాటలు వినే వారు కరవయ్యారు. కార్పొరేటర్లు, కొందరు నేతలు సీఎం సభకు మహిళలను తీసుకొచ్చారు -
జగన్ సభ.. అబద్ధాలకు వేదిక
[ 10-05-2024]
నగరంలో ఎస్టీబీసీ కళాశాల ప్రాంతంలో గురువారం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ సభలో ఆ పార్టీ నేతలు అబద్ధాలే ప్రచార అస్త్రాలు చేసుకొన్నారు. -
సాగు యంత్రం.. జగన్ కుతంత్రం
[ 10-05-2024]
‘‘ సాగు వ్యయం తగ్గించి.. నికర ఆదాయం పెంచాలనే తపనతో ఆర్బీకే పరిధిలోని రైతుబృందాలకు కనీసం ఒక వైఎస్సార్ యంత్రసేవ కేంద్రం (సీహెచ్సీ) ఏర్పాటు చేస్తున్నాం.. -
గద్దెనెక్కారు.. కొండలు కూల్చారు
[ 10-05-2024]
ఆపదలో ఆదుకుంటాడని.. అవసరమొస్తే సాయం చేస్తాడని నమ్మి మండుటెండలో గంటల తరబడి నిలబడి ఓటేశాం.. తీరా గద్దెనెక్కాక.. ప్రజా అవసరాలు మరిచారు.. ఊళ్లకు దారి వేయలేదు.. గుక్కెడు నీరివ్వలేదు.. -
ముగిసిన పోస్టల్ బ్యాలట్ ఓటింగ్
[ 10-05-2024]
జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన ఫెసిలిటేషన్ సెంటర్లలో గత నాలుగు రోజులుగా నిర్వహించిన పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
జగన్ పాలనలో అన్ని రంగాలు నాశనం
[ 10-05-2024]
వైకాపా ప్రభుత్వం అన్ని రంగాలను నాశనం చేసిందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, నంద్యాల తెదేపా జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు -
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం
[ 10-05-2024]
‘‘ఎన్నికల పోలింగ్కు 72 గంటల సమయం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేశాం. ప్రతి ఒక్కరూ ఓటేసి పోలింగ్ శాతం పెంపునకు కృషి చేయాలి’’ అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు. -
జగన్మాయా..వైద్యం అందదయా!
[ 10-05-2024]
ఆరోగ్య కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి జగన్, ప్రజాప్రతినిధులు పలు ప్రసంగాల్లో చెబుతున్న మాటలు క్షేత్ర స్థాయిలో ఆచరణకు నోచుకోవడం లేదు. -
నిర్వాసితులపై జగన్ పైసాచికత్వం
[ 10-05-2024]
నీళ్లొస్తే బతుకులు బాగుపడతాయని ఆలోచించారు. జీవనాధారమైన భూములను త్యాగం చేశారు. పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. -
మంత్రి ఇలాకా...అరాచకాల కేక
[ 10-05-2024]
‘‘డోన్లో గత ప్రభుత్వంలా కాకుండా అక్రమాలకు తావులేకుండా ప్రజలకు మేలైన పాలన అందించాం. నేరాలు అదుపు చేసేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం.
తాజా వార్తలు (Latest News)
-
జైలు నుంచి విడుదలైన సీఎం కేజ్రీవాల్
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!