అమరావతి ఆశ.. రమణబాబు దురాశ
కర్నూలు తాలుకా అర్బన్ పోలీసుస్టేషన్లో అపహరణకు గురైన 105 కిలోల వెండి, రూ.2.05 లక్షల నగదు కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.
తొమ్మిది నెలల కిందటనే స్టేషన్లో సొత్తు మాయం
81.52 కిలోల వెండి, రూ.10 లక్షల నగదు స్వాధీనం
ఇప్పటి వరకు నలుగురి అరెస్టు
పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు, వెండి
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే : కర్నూలు తాలుకా అర్బన్ పోలీసుస్టేషన్లో అపహరణకు గురైన 105 కిలోల వెండి, రూ.2.05 లక్షల నగదు కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి కర్నూలు బుధవారపేటకు చెందిన అమరావతి( కౌతాళం హెడ్ కానిస్టేబుల్), ఆత్మకూరు పట్టణం నేతాజీ నగర్కు చెందిన రమణబాబు(కోడుమూరు కానిస్టేబుల్), అమరావతి భర్త విజయ్భాస్కర్ (బుధవారపేట), ఆమె మరిది భరత్సింహా(ప్రకాశ్నగర్)ను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో అదనపు ఎస్పీ ప్రసాద్, సిబ్బందితో కలిసి ఎస్పీ సిద్ధార్థ కౌశల్ శనివారం వివరాలు వెల్లడించారు.
105 కిలోల వెండి.. రూ.2.05 లక్షల నగదు
* 2021 జనవరి 27న కర్నూలు మండలం పంచలింగాల చెక్పోస్టు వద్ద సెబ్ అధికారులు తనిఖీలు చేస్తుండగా హైదరాబాద్ నుంచి కారులో వస్తున్న తమిళనాడు రాష్ట్రం సేలం వ్యాపారి సందన్ భారతిగోవిందరాజ్ వద్ద 105 కిలోల వెండి, రూ.2.05 లక్షల నగదు దొరికింది. సరైన ఆధార పత్రాలు లేకపోవటంతో అక్రమ రవాణాగా పరిగణిస్తూ సీజ్ చేసి కర్నూలు తాలుకా అర్బన్ పోలీసుస్టేషన్లో సీఐ విక్రమ్సంహాకు అప్పగించారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లటంతో రూ.35 లక్షల జరిమానా విధించారు.
వ్యాపారి రారని నిర్ధారించుకుని
* బాధితులు జరిమానా చెల్లించకపోవటంతో సొత్తు స్టేషన్లో ఉంచారు. అప్పట్లో స్టేషన్ రైటర్గా ఉన్న కానిస్టేబుల్ రమణబాబు ఠాణాలోని ప్రాపర్టీ గదిలో వెండిని భద్రపరిచి రూ.2.05 లక్షలు వాడుకున్నారు. కొన్నాళ్లకు సీఐ విక్రమ్సింహా బదిలీ కావడంతో ఆయన స్థానంలో శేషయ్య వచ్చారు. ఇదే సమయంలో రమణబాబు బదిలీ కావడంతో తను వాడుకున్న రూ.2.05 లక్షలు స్టేషన్ రైటర్, హెడ్ కానిస్టేబుల్ అమరావతికి తిరిగి ఇచ్చేశారు.
* వెండి తీసుకెళ్లేందుకు తమిళనాడు వ్యాపారి ఆసక్తి చూపటం లేదన్న విషయాన్ని పసిగట్టిన అమరావతికి కాజేయాలన్న దుర్భుద్ధి పుట్టింది. వ్యాపారికి అమరావతి పలుమార్లు వాట్సాప్ కాల్ చేశారు.. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఇక వారు రారని నిర్ధారించుకున్నారు. వెండి అపహరించే ఆలోచనను కానిస్టేబుల్ రమణబాబుకు చెప్పి అతడిని భాగస్వామిగా చేసుకుంది.
భర్తను రప్పించి.. బ్యాగులు బయటకు తోసి
వెండిని కాజేయాలన్న ఆలోచనలో ఉన్న అమరావతి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. సీజ్ చేసి స్టేషన్లో ఉంచిన మద్యాన్ని ధ్వంసం చేసే కార్యక్రమం మే 24న చేపట్టారు. సిబ్బంది హడావుడిగా ఉన్న సమయంలో అమరావతి స్టేషన్ మొదటి అంతస్తులో ఉన్న వెండిని కిందికి తీసుకొచ్చి సీఐ గదికి మార్చింది. అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో తన భర్తతో స్టేషన్కు వచ్చింది. సీఐ గదిలో కిటికీకి గ్రిల్ లేకపోవటంతో రెండు బ్యాగుల వెండిని బయటకు తోశారు. వాటిని తీసుకొని విజయ్భాస్కర్ అక్కడి నుంచి ఉడాయించారు. తర్వాత విజయ్భాస్కర్ తన తమ్ముడు భరత్సింహా ద్వారా 23 కిలోల వెండి విక్రయించారు.
వీటికి సమాధానాలేవీ
వెండి చోరీ ఉదంతంలో పలు విషయాలు మిస్టరీగా మారాయి. రికవరీ విషయంలో స్పష్టత కొరవడింది. వెండి విక్రయించిన తర్వాత హెడ్ కానిస్టేబుల్ అమరావతితో చేతులు కలిపిన కానిస్టేబుల్ రమణబాబు వాటా లెక్క చెప్పలేదు. 23 కిలోల వెండి విక్రయించి నగదుగా మార్చుకున్నట్లు చెప్పిన ఉన్నతాధికారులు ఆ డబ్బుతో ఏమి కొనుగోలు చేశారో చెప్పలేదు. కొత్త కారులో పారిపోతున్నట్లు చెప్పినా.. ఆ కారు ఎవరిది.. ఎప్పుడు కొనుగోలు చేశారో వివరాలు వెల్లడించలేదు.
వ్యాపారి రావడంతో వెలుగులోకి
వెండి ధర పెరిగేసరికి ఇటీవల తమిళనాడు వ్యాపారి వెండికి పన్ను చెల్లించి విడుదల ఉత్తర్వు పొందారు. వెండి తీసుకెళ్లేందుకు కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్కు రావటంతో వెండి, నగదు మాయమైనట్లు బయటపడింది. ఈ ఉదంతం కాస్త వివాదాస్పదంగా మారటంతో కేసు నమోదుకు ఎస్పీ ఆదేశించారు. చర్యలు తీసుకుంటారని గ్రహించిన నిందితులు ముందస్తు బెయిల్ పొందేందుకు కారులో కర్ణాటక రాష్ట్రానికి పారిపోతుండగా పట్టుకున్నామని, 81.52 కిలోల వెండి, రూ.10 లక్షల నగదు వారి నుంచి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. జరిగిన ఘటన బాధాకరమని ఎస్పీ విచారం వ్యక్తం చేస్తూ మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో విచారణ జరిపించి లోపాలు గుర్తిస్తామని, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి
[ 26-04-2024]
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా నాయకుడు డి.విష్ణువర్థన్ రెడ్డి పేర్కొన్నారు. -
బుగ్గన నామినేషన్ పెండింగ్లో ఉంచిన ఎన్నికల అధికారి
[ 26-04-2024]
డోన్ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి నామినేషన్ను ఎన్నికల అధికారి పెండింగ్లో ఉంచారు. -
ఇంటింటికి తెలుగుదేశం
[ 26-04-2024]
పెద్దకడుబుర్ మండలం జాలవడి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
[ 26-04-2024]
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి కుంటు పడింది
[ 26-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి అన్ని రంగాల్లో కుంటుపడిందని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
[ 26-04-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు.. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినిగించుకోవాలని సీఐ రమేష్బాబు తెలిపారు. -
హంద్రీ నీవా కట్టపై జగన్ కనికట్టు
[ 26-04-2024]
దూదేకొండ, కోతిరాళ్ల, కొత్తపల్లి, కనకదిన్నె, వెలమకూరు, ఆర్.మండగిరి, జె.అగ్రహారం గ్రామాల రైతులకు చెందిన సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. -
చేనేతలను విస్మరించిన వైకాపా
[ 26-04-2024]
సీఎం జగన్ ప్రభుత్వంలో చేనేతలను పూర్తిగా విస్మరించి, ఓట్లు కోసం రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ ఆరోపించారు. -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
[ 26-04-2024]
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
పచ్చని సీమ చేస్తానంటివి.. పచ్చిక లేకుండా చేస్తివి
[ 26-04-2024]
శ్రీశైలం కుడిగట్టు కాల్వ(ఎస్సార్బీసీ)ను 2003లో పూర్తి చేశారు. పాములపాడు మండలం బనకచెర్ల నుంచి అవుకు రిజర్వాయర్ వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 1.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. -
గడప గడపనా జగన్ ధోకా
[ 26-04-2024]
దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేయగా ప్రస్తుతం 91 వివిధ దశల్లో ఉండగా మిగిలినవి ప్రారంభమే కాలేదు. -
నాసిరకం విత్తన ముఠాల నాయకుడు పోచా : బైరెడ్డి
[ 26-04-2024]
: ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నాసిరకం విత్తన ముఠాల లీడరని రైతులే చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. -
ఏకపక్ష పల్లెలు.. అధికారంలో గుబులు
[ 26-04-2024]
అవుకు మండలం గుండ్లశింగవరం బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంతూరు.. ‘అధికారం’ ఉపయోగించి అక్కడ ప్రతిసారి పోలింగ్ ఏకపక్షంగా నడిపిస్తున్నారు. -
గులాబీ రంగుల్లో మునిగితేలారు
[ 26-04-2024]
చిన్నహోతూరు గ్రామస్థులంతా గులాబీ రంగులో మునిగితేలారు. సిద్ధరామేశ్వరస్వామి ఉత్సవాల ముగింపు సందర్భంగా వసంతోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. -
టీజీ.. క్రేజీ
[ 26-04-2024]
కర్నూలు నగరం.. జనసంద్రమైంది. వేలాది మంది తెదేపా, జనసేన, భాజపా, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, తెదేపా అభిమానుల భారీ ర్యాలీ నడుమ తెదేపా కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. -
నిధులు చెత్తపాలు.. సంపద ఉత్తిమాట
[ 26-04-2024]
చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వం చెత్త సందప కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
ఒక కుటుంబం.. రెండు పార్టీలు
[ 26-04-2024]
ఆళ్లగడ్డ రాజకీయం ఎప్పుడూ విచిత్రమే.. ప్రస్తుత ఎన్నికలో మరో విచిత్రం చోటు చేసుకుంది. పురపాలక ఛైర్మన్ కుటుంబంలో సభ్యులు రెండు పార్టీలకు మద్దతు పలుకుతుండటం చర్చనీయాంశంగా మారింది. -
విజేఈఈలు
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. బుధవారం రాత్రి ఫలితాలు విడుదలవగా ఉత్తమ పర్సంటైల్ సాధించారు. -
రామయ్యా.. ఇన్నాళ్లకు గుర్తుకొచ్చామా
[ 26-04-2024]
నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, మేయర్ బీవై రామయ్య గురువారం కర్నూలు నగర పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. -
టీజీ భరత్ నామినేషన్ దాఖలు
[ 26-04-2024]
కర్నూలు అసెంబ్లీ స్థానానికి మొత్తం 56 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని నారాయణ కళాశాలల డీజీఎం గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?