Kurnool: బుగ్గన ఇలాకాలో.. అల్లరి మూకల కేకలు
ఆర్థిక మంత్రి ఇలాకా డోన్ పట్టణంలో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు. యువకులు బృందాలుగా ఏర్పడి ప్రధాన ప్రాంతాల్లో తిరుగుతూ దాడులకు దిగుతున్నారు.
వరుస ఘటనలతో ప్రజల్లో ఆందోళన
గుంపులుగా చేరి గొడవలు
డోన్లో ప్రజలు స్వేచ్ఛగా ఉండాలనేదే ధ్యేయం. గత ప్రభుత్వంలో మాదిరి ప్రజలు భయపడే పరిస్థితులు లేవు. శాంతిభద్రతల పరిరక్షణకు అహర్నిశలు పోలీసులు కృషి చేస్తున్నారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తరచూ చెప్పిన మాటలివి!!
డోన్, న్యూస్టుడే: ఆర్థిక మంత్రి ఇలాకా డోన్ పట్టణంలో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు. యువకులు బృందాలుగా ఏర్పడి ప్రధాన ప్రాంతాల్లో తిరుగుతూ దాడులకు దిగుతున్నారు. గతంలో ఓ సీఐ గట్టిగా హెచ్చరించడంతో కొన్నిరోజుల పాటు గొడవలు జరగలేదు. ఇటీవల కాలంలో ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయి. డోన్ పట్టణంలో దాదాపు 80 వేలకు పైగా జనాభా ఉంటోంది. పట్టణ, గ్రామీణ పోలీస్స్టేషన్, డీఎస్పీ కార్యాలయాలు ఉన్నాయి. పట్టణ ఠాణా పరిధిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, నలుగురు ఏఎస్సైలు, ఎనిమిది మంది హెడ్ కానిస్టేబుళ్లు, 23 మంది కానిస్టేబుళ్లు, 18 మంది హోంగార్డులు ఉన్నారు. పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో మరో 50 మంది కానిస్టేబుళ్లను కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు.
ఇటీవల పట్టణంలో పలు ప్రాంతాల్లో వందలాది మంది యువకులు ఘర్షణకు దిగారు. టీఆర్నగర్లో పట్టపగలే ఘర్షణలకు పాల్పడటంతో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వారికి కొందరు నేతల అండదండలు ఉండటం వల్లే పోలీసులు కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారనే విమర్శలు రేగుతున్నాయి. నాలుగు రోజుల కిందట డోన్ పట్టణంలోని రాఘవేంద్రస్వామి గుడి వీధిలో కత్తులు, కర్రలతో యువకులు పరస్పరం దాడులకు దిగారు. రణరంగాన్ని చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో నలుగురిపై కేసులు నమోదు పోలీసులు మమ అనిపంచారు. గట్టి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికు మండిపడుతున్నారు.
ఇటీవల కొన్ని ఘటనలు
- చిగురుమానుపేటలో ఈనెల 16న ఓ వ్యక్తిపై అదేకాలనీకి చెందిన కొందరు మద్యంమత్తులో విచక్షణారహితంగా దాడికి పాల్పడంతో తీవ్ర గాయాలపాలయ్యారు.
- కొండపేట ప్రాంతంలో కొందరు యువకుల మధ్య జరిగిన గొడవలో రెండుబైక్లు ధ్వంసమయ్యాయి.
- పేరంటాళ్లమ్మ గుడి వద్ద ఈనెల 8న యువకుల మధ్య జరిగిన ఘర్షణలో బీరుసీˆసాతో దాడి చేయడంతో తీవ్రంగా యువకుడు గాయపడ్డారు.
- కేఈమాదన్ననగర్లో ఆటోనగర్కు చెందిన యువకుడిపై పాతకక్షలతో కొందరు దాడికి పాల్పడటంతో స్థానిక మహిళలు గట్టిగా కేకలు వేయటంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం
పట్టణంలో జరుగుతున్న ఘర్షణలపై యువతను స్టేషన్కు పిలిపించి మంత్రణం నిర్వహిస్తున్నాం. కొందరిపై కేసులు కూడా నమోదు చేస్తున్నాం. శాంతిభద్రతల పరిరక్షణకు గట్టిచర్యలు తీసుకుంటున్నాం. అల్లరిమూకల ఆట కట్టించేందుకు సిబ్బందితో గట్టి చర్యలు తీసుకుంటాం.
శ్రీనివాసరెడ్డి, డీఎస్పీ, డోన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కురువల ఆత్మీయ సమావేశం
[ 05-05-2024]
పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో కురువల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
ల్యాండ్.. సాండ్ మాఫియాను అరికడదాం: రాజ్నాథ్ సింగ్
[ 05-05-2024]
రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, వైన్ మాఫియాను తుది ముట్టిద్దామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 05-05-2024]
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా సీనియర్ నాయకుడు డి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. -
జగన్ ‘భూ’భక్ష చట్టం
[ 05-05-2024]
ఖాళీ భూమి కనిపిస్తే చాలు.. వైకాపా నాయకులు గద్దల్లా వాలిపోతున్నారు.. ఆక్రమణల జెండా పాతేస్తున్నారు.. ఐదేళ్ల వైకాపా హయాంలో రూ.కోట్ల విలువైన దేవాదాయ, ప్రభుత్వ, వక్ఫ్, అసైన్డ్, ప్రైవేటు భూములు పెద్దఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. -
మల్లన్న గడపన ‘కడప’ పెత్తనం
[ 05-05-2024]
భక్తుల కొంగుబంగారమైన శ్రీశైల మల్లికార్జునుడి క్షేత్రం చెంత ఐదేళ్లుగా అధికార పార్టీ రాజకీయం చేస్తోంది. జగన్ గద్దెనెక్కినప్పటి నుంచీ అక్రమాలు, ఆధిపత్య పోకడలు మిన్నంటాయి. భక్తుల సమస్యలు పట్టించుకోకుండా.. అధికార పార్టీ నేతలు, అధికారులు సొంత లాభాలు చూసుకున్నారు. -
కూటమి గెలుపే ధ్యేయంగా ముందుకు
[ 05-05-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమి గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ఆదోని పట్టణంలో ఆదివారం రోడ్షో, బహిరంగ సభల్లో పాల్గొంటారని.. -
7వ తేదీకల్లా ఓటరు చీటీల పంపిణీ
[ 05-05-2024]
ఫెసిలిటేషన్ సెంటర్లు, హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి పొరబాట్లు జరగకూడదని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు. ఆమె పలు అంశాలపై రిటర్నింగ్ అధికారులతో శనివారం టెలీ కాన్ఫరెన్సులో సమీక్షించారు. -
ప్రతి మహిళకు నెలకు రూ.1500
[ 05-05-2024]
తెదేపా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రతి మహిళకు రూ.1500 అందజేస్తామని ఎమ్మిగనూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని 33, 34వ వార్డుల్లో ప్రచారం చేశారు. -
జగన్ చట్టం.. లోపభూయిష్టం
[ 05-05-2024]
మద్దికెర మండలంలోని బురుజుల గ్రామంలో 1600 మంది రైతులు ఉండగా 5,500 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. బురుజుల రెవెన్యూ పరిధిలో పత్తికొండ మండలంలోని హోసూరుకు చెందిన రైతుల పొలాలున్నాయి. -
అహోబిలేశుని వసంతోత్సవం
[ 05-05-2024]
అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వేసవితాపం తీర్చేందుకు, వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండేందుకు స్వామిని అర్చకులు పూజించారు. -
రూ.5 కోట్ల.. కోట భూమిని కొట్టేశారు
[ 05-05-2024]
రాజులు పోయారు.. కోటలు మిగిలాయి.. వాటి చుట్టూ ఉన్న భూములపై అధికార పార్టీ నేతల కన్నుపడింది.. రూ.5 కోట్ల విలువైన భూమికి నకిలీ పట్టాలు పుట్టించి విక్రయిస్తున్నారు.. -
ప్రతి గ్రామానికి సాగునీరందిస్తాం
[ 05-05-2024]
సిద్ధాపురం చెరువు వద్ద ప్రత్యేక తూము ఏర్పాటుచేసి పక్కనున్న ఐదారు గ్రామాలకు సాగునీరందిస్తామని శ్రీశైలం నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. -
వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి
[ 05-05-2024]
తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రితో మాట్లాడి వైద్యుల సమస్యలు పరిష్కరిస్తామని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ హామీ ఇచ్చారు. -
అద్దె మాటలు.. వైద్యవిద్యకు అవస్థలు
[ 05-05-2024]
‘‘మా వల్లే నంద్యాలకు ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చింది. ఇందుకు సంబంధించిన పనులూ శరవేగంగా జరుగుతున్నాయంటూ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి గొప్పలు చెబుతున్నారు.. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా తిప్పలు పెడుతున్నారు. -
అక్రమాలు చేసినట్లు నిరూపించే దమ్ముందా బుగ్గనా
[ 05-05-2024]
మేం అక్రమాలు, అవినీతి చేసినట్లు నిరూపించే దమ్ముందా బుగ్గనా అని కేంద్ర మాజీ మంత్రి కోట్లసూర్యప్రకాశ్రెడ్డి ప్రశ్నించారు. శనివారం మండలంలోని ఓబులాపురం, చనుగొండ్ల, ఇందిరాంపల్లె, ఎర్రగుంట్ల, పెద్దమల్కాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.