ముగ్గురు సైబర్ నేరగాళ్ల అరెస్టు
సైబర్ నేరాలకు పాల్పడుతున్న కర్నూలు మండలం మునగాలపాడుకు చెందిన మాస్టిక్ నవీన్కుమార్, అతని సోదరుడు అరుణ్కుమార్, అదే గ్రామానికి చెందిన మహేశ్ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.
నిందితులను పట్టుకున్న సీఐడీ అధికారులు, కర్నూలు రెండో పట్టణ పోలీసులు
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే: సైబర్ నేరాలకు పాల్పడుతున్న కర్నూలు మండలం మునగాలపాడుకు చెందిన మాస్టిక్ నవీన్కుమార్, అతని సోదరుడు అరుణ్కుమార్, అదే గ్రామానికి చెందిన మహేశ్ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. నిందితులను కర్నూలు రెండో పట్టణ పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా సీఐడీ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. డిగ్రీ వరకు చదివిన నవీన్కుమార్ మెడికల్ రెప్గా పనిచేసేవాడు. దురాశతో సైబర్ నేరానికి తెరలేపాడు. బెంగళూరు కేంద్రంగా ఉన్న ఎస్ఏ ట్రేడింగ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా రమణ నాగ్పాల్ వ్యవహరిస్తున్నారని.. ఇందులో పెట్టుబడి పెడితే ప్రతి నెలా కొంత మొత్తం ఖాతాల్లో జమవుతుందని తెలిసినవారికంతా చెప్పి ప్రచారం చేస్తూ లింకులు పంపేవాడు. తన స్నేహితురాలైన మాధురి ద్వారా పరిచయమైన జంగం వీరలక్ష్మిని నమ్మించటంతో ఆమె పలు దఫాలుగా రూ.4.87 లక్షలు పెట్టుబడి పెట్టింది. తర్వాత సైటు ఓపెన్ కాకపోవటంతో ఆమె పలుమార్లు ప్రశ్నించగా ఏవేవో కారణాలు చెప్పి కాలం వెళ్లదీసేవాడు. ఇతని తమ్ముడు అరుణ్కుమార్, స్నేహితుడు మహేష్ సాయంతో ఆన్లైన్ ఇన్వెస్ట్మెంటుపై ప్రచారం చేయించి దాదాపు 40 మంది ద్వారా పెట్టుబడి పెట్టించి తన ఖాతాలో జమ చేయించుకుని చివరికి చేతులెత్తేశాడు. మోసపోయినట్లు గ్రహించిన జంగం వీరలక్ష్మి కర్నూలు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారులు కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీ అధికారులకు అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన అధికారులు ప్రధాన నిందితుడు నవీన్కుమార్గా గుర్తించారు. అతనికి సహకరించిన అరుణ్, మహేష్ను అరెస్టు చేసి కర్నూలు రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు. సీఐడీ డీఎస్పీ దైవప్రసాద్, సైబర్ క్రైమ్ అనాలసిస్ టాస్క్ఫోర్స్ టీమ్ సీఐ నవీన్బాబు, ఎస్సై బందెసాహెబ్, సిబ్బందిని సీఐడీ విభాగాధిపతి సంజయ్, ఎస్పీ హర్షవర్ధన్రాజు అభినందించారు. కచ్చితమైన సమాచారం లేని ఆన్లైన్ లింకు బిజినెస్లను నమ్మి మోసపోవద్దని, తొందరపడి లింకులు ఓపెన్ చేయొద్దని సీఐడీ అధికారులు సూచించారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు టోల్ఫ్రీ నంబరు 1930కుగానీ, స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ నేరాల బాధితుల కోసం సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఏపీ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ను ఏర్పాటు చేసి 75 మందిని నియమించారన్నారు.
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
దిద్దికాటి అర్జునుడు (పాతచిత్రం)
గోనెగండ్ల, న్యూస్టుడే: కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని వేముగోడు గ్రామానికి చెందిన రైతు దిద్దికాటి అర్జునుడు (43) అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడినట్లు గోనెగండ్ల సీఐ రామకృష్ణయ్య తెలిపారు. ఆయనకు 3.14 ఎకరాల పొలం ఉంది. భార్య పద్మావతితో కలిసి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె వివాహానికి రూ.3 లక్షల వరకు అప్పులు చేశారు. ఈ ఏడాది మొక్కజొన్న, పత్తి పంటలు సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులు, తెగుళ్ల బెడదతో పంటలు పూర్తిగా దెబ్బతినడంతో మరో రూ.2 లక్షలు అప్పులయ్యాయి. రెండేళ్లుగా పంటలు చేతికందకపోవడం, అప్పులవారి ఒత్తిడి తట్టుకోలేక బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ పేర్కొన్నారు. ఇంటి పెద్ద మృతితో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
విద్యుదాఘాతంతో ఒకరి మృతి
నాగరాజు (పాతచిత్రం)
కె.శింగవరం (సి.బెళగల్), న్యూస్టుడే: మండలంలోని కె.శింగవరం గ్రామానికి చెందిన నాగరాజు (48) మంగళవారం రాత్రి విద్యుదాఘాతంలో మృతి చెందారు. నాగరాజు కె.శింగవరం నుంచి పల్దొడ్డిలో ఓ రైతు పొలంలో మిరపకాయలు తెంపేందుకు బొలెరో వాహనంలో బయలుదేరారు. వాహనం టాప్పై కూర్చుని వెళ్తుండగా పైభాగంలోని విద్యుత్తు తీగలు మెడకు తగిలి విద్యుత్తు షాక్తో అక్కడికక్కడే మృతి చెందారు. నాగరాజుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీపీఎం మండల నాయకుడు కె.మోహన్ కె.శింగవరం గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
నా కుమార్తెను చంపేశారు
ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే : తన కుమార్తె మల్లేశ్వరిని అల్లుడు కె.చిన్నవీరన్న, అతని ముగ్గురు సోదరులు చంపేశారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పెద్దకడబూరు మండలం హెచ్.మురవనికి చెందిన కురువ భాస్కర్ విన్నవించారు. ఈ మేరకు ఆయన బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఎమ్మిగనూరు మండలం గువ్వలదొడ్డికి చెందిన చిన్నవీరన్నతో తన కుమార్తె పెళ్లి జరిగిందని, రూ.లక్ష నగదు, ఐదు తులాల బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చామని చెప్పారు. అల్లుడు రోజూ తాగివచ్చి తన కుమార్తెను హింసించేవాడని.. పలుమార్లు పంచాయితీ చేసినా మారలేదన్నారు. చివరికి తన కుమార్తెను చిన్నవీరన్న, అతని సోదరులు చంపేశారని, ఎమ్మిగనూరు పోలీసులు కేసు నమోదు చేసినా న్యాయం జరగలేదన్నారు. మల్లేశ్వరి పిల్లలను తమ వద్దే ఉంచుకుని చదివిస్తున్నామని, ఆస్తి వాటా ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో పిల్లలను చంపేయత్నం చేశారన్నారు. పిల్లలకు భద్రత కల్పించి న్యాయం చేయాలని కోరారు.
కారు, బొలెరో ఢీకొని విద్యార్థి దుర్మరణం
ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్టుడే: మండలంలోని బనవాసి ఫారం వద్ద జాతీయ రహదారిపై బుధవారం బొలెరో ట్రాలీ వాహనం, కారు ఢీకొన్న ప్రమాదంలో సందీప్ (16) అనే విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైనట్లు గ్రామీణ ఎస్సై శరత్కుమార్రెడ్డి తెలిపారు. ఆదోనికి చెందినవారు బొలెరో వాహనంలో పెళ్లి కుమారున్ని చూసేందుకు ఎమ్మిగనూరు వైపు వస్తుండగా మంత్రాలయం నుంచి బెంగళూరుకు వెళ్తున్న కారు ఢీకొంది. బొలెరోలోని సందీప్ ఎగిరి పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. బాలుడు 6వ తరగతి చదువుతున్నాడు. కేసు నమోదు చేసినట్లు గ్రామీణ ఎస్సై చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
[ 27-04-2024]
డోన్ మండలం వెంకటాపురం చెరువు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. -
ఓటు విలువ తెలియజెప్పండి.. బహుమతి గెలుచుకోండి
[ 27-04-2024]
ఓటరు మహాశయులకు విజ్ఞప్తి. మీరు మొదటిసారి ఓటు హక్కును వినియోగిస్తున్నారా.. అయితే, ఈ అవకాశం మీకోసమే. -
ఐదేళ్ల ‘దారి’ద్ర్యం
[ 27-04-2024]
జగన్ సర్కారు ‘రోడ్ల’ నిర్వహణను గుంతల్లో వదిలేసింది. గత జూన్ నుంచి డిసెంబరు వరకు కురిసిన వర్షాలతో రహదారులు ఛిద్రమయ్యాయి. మృత్యు‘గుంత’లు పలువురి ప్రాణాలు తీస్తున్నాయి.. -
సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన
[ 27-04-2024]
రాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్వామివారి బృందావనానికి నిర్మాల్యం, పంచామృతాభిషేకం నిర్వహించి అలంకరించారు. -
28, 29 తేదీల్లో చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఈనెల 28, 29 తేదీల్లో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారని కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్ తెలిపారు. -
అనుమానాలున్నా ఆమోదముద్ర
[ 27-04-2024]
అభ్యర్థుల నామపత్రాల పరిశీలనలో ‘అధికార’ పెత్తనం కొనసాగింది. అధికార పార్టీ నేతలకు చెందిన నామపత్రాలపై పలు అనుమానాలున్నా అధికారులు ఆమోదముద్ర వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఇంతులు ఎటో గెలుపు అటే
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య తేలింది. ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో పురుష ఓటర్లు 10,13,771, మహిళలు 10,40,435, ఇతరులు 318 కలిపి 20,54,524 మంది ఓటర్లు ఉన్నారు. -
అరాచక పాలన అంతమే లక్ష్యం
[ 27-04-2024]
జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో జనసేన ఉమ్మడి జిల్లా కన్వీనర్ చింతా సురేష్ బాబు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎంపీ డా.సంజీవ్కుమార్, కర్నూలు పార్లమెంట్ తెదేపా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్తో కలిసి ఎన్డీఏ ఛార్జిషీటును తిక్కారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. -
నామినేషన్ల పరిశీలన పూర్తి
[ 27-04-2024]
కర్నూలు జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి సంబంధించి 20 నామినేషన్లను ఆమోదించారు. -
నేతలకు కాసుల పంట.. రైతులకు కడుపు మంట
[ 27-04-2024]
‘‘వ్యవసాయ పంటల మార్కెటింగ్లో కీలకపాత్ర వహించే ఏఎంసీలు (వ్యవసాయ మార్కెట్ యార్డులు) జగన్ పాలనలో నిర్వీర్యమయ్యాయి. అన్నదాతలకు కనీస సేవలందించలేదు. తెదేపా హయాంలో కళకళలాడిన ఏఎంసీలు ప్రస్తుతం శాఖాపరమైన కార్యకలాపాలతో సరిపెట్టుకుంటున్నాయి. -
రక్షక భటులను దగా చేసిన జగన్
[ 27-04-2024]
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం. వారికి రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లిస్తాం. వారంతపు సెలవు అమలు చేస్తాం. వారికి అండగా ఉంటాం. -
ఇసుకాసురుల దారిదోపిడీ
[ 27-04-2024]
అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుకను తోడేస్తున్నారు. వందల మెట్రిక్ టన్నుల లోడుతో లారీలను తిప్పుతుండటంతో.. రహదారులు రూపుకోల్పోతున్నాయి. తారు చెదిరి.. వాహనదారులను బెదిరిస్తున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 27-04-2024]
జేఈఈ మెయిన్స్లో శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల ఏజీఎం మురళీకృష్ణ, డీన్లు సరళ, బాలాజీ శుక్రవారం తెలిపారు. -
ఓ ప్రజాప్రతినిధి.. ఇదీ దారుల దుస్థితి
[ 27-04-2024]
ఆ దారులు నరకానికి నకళ్లు.. ప్రయాణం సాగించాలంటే సాహసమే.. రాళ్ల దారిలో వెళ్లాలంటే ఒళ్లు హూనమే.. కిందపడితే రక్తధారలే.. తరుచూ ప్రమాదాలతో భయపెడుతున్నాయి. ఐదేళ్లు నిధుల మాటే లేదు. ప్రజాప్రతినిధులు భూమి పూజలతో సరిపెడుతున్నారే తప్ప.. పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. -
ఆలస్యమైతే.. బుగ్గిపాలే
[ 27-04-2024]
ఎండ తీవ్రత, గ్యాస్ లీకేజీలతో అగ్ని ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ప్రమాదాలు జరిగితే నంద్యాల జిల్లాలోని డోన్ నుంచి అగ్నిమాపక వాహనం రావాల్సిందే. -
జగనొచ్చారు.. పరిశోధన ప్రాణం తీశారు
[ 27-04-2024]
రాష్ట్రంలో వ్యవసాయ విధానాలు మార్చబోతున్నాం.. తన హయాంలోనే రైతులకు ఎనలేని మేలు జరుగుతున్నట్లు పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతులకు అత్యంత ఉపయుక్తమైన వ్యవసాయ పరిశోధనలపై ఉక్కుపాదం మోపారు. -
ఎత్తిపోతలను ఎండబెట్టిన కాటసాని
[ 27-04-2024]
జుర్రేరు వాగుపై 1959లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి హయాంలో దద్దణాల చెరువును నిర్మించారు. వర్షాకాలంలో ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి వరద వచ్చి చెరువులో చేరుతోంది. -
తెదేపాను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి
[ 27-04-2024]
తెదేపాను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని నంద్యాల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. మండలంలోని సాంబవరంలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు