logo

తెదేపాతోనే బీసీల అభివృద్ధి

తెదేపాతోనే బీసీల అభ్యున్నతి సాధ్యమని ఆ పార్టీ నేత గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. కల్లూరు మండల పరిధి కొంగనపాడు గ్రామంలో మంగళవారం

Published : 17 Apr 2024 02:55 IST

మాట్లాడుతున్న తెదేపా నేత గౌరు వెంకటరెడ్డి

కొంగనపాడు (కల్లూరు గ్రామీణ), న్యూస్‌టుడే: తెదేపాతోనే బీసీల అభ్యున్నతి సాధ్యమని ఆ పార్టీ నేత గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. కల్లూరు మండల పరిధి కొంగనపాడు గ్రామంలో మంగళవారం నిర్వహించిన ‘జయహో బీసీ’ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. వైకాపా ప్రభుత్వ హయాంలో బీసీలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, విద్య పరంగా అభివృద్ధి చెందాలంటే తెదేపా అధికారంలోకి రావాలన్నారు. మల్లికార్జున, రామాంజనేయులు, ఈవీ రమణ, వినోద్‌కుమార్‌, రంగస్వామిరెడ్డి, మాదేశ్‌, ధనుంజయ, మహేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు