logo

ఎమ్మెల్యే వస్తున్నారని.. ఉపాధి పనులు బంద్‌

ఆదోని మండలం అరేకల్‌లో బుధవారం ఉపాధి పనులు చేపట్టలేదు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని, ఉపాధి పనులు బంద్‌ చేసినట్లు గ్రామస్థులు తెలిపారు.

Published : 18 Apr 2024 03:27 IST

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ఆదోని మండలం అరేకల్‌లో బుధవారం ఉపాధి పనులు చేపట్టలేదు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని, ఉపాధి పనులు బంద్‌ చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి చెందిన ఉపాధి పథకం క్షేత్ర సహాయకుడు గోపాల్‌ ప్రచారంలో పాల్గొనడం గమనార్హం. విషయం బయటికి పొక్కడంతో.. కూలీలు పనులకు హాజరయ్యారని చూపించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ‘న్యూస్‌టుడే’ ఆదోని ఉపాధి ఏపీవో కాలిక్‌తో ప్రస్తావించగా.. శ్రీరామ నవమి పండగ ఉండటంతో చాలా మంది పనులకు హాజరు కాలేదన్నారు. ఉపాధి పనులకు వెళ్లకుండా తన కోసం వచ్చిన కూలీలకు ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి కృతజ్ఞతలు తెలపడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని