గద్వాలపై వరాల జల్లు
జిల్లాపై ముఖ్యమంత్రి కేసీˆఆర్ వరాల జల్లు కురిపించారు. గ్రామపంచాయతీలు, మండల కేంద్రాలు, పురపాలికల అభివృద్ధికి నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
స్థానిక సంస్థలకు భారీగా నిధుల కేటాయింపు
ముఖ్యమంత్రి కేసీఆర్ సుడిగాలి పర్యటన
ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
ఈనాడు, మహబూబ్నగర్ - గద్వాల, గద్వాల పురపాలకం, న్యూస్టుడే: జిల్లాపై ముఖ్యమంత్రి కేసీˆఆర్ వరాల జల్లు కురిపించారు. గ్రామపంచాయతీలు, మండల కేంద్రాలు, పురపాలికల అభివృద్ధికి నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు, 12 మండలాలు, నాలుగు పురపాలికలు ఉన్నాయన్నారు. మొదటిసారి గద్వాలకు వచ్చిన కాబట్టి ప్రతి గ్రామానికి ప్రత్యేకమైన గ్రాంటు రూ.10 లక్షలు, మండల కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ఒక్కో మండలానికి రూ.15 లక్షలు ప్రకటించారు. గద్వాల పురపాలికలకు రూ.50 కోట్లు, మిగతా పురాలకు ఒక్కోదానికి రూ.25 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, భారాస కార్యాలయాలను ముఖ్యమంత్రి కేసీˆఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ జిల్లా ప్రజలకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో మంత్రులిద్దరూ శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి తెలంగాణ ఉద్యమకారులేనని, వారు వేర్వేరు రూపాల్లో ఉద్యమాల్లో పాల్గొన్నారన్నారు. నిరంజన్రెడ్డి క్షేత్రస్థాయిలో, శ్రీనివాస్గౌడ్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఉంటూ ఉద్యోగాన్ని లెక్కచేయకుండా ఉద్యమం చేశారన్నారు. వీరిద్దరే కాకుండా డా లక్ష్మారెడ్డి, చాలా సీˆనియర్లు పాలమూరులో ఉద్యమకారులు ఉన్నారు. వీరందరూ ఉండటం వల్లే పాలమూరు ఐదు జిల్లాలుగా ఏర్పడిందన్నారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మీ అభివృద్ధి కోసం నా దగ్గరకు వచ్చి పంచాయితీ పెడతారన్నారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం వంద పడకల ఆస్పత్రికి ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు.
ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డికి పుష్పగుచ్ఛం ఇస్తున్న సీఎం కేసీఆర్
మొదటగా పార్టీ కార్యాలయం.. : జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించిన భారాస క్యాంపు కార్యాలయాన్ని సీఎం కేసీˆఆర్ ప్రారంభించారు. తొలుత పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి తర్వాత పార్టీ జెండాను ఎగరేశారు. మాజీ ఎమ్మెల్యే గట్టుభీముడు వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి సీˆఎం పూల మాలలు వేసి నివాళులర్పించారు. పూజల అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిని సీటులో కూర్చోబెట్టారు. అనంతరం కేసీˆఆర్ స్టడీ సర్కిల్ను పరిశీలించి నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. నిరుపేదల చదువులకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఈ స్టడీ సర్కిల్ను ఇలాగే కొనసాగించి నిరుద్యోగులకు బాసటగా నిలబెట్టాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు మహమూద్అలీ, శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎంపీˆ మన్నె శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, డా.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఎస్.రాజేందర్రెడ్డి, బి.హర్షవర్ధన్రెడ్డి, మర్రి జనార్ధన్రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్రెడ్డి, చల్లా వెంకట్రామిరెడ్డి, సాయిచంద్, జడ్పీ ఛైర్పర్సన్ సరిత, రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఛైర్మన్ గట్టు తిమ్మప్ప, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీఛైర్మన్ భాస్కర్ పాల్గొన్నారు.
* కేసీఆర్ బహిరంగ సభలో కేవలం 12 నిమిషాలు మాత్రమే మాట్లాడి వెళ్లడంతో పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. సీఎం ఎక్కడ బహిరంగ సభలో పాల్గొన్నా సుమారు 30 నిమిషాలకుపైగానే ప్రసంగించారు. అందుకు విరుద్ధంగా 12 నిమిషాల్లో సభ ముగించి వెళ్లడం, ప్రసంగంలోనూ పాత విషయాలే ఉండటంతో కార్యకర్తలు, నేతలు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. షెడ్యూల్ ప్రకారం హెలీకాప్టర్లో వచ్చి హైదరాబాద్కు రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉంది. చివరి నిమిషంలో హెలీకాప్టర్లోనే వెళ్లేలా షెడ్యూల్ను మార్చినట్లు సమాచారం. చీకటి అవుతుండటంతో ప్రసంగాన్ని కుదించి హైదరాబాద్కు వెళ్లిపోయారు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి నిమిషం కూడా మాట్లాడలేదు. తనను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలపడంతో కేసీˆఆర్ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినట్లు వెల్లడించారు.
ప్రగతి నివేదన సభకు హాజరైన జనం
* గద్వాలలోని పీజేపీ క్యాంపులో రూ.38.5 కోట్లతో నిర్మించిన ఎస్పీ నూతన కార్యాలయ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం ఎస్పీ సృజనను కుర్చీలో కూర్చోబెట్టి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
* అనంతరం కేసీఆర్ ఐడీవోసీ కార్యాలయానికి చేరుకుని నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కలెక్టర్ క్రాంతిని కుర్చీలో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. అనంతరం సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఐడీవోసీˆ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న రోడ్లు, భవనాల శాఖ అధికారులు, సిబ్బందిని కేసీˆఆర్ సన్మానించారు. అనంతరం జిల్లా అధికారులతో కలిసి గ్రూపు ఫొటో దిగారు. అనంతరం బహిరంగ సభకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి వారితో మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రచండ ఎండ!
[ 29-04-2024]
పాలమూరులో భానుడు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఏప్రిల్లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చెరువులు, నదులు, వాగులు, బావులు, చెక్డ్యాంలు, నీటికుంటలు ఎండిపోతున్నాయి. -
వలస ఓటర్లపై ఆశలు!
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని వలస ఓటర్లపై ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టి పెట్టారు. ముంబయి, పుణె, భీమండిలో ఈ ప్రాంతానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాది మంది ఉపాధి కోసం హైదరాబాద్లో స్థిరపడ్డారు. -
వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం
[ 29-04-2024]
వచ్చే వానాకాలంలో పంటల సాగుకు అనుకూల పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలపటంతో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువుల నిల్వలపై ముందస్తు అంచనాలు తయారు చేశారు. -
దుందుభి.. దుఃఖిస్తోంది!
[ 29-04-2024]
దుందుభి వాగులో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. రాత్రిళ్లు ఇసుక మాఫియా వాగును ఖాళీ చేస్తుండటంతో మండలంలోని కొత్తూర్, వెలుగొముల, రెడ్డిగూడ, చిల్వేరు, అయ్యవారిపల్లి, కొత్తపల్లి, వాడ్యాల గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి సంస్కృత శిక్షణ శిబిరం
[ 29-04-2024]
మహబూబ్నగర్ - జడ్చర్ల రోడ్డులోని మయూరి పార్కు సమీప కేశవరెడ్డి ఉన్నత పాఠశాలలో సోమవారం నుంచి మే 5 వరకు రాష్ట్రస్థాయి సంస్కృత శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు సంస్కృత భారతి, రామకృష్ణ సేవా సమితి ప్రతినిధులు యాదయ్య, వెంకట్రెడ్డి, రాజ్మల్లేశ్ వెల్లడించారు. -
ఈవీఎంల వయసు 35 ఏళ్లు
[ 29-04-2024]
ప్రస్తుతం ఎన్నికల్లో పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలను వినియోగిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈవీఎంలను తొలిసారి ఎప్పుడు వినియోగించారు? దాని పుట్టు పూర్వోత్తరాలను ఒకసారి పరిశీలిద్దాం. -
ఐదేళ్లకు ఓ పూట
[ 29-04-2024]
సినిమా అంటే క్యూలో నిలుచొని టిక్కెట్లు తీసుకుని మూడుగంటలు వెచ్చిస్తారు... స్నేహితులతో ముచ్చట్లు చెప్పడానికి ఎంతో సమయం తీసుకుంటారు... సామాజిక మాధ్యమాల్లో విహరించడానికి మరెంతో టైం ఖర్చవుతుంది... -
భారాస, భాజపా మాటలు నమ్మొద్దు : మంత్రి జూపల్లి
[ 29-04-2024]
భారాస, భాజపా నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన మండలంలోని పలు గ్రామాల్లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. -
దోచుకున్న సొమ్ముతో దుబాయ్లో పెట్టుబడులు : వంశీచంద్రెడ్డి
[ 29-04-2024]
కేసీఆర్ కుటుంబం తెలంగాణలో పదేళ్ల పాటు దోచుకున్న సొమ్మంతా దుబాయ్లోని మాల్స్లో పెట్టుబడులు పెట్టిందని, అక్కడ అకాల వర్షాలతో మాల్స్ కొట్టుకుపోతే వారిలో అలజడి మొదలైందని మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి ఆరోపించారు. -
ముగిసిన శిర్సనగండ్ల రాములోరి బ్రహ్మోత్సవాలు
[ 29-04-2024]
రెండో భద్రాదిగా పేరొందిన చారకొండ మండలం శిర్సనగండ్ల శ్రీసీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా ముగిసాయి. -
అలంపూర్ బేనీషా.. ప్రియం
[ 29-04-2024]
ప్రఖ్యాతి గాంచిన అలంపూర్ బేనీషా ఈ ఏడాది దొరకడం గగనమే. అత్యంత రుచికరమైన ఈ పండుకు మంచి గిరాకీ ఉంటుంది. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించక తోటల్లో సగానికన్నా తక్కువ కాత కన్పిస్తోంది. -
ఎలుకా కొరకకే!
[ 29-04-2024]
నారాయణపేటలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో రోగులకు ఎలుకలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన చిన్న పిల్లలు, కుటుంబికులు ఆందోళన చెందుతున్నారు. -
అందని ద్రాక్షగా.. టీ ఫైబర్ సేవలు
[ 29-04-2024]
గ్రామాలకు డిజిటల్ సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన టీ ఫైబర్ సేవల పథకం పడకేసింది. రెండేళ్లుగా అమలును విస్మరించడంతో గ్రామీణులకు డిజిటల్ సేవలు అందనిద్రాక్షగా మారాయి.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!