కరకట్ట ఎత్తు పెంపు కలేనా?
రెండు రాష్ట్రాల సరిహద్దుగా సుంకేసుల జలాశయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఎక్కడ చూసినా ప్రమాదకర ప్రదేశాలు, రహదారులు అధ్వానంగా ఉన్నాయి.
రెండు మీటర్లు తక్కువ ఎత్తులో ఉన్న కరకట్ట
గద్వాల న్యూటౌన్, న్యూస్టుడే: రెండు రాష్ట్రాల సరిహద్దుగా సుంకేసుల జలాశయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఎక్కడ చూసినా ప్రమాదకర ప్రదేశాలు, రహదారులు అధ్వానంగా ఉన్నాయి. రాజోలి గ్రామానికి ఆనుకొని ఉన్న జలాశయం కరకట్ట 2009లో వచ్చిన వరదల కారణంగా పూర్తిగా తెగిపోయింది. ఆ కట్ట తెగిపోవడంతో అప్పట్లో నీరంతా గ్రామాన్ని ముంచెత్తి, ప్రజలందరినీ రోడ్డున పడేసింది. ప్రభుత్వం అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన కరకట్ట నిర్మించింది. అయితే.. జలాశయం గేట్లను పెంచాలనే ఉద్దేశంతో రెండున్నర మీటర్ల తక్కువ ఎత్తులోనే కరకట్ట నిర్మించారు. ఆ సమయంలో ప్రజలు దీనిని వ్యతిరేకించినా ప్రజాప్రతినిధులు హామీలు గుప్పించి పనులు కానిచ్చారు. తిరిగి ఇప్పటి వరకు కరకట్ట నిర్మాణంపై దృష్టి సారించడం లేదు.
రహదారులు అధ్వానం..: నిత్యం వాహనాల రాకపోకలు.. తరచూ పర్యాటకుల సందడి ఉండే సుంకేసుల జలాశయం రహదారులు అధ్వానంగా ఉన్నాయి.. పర్యాటకులు ప్రమాదకరంగా డ్యాం వీక్షించాల్సిన దుస్థితి. కిలోమీటరున్నర ఉన్న కరకట్టపై ప్రయాణం చేయాలంటే దుమ్ము, గుంతలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు రక్షణ దిమ్మెలు లేక ప్రమాదకరంగా ఉంది. ఇక దిగువ కరకట్ట కోతకు గురై ప్రమాదకరంగా మారింది. వీటితో పాటు, డ్యాం సర్కిల్ వద్ద ముళ్లపొదలు పెరిగి ఆహ్లాదం కరవైంది. వచ్చిన పర్యాటకులు కూర్చోవడానికి కనీసం స్థలం కరవైంది. డ్యాం ఎగువ, దిగువ ప్రాంతాల్లో వీక్షించేందుకు ఎలాంటి రక్షణ కడ్డీలు లేవు. డ్యాం రహదారిలోనే పాదచారులు నడిచే చోట రక్షణ దిమ్మెలేదు. దానికి సన్నటి తీగతో రక్షణ ఏర్పాటు చేశారు. ఇది ప్రమాదకరంగా ఉంది. సందర్శకులు నది లోతులకు వెళ్లి స్నానాలు చేస్తుంటారు. లోతును గమనించక ఎంతో మంది యువకులు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలున్నాయి. అయినా అలాంటి ప్రదేశాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేయలేదు. డ్యాం అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు గతంలోనే పంపామని జేఈ రాజు అంటున్నారు.
డ్యాం రహదారిలో ఏపుగా పెరిగిన ముళ్లపొదలు
15 ఏళ్లుగా..: ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారుతున్నా.. కరకట్ట ఎత్తు పెంపును పట్టించుకోవడం లేదు. దీంతో జలాశయం నిండు కుండలా ఉన్నప్పుడు, ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వచ్చినప్పుడల్లా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం నదిలో నీరు లేకపోవడంతో పనులు చేపట్టేందుకు అనువైన సమయమని, ఈ దిశగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సార్వత్రికం... తీర్పు ప్రత్యేకం
[ 30-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో శాసనసభకు, పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో ఓటర్ల తీర్పు విభిన్నంగా ఉంటోంది. -
ప్రశ్నార్థకం.. జలాశయాల నిర్మాణం
[ 30-04-2024]
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం నిర్మాణం 2007లో పునాది పడింది. 2012లో 50 శాతం పూర్తయి నీటి తోడిపోత మొదలై సాగునీరందింది. -
పాలమూరు పోరు @50
[ 30-04-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల లెక్క తేలింది. -
దృష్టి మరల్చేందుకే రిజర్వేషన్లపై దుష్ప్రచారం : అరుణ
[ 30-04-2024]
బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని భాజపాపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆరోపించారు. -
వనిత..కలత!
[ 30-04-2024]
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక ఓటర్లు అతివలే. పురుష ఓటర్ల కంటే వారు 1,13,920 మంది ఎక్కువగా ఉన్నారు. -
ఏ సభలో ఎంత మంది సభ్యులు?
[ 30-04-2024]
భారత పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయి. దిగువ సభను లోక్సభ అంటారు. దీనినే ప్రజా ప్రతినిధుల సభ అని కూడా పిలుస్తారు. ఈ సభలో మొత్తం 552 మంది సభ్యులు ఉంటారు. -
కాంగ్రెస్వి మోసపూరిత హామీలు: భారాస
[ 30-04-2024]
రాష్ట్రంలో పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్దానికి జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో పేదల సంక్షేమానికి పాటుపడిన కేసీఆర్ నాయకత్వంలోని భారాసను గెలిపించాలని పార్టీ నాగర్కర్నూల్ లోకసభ స్థానం అభ్యర్థి ప్రవీణ్కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
దశాబ్దాల కల నెరవేరదేమి?
[ 30-04-2024]
ఉమ్మడి జిల్లాలో కేంద్ర విద్యాలయాల ఏర్పాటుపై కొన్నేళ్లుగా వివక్ష కొనసాగుతోంది. కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయం, సైనిక స్కూళ్లకు మంచి డిమాండ్ ఉంది. -
మైలారం గుట్టపై తవ్వకాలకు ససేమిరా
[ 30-04-2024]
రాళ్లతో వ్యాపారం చేస్తూ రూ.కోట్లు గడిస్తున్న మైనింగ్ మాఫియా మైలారం గుట్టపై తవ్వకాలకు సిద్ధమైంది. గుట్టపై కన్నేసిన వ్యాపారులు 2017లోనే మైనింగ్, పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు 20 ఏళ్ల వరకు అనుమతులు జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
గెలుపు ఖాయం.. భారీ మెజార్టీయే లక్ష్యం
[ 30-04-2024]
సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా కావటంతో ఇక్కడి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి కృషిచేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సూచించారు. -
రక్తనిధి కేంద్రంలో... తగ్గుతున్న నిల్వలు
[ 30-04-2024]
పట్టణంలోని జనరల్ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో రోజు రోజుకు రక్తపు నిల్వలు తగ్గుతున్నాయి. అత్యవసర పరిస్థితిలో రోగులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పేదోళ్లు ఇంటర్ చదవద్దా?
[ 30-04-2024]
ఉమ్మడి పాలమూరులో వెనకబడిన జిల్లా నారాయణపేట. కార్మికులు, వలస కూలీల జిల్లాగా పేరుంది. -
ఇండియా కూటమిని గెలిపిద్దాం : మంత్రి జూపల్లి
[ 30-04-2024]
ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపిద్దామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. -
నాడు మామ.. నేడు అల్లుడు
[ 30-04-2024]
మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఆడబిడ్డ పోటీ చేస్తుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని, ఓడించేందుకు నాడు మామ, నేడు అల్లుడు కుట్ర చేస్తున్నారని భాజపా లోక్సభ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
ఇథనాల్ పాపం భాజపా, భారాసలదే
[ 30-04-2024]
కేంద్రం, రాష్ట్రంలోని భాజపా, భారాస ప్రభుత్వాల అనుమతులతోనే మరికల్ మండలం చిత్తనూరు శివారులో అప్పట్లో ఇథనాల్ కంపెనీ ఏర్పాటైందని మహబూబ్నగర్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. -
రూ. 50 కోసం దుకాణాలకు నిప్పు
[ 30-04-2024]
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ పక్కన ఉన్న వీధి వ్యాపారుల షెడ్డులో డబ్బా దుకాణాలు దహనం చేసిన నిందితుడిని గుర్తించి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై గోవర్దన్ సోమవారం తెలిపారు. -
కస్తూర్బా విద్యాలయం సిబ్బందిపై వేటు
[ 30-04-2024]
కేజీబీవీలో నలుగురు సిబ్బందిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో ఇందిర ఉత్తర్వ్యులు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా