తెలంగాణను భారాస లూటీ చేసింది: మంత్రి
తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు మిగులు బడ్జెట్తో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. భారాస లూటీ చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు.
గద్వాల పాతబస్టాండ్ వద్ద మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, చిత్రంలో మల్లు రవి, సంపత్కుమార్, సరిత, బీఎస్ కేశవ్
గద్వాల కలెక్టరేట్, న్యూస్టుడే: తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు మిగులు బడ్జెట్తో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. భారాస లూటీ చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. బుధవారం రాత్రి గద్వాల పాత బస్టాండ్లో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ సరిత అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. నాగర్ కర్నూల్ లోకసభ అభ్యర్థిగా భారాస నుంచి పోటీ చేయనున్న ప్రవీణ్కుమార్, గతంలో దళితులకు, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేశారని తిట్టి, కాడి వదిలివేసి కారు ఎక్కారని విమర్శించారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపా, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి భారాస ఎందులోనూ కాంగ్రెస్ పార్టీకి పోటీ పడలేదన్నారు.
పెండింగ్ పనులన్నీ పూర్తి చేయిస్తా
గట్టు, ధరూరు, కేటీదొడ్డి, న్యూస్టుడే: జిల్లాలో దశాబ్దకాలంగా అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులన్నీ పూర్తిచేయిస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గట్టులో బుధవారం లోక్సభ కాంగ్రెస్పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సరిత స్వల్ప మెజార్టీతో ఓటమి పాలవటం విచారకరమని, ఈ లోక్సభ ఎన్నికల్లో ఆ లోటును పూడ్చి అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలని కోరారు. రెండుసార్లు పార్లమెంటు సభ్యునిగా ఉన్నందున నియోజకవర్గ పరిస్థితులన్నీ తెలుసని, ఈ సారి ఎన్నికల్లో ఆదరిస్తే అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని పార్టీ అభ్యర్థి మల్లు రవి తెలిపారు.
- సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఐదు గ్యారెంటీలను అమలు చేయాలంటే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలని ఎంపీ అభ్యర్థి మల్లు రవి అన్నారు. ధరూరు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రి జూపల్లితో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేర్చుకుంటూ వస్తోందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.
- పార్లమెంటు ఎన్నికలు అయిపోగానే గద్వాల నియోజక వర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. మల్లురవితో కలిసి కేటీదొడ్డిలో ప్రచార సభలో మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రిజర్వేషన్లు 50 శాతానికి పెంచి బోయలకు ఏస్టీ జాబితాలో చేరుస్తామన్నారు. జడ్పీ ఛైర్పర్సన్ సరిత, ఎఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, నాయకులు గట్టు తిమ్మప్ప, మధుసూదన్ బాబు, గోవర్ధన్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదిలో బాలికలదే పైచేయి
[ 01-05-2024]
జిల్లాలోని పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్, వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో కలిపి మొత్తం 10,507 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 9,621 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పది ఫలితాల్లో మెరిసిన బాలికలు
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో బాలికలు మెరిశారు. 89.93 శాతం ఉత్తీర్ణులై బాలురు (84.02 శాతం) కంటే పైచేయి సాధించారు. -
శుద్ధి చేశాకే.. మిషన్ భగీరథ నీటి సరఫరా
[ 01-05-2024]
ప్రైవేటు ప్లాంట్ల కంటే మిషన్ భగీరథ నీరు స్వచ్ఛమైనవని ఈఈ మేఘారెడ్డి అన్నారు. మంగళవారం ‘ఈనాడు’లో ‘నాలుగు రోజులుగా తాగునీటికి పాట్లు’ అనే శీర్షికన ప్రచురితమైన చిత్ర కథనానికి అధికారులు స్పందించారు -
శెభాష్.. పేట
[ 01-05-2024]
పదోతరగతి పరీక్షా ఫలితాల్లో నారాయణపేట జిల్లా ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి జిల్లాలో మొదటి సారిగా ఫలితాల్లో తొలిస్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో పది జీపీఏలు వచ్చాయి. -
సత్తా చాటిన ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు
[ 01-05-2024]
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రెయిబో పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని యాజమాన్యం తెలిపింది. -
కొలిక్కి వచ్చిన వివాహిత హత్య కేసు
[ 01-05-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు జుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఎస్పీ యోగేశ్గౌతం వివరాలను మంగళవారం విలేకరులకు తెలియజేశారు.. -
అమ్మాయిలదే పైచేయి!
[ 01-05-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం విడుదల కాగా జిల్లాలో అమ్మాయిలే పైచేయి సాధించారు. మొత్తం 12,673 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 11,338 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 6,416కి గాను 5,604 మంది (87.34 శాతం), బాలికలు 6,257కు గాను 5,734 మంది (91.64శాతం) ఉత్తీర్ణత సాధించారు. -
పది ఫలితాల్లో బాలికలదే పైచేయి
[ 01-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లా 81.38 శాతంతో ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 32వ (చివరి నుంచి రెండో) స్థానంలో నిలిచింది -
‘5న జాతీయ నాయకులతో కాంగ్రెస్ సభ’
[ 01-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా మే 5వ తేదీన జాతీయ నాయకులైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలలో ఒకరితో, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ఎర్రవల్లిలో బహిరంగ సభ నిర్వహించతలపెట్టినట్లు ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ శాసన సభ్యులు సంపత్కుమార్ తెలిపారు -
ఎన్నికల నిబంధనలు పాటించాల్సిందే..
[ 01-05-2024]
లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు రుచేశ్ జైవన్షి, ఎన్నికల వ్యయ పరిశీలకులు సౌరభ్ సూచించారు -
అసత్య ప్రచారాలు తగవు: కాంగ్రెస్
[ 01-05-2024]
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అమలు చేస్తోందని, దీనికి తోడు మరో ఐదు గార్యంటీలను అమలు చేసేందుకు సిద్ధపడుతున్న తరుణంలో ప్రతిపక్షాలు తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి ఆరోపించారు -
కార్మికుల దినోత్సవానికి ముస్తాబు
[ 01-05-2024]
మే డే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ కార్మికులు తమ యూనియన్ దిమ్మెలకు రంగులు వేస్తూ ముస్తాబు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. కస్టడీలోకి కొలంబియా వర్సిటీ నిరసనకారులు
-
12 స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం
-
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లంటూ తాయిలం
-
తగ్గిన వంటగ్యాస్ వాణిజ్య సిలిండర్ ధర
-
వసూల్ రాజాలు.. ఎన్నికలొచ్చాయని వెనక్కి తగ్గారు!
-
సంచలనానికి 50 ఏళ్లు.. ‘అల్లూరి సీతారామరాజు’ తెర వెనక ఎన్ని విశేషాలో..!