logo

లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో జిల్లా న్యాయమూర్తి ప్రత్యేక పూజలు

గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయాన్ని బుధవారం జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.

Published : 18 Apr 2024 04:14 IST

జిల్లా న్యాయమూర్తిని సన్మానించిన ఆలయ కమిటీ సభ్యులు

జడ్చర్ల పట్టణం, న్యూస్‌టుడే : గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయాన్ని బుధవారం జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చరిత్ర గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు జిల్లా న్యాయమూర్తికి ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. అనంతరం కోడుగల్‌ పంచాయతీలోని నచికేతనంద తపోవన ఆశ్రమాన్ని సందర్శించారు. శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్రమంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకొని తమ వంతు విరాళంగా కొంత నగదు ఆశ్రమానికి అందజేశారు. జడ్చర్ల కోర్టు న్యాయమూర్తులు లక్ష్మి, ముదాసీర్‌, ఆలయ కమిటీ సభ్యులు జనార్ధన్‌రెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జంగయ్య, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు విశ్వేశ్వర్‌, రాములు, శ్రీశైలం, కోర్టు పర్యవేక్షకుడు శివకుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని