logo

ఉపాధి పోయిందని ఉసురు తీసుకుని..

ఉపాధి పోయిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Published : 27 Nov 2022 01:47 IST

రైలు కిందపడి ఆటో మెకానిక్‌ ఆత్మహత్య

షాద్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: ఉపాధి పోయిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. షాద్‌నగర్‌ పట్టణ శివారులో ఏబీ విల్లాస్‌ సమీపంలో రైలుపట్టాలపై తల, మొండెం వేర్వేరుగా పడి ఉన్న ఓ మృతదేహాన్ని శనివారం పోలీసులు గుర్తించారు. అతని జేబులో దొరికిన కార్డులో ఉన్న వివరాల ఆధారంగా వికారాబాద్‌ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండలం రాంపూర్‌కు చెందిన చెక్కల శ్రీనివాస్‌(26)గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాస్‌ హైదరాబాద్‌లోని ఓ ఆటో గ్యారేజీలో పనిచేసేవాడు. కొద్దిరోజుల క్రితం అతడు నడుపుతున్న ఆటో ప్రమాదానికి గురికావడం, బాధితుడు కేసు పెట్టడంతో యజమాని పనిలోంచి తీసేశాడు. దీంతో స్వగ్రామానికి వెళ్లిపోయాడు. తన భవిష్యత్తుపై తీవ్ర మనస్తాపానికి గురయ్యేవాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్సై సయ్యద్‌ అక్బర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని