పదోన్నతులు లేక నిరాశ
భాషా పండితులు అనేక సంవత్సరాలుగా ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్నారు. 8 సంవత్సరాల తరువాత ప్రభుత్వం ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ చేడుతుండటంతో వారికీ పదోన్నతి వస్తుందని భావించారు.
భాషా పండితుల నిరసన పథం
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపలిటీ
సంగారెడ్డిలో నినాదాలు చేస్తూ..
భాషా పండితులు అనేక సంవత్సరాలుగా ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్నారు. 8 సంవత్సరాల తరువాత ప్రభుత్వం ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ చేడుతుండటంతో వారికీ పదోన్నతి వస్తుందని భావించారు. అవకాశం ఇవ్వకపోవడంతో నిరాశ చెందుతున్నారు. గతంలో భాషా పండితులను అప్గ్రేడ్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా అమలు చేయలేదు. ప్రస్తుతమూ ఆ ప్రక్రియ చేపట్టకపోవడంతో భాషా పండితులు నిరసన తెలుపుతున్న తీరుపై కథనం.
462 మంది ఎదురుచూపు
జిల్లాలో 462 మంది భాషోపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరు ఎస్జీటీలుగా బోధన చేస్తున్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు మాత్రమే బోధించాలి. స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ పోస్టులు ఖాళీగా ఉండడంతో 9, 10 తరగతులకూ.. వీరితో బోధన చేయిస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా పాఠశాలలో సేవలందిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా పదోన్నతి రాకపోవడంతో నష్టపోతున్నారు. 2017లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలప్పుడు.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పదోన్నతులపై హామీ ఇచ్చినా.. ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. వీరితో పాటే విధుల్లో చేరిన ఇతర ఎస్జీటీలు ఇప్పటికే రెండు సార్లు పదోన్నతి పొందినా..భాషోపాధ్యాయులను పట్టించుకోలేదు. 20-25 సంవత్సరాలుగా ఒక్క సారైనా పదోన్నతి పొందకుండా అదే కేడర్లో కొనసాగుతున్నారు. పీఈటీలదీ ఇదే పరిస్థితి. వారిని అప్గ్రేడ్ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాలేదు. వీరు ఉన్నత పాఠశాలల్లో పీడీలతో సమానంగా విద్యార్థులకు సేవలందిస్తున్నారు. జిల్లాలో పీఈటీలు 122 మంది పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు.
9,10 తరగతులకు సహాయ నిరాకరణ: పదోన్నతులు కల్పించాలని కోరుతూ భాషా పండితులు నిరసన పథాన్ని ఎంచుకున్నారు. ఐకాసను ఏర్పాటు చేసుకొని.. నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి నిబంధనల ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు మాత్రమే బోధిస్తున్నారు. 9, 10 తరగతులకు బోధన చేయకుండా.. సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాధికారికి విన్నవించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
న్యాయం చేసే వరకు ఆందోళనలు
- చంద్రమోహన్, భాషా పండితుల ఐకాస ప్రతినిధి
భాషా పండితులు 20 సంవత్సరాలుగా పని చేస్తున్నా.. ఒక్కసారైనా పదోన్నతి కల్పించలేదు. అందరికీ అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వం తమను విస్మరించడం అన్యాయం. ఎస్జీటీ కేడర్లో నియమితులైనా.. స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా ఉన్నత పాఠశాలల్లో బోధన చేస్తున్నాం. న్యాయం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడు రంగులు ఎగరాలి.. మెతుకు సీమ మురవాలి
[ 10-05-2024]
ముష్కరుల చేతిలో ఇందిరాగాంధీ తూటాలకు బలైనప్పుడు దేశానికి ప్రధానిగా, మెదక్కు ఎంపీగా ఉన్నారని, చివరి శ్వాస, ఆఖరి రక్తపుబొట్టు చిందేవరకు ఈ ప్రాంతానికి ఆమె ప్రాతినిధ]్యం వహించారని.. మెదక్ ఎంపీగా కొనసాగుతుండగానే ఆమె కన్ను మూశారని సీఎం రేవంత్రెడ్డి గుర్తుచేశారు. -
343 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
[ 10-05-2024]
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. -
ఓటెందుకు వేయాలంటే..
[ 10-05-2024]
ఎంత ఎక్కువ పోలింగ్ నమోదైతే అంత చక్కటి తీర్పు వస్తుందన్నది నిపుణుల మాట. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలో గణనీయంగా పోలింగ్ నమోదవుతున్నా.. -
భారాస అభ్యర్థికి మద్దతిస్తూ తీర్మానం
[ 10-05-2024]
చిన్నకోడూరు మండలంలోని విఠలాపూర్ యాదవ సంఘం సభ్యులు మెదక్ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ఓట్లు వేస్తామని గురువారం ఏకగ్రీవ తీర్మానం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. -
ప్రతిష్ఠాత్మకం.. సార్వత్రికం
[ 10-05-2024]
పార్టీ అభ్యర్థి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూనే సొంత నియోజకవర్గంలో మెజార్టీ సాధించడం జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. -
స్థానిక నాయకా.. బాధ్యత నీదిక!
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలు ఏడు అసెంబ్లీ నియోజవర్గాలకు విస్తరించి ఉండటంతో సమయాభావంతో అభ్యర్థులు, స్టార్ ప్రచారకర్తలు అన్నిచోట్లా రోడ్డుషోలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారాలు చేపట్టలేరు. -
వేగులు.. నేతలకు గుబులు
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గరపడింది. ఈ నెల 13న పోలింగ్ నిర్వహించనున్నారు. -
రూ.లక్ష వేతనం.. వైద్యసేవలు ఉచితం
[ 10-05-2024]
ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్రం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. -
ఓటు పవిత్రమైనది
[ 10-05-2024]
ఓటు పవిత్రమైనది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇది మన బాధ్యతగా గుర్తించాలి. -
నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు కేసీఆర్
[ 10-05-2024]
‘శత చండీ హోమం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో కాంగ్రెస్, భాజపా ముఖ్యమంత్రులు ఎవరూ ఈ హోమం చేయలేదు. -
మోదీతో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉండవు
[ 10-05-2024]
కేంద్రంలో నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని అయితే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉండవని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. -
12 వేల కోట్లతో అభివృద్ధి చేశా: బండి సంజయ్
[ 10-05-2024]
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి మోసం చేసిందని, వీటి అమలుకు ప్రశ్నించేది, కోట్లాడేది తానేనని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
గురుశిష్యుల ప్రయాణమే.. బ్రహ్మచారి
[ 10-05-2024]
ముప్పై ఏళ్ల గురుశిష్యుల కలల ప్రయాణంతో పురుడుపోసుకుంది బ్రహ్మచారి చిత్రం. -
మద్యం తాగొద్దన్నందుకు తండ్రిని హతమార్చిన తనయుడు
[ 10-05-2024]
మద్యం తాగి కుటుంబ సభ్యులను హింసిస్తున్నావని, పద్ధతి మార్చుకోవాలని సూచించిన తండ్రిని, తనయుడు కత్తితో పొడిచి చంపిన ఘటన సిద్దిపేట జిల్లాలో దౌల్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 10-05-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నిందితుణ్ని కుకునూరుపల్లి పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
-
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం
-
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!