ఎక్కడి నుంచో తెచ్చి.. ఇక్కడ వదిలేసి
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్నకోతులు, శునకాలను పట్టుకుని నర్సాపూర్ అడవులకు తరలిస్తున్నారు. వాటికి ఆహారం లభించక పట్టణంలోకి మందలుగా ప్రవేశించి దాడులు చేస్తున్నాయి.
అడవిలో పెరిగిన కోతులు శునకాల సంఖ్య
నర్సాపూర్లో ఓ ఇంటి వద్ద మర్కటాలు
న్యూస్టుడే, నర్సాపూర్: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్నకోతులు, శునకాలను పట్టుకుని నర్సాపూర్ అడవులకు తరలిస్తున్నారు. వాటికి ఆహారం లభించక పట్టణంలోకి మందలుగా ప్రవేశించి దాడులు చేస్తున్నాయి. మరోవైపు గ్రామ సింహాలు వీధుల్లో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దాడులకు దిగడంతో పాటు, పట్టణ వాసులకు రాత్రిపూట కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల ఎక్కడి నుంచో కొందరు వాహనంలో శునకాలను అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లారు. అవి ఆహారం కోసం ప్రధాన రహదారుల్లో వెళుతూ ప్రమాదాల బారిన పడ్డాయి. నర్సాపూర్ నుంచి గుమ్మడిదల వరకు పది వరకు మృతి చెందాయి.
ఇళ్లలోకి ప్రవేశించి
ఎంతోమంది కోతుల చేతికి చిక్కి గాయాలపాలయ్యారు. కొందరు వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలున్నాయి. ఇక ఇళ్లలోకి ప్రవేశించి సామగ్రిని చిందర వందర చేస్తున్నాయి. నల్లాల పైపులు ధ్వంసం చేస్తున్నాయి. మందలుగా ఉన్న సమయంలో ఎవరైనా వాటిని తరిమే ప్రయత్నం చేస్తే, ఒక్కసారిగా పైన పడి గాయపరుస్తున్నాయి.
రోజూ 20 మందికిపైగా..
నర్సాపూర్ ప్రాంతీయ ఆసుపత్రికి రోజూ 20మందికి పైగా కుక్కలు, కోతుల బారిన పడివారు వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమైపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసుపత్రిలో ఏఆర్వీ ఇంజక్షన్ల వినియోగం అధికంగా ఉండటమే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటికైనా అటవీ, పురపాలిక అధికారులు సమన్వయంతో వ్యవహరించి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇలా చేస్తే మేలు..
* నర్సాపూర్లో ఎనిమల్ బర్త్ సెంటర్ను ఏర్పాటు చేయాలి, వాటికి పునరావాసం కల్పించడంతోపాటు, సంతతిని తగ్గించేందుకు శస్త్రచికిత్స చేయాలి.
* అడవుల్లో ఫలసాయాన్ని ఇచ్చే మొక్కలను పెంచాలి.
* బయటి ఆహారాన్ని కోతులకు వేయకుండా బోర్డులు ఏర్పాటు చేయాలి.
* ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలించకుండా శివార్లలో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలి
* ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఆహార కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
ఖర్చుతో కూడిన పని
- వెంకట్గోపాల్, పుర కమిషనర్, నర్సాపూర్
కోతులను పట్టించడం పురపాలికకు ఖర్చుతో కూడిన పని. గతంలో ఒకదాన్ని పట్టేందుకు రూ.350 చెల్లించాం. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కు తరలించాక, వాటి శస్త్రచికిత్స, నిర్వహణకు రూ.850 చెల్లించాం. పట్టణంలో వేలకొద్ది ఉన్నాయి.
ప్రత్యేక నిఘా పెట్టాం
- అంబర్సింగ్, అటవీ క్షేత్రాధికారి
నర్సాపూర్ అడవిలోకి ఇతర ప్రాంతాల నుంచి కుక్కలు, కోతులను తరలించకుండా పాలనాధికారి ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. నలుగురు సిబ్బందితో అటవీ మార్గంలో పర్యవేక్షిస్తున్నాం. ఎవరైనా ఆహారం వేసినా, ఇతరత్రా తరలించినా కేసులు నమోదు చేయడంతోపాటు, జరిమానా విధిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
[ 07-05-2024]
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఉపాధి ప్రశ్నార్థకం.. జీవనం భారం!
[ 07-05-2024]
రేయింబవళ్లు చెమటోడ్చి.. బీడీలు చుట్టే కార్మికుల కష్టం అంతాఇంతా కాదు. ఆరోగ్యాన్ని లెక్కచేయక.. కుటుంబ పోషణ భారం మోసే మహిళలు అనేకం. కొన్నేళ్లుగా ఈ రంగంపై ఆధారపడిన వారికి ఉపాధి కరవవుతోంది. -
గ్యారంటీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
[ 07-05-2024]
హామీలను నెరవేర్చడంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. సోమవారం వెల్దుర్తిలో నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. -
హామీల అమలులో మాట తప్పిన సీఎం
[ 07-05-2024]
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి మాట తప్పారని, మాట తప్పిన ముఖ్యమంత్రికి ఓటు ద్వారానే ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. -
అధినేత యాత్రపై ఆశలు
[ 07-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. సిట్టింగ్ స్థానమైన మెదక్ లోక్సభ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు, -
పేదలకు ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దే
[ 07-05-2024]
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దేనని ఆ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. సోమవారం హవేలిఘనపూర్ నుంచి బూర్గుపల్లి వరకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్తో కలిసి ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. -
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
[ 07-05-2024]
అదనపు ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి, రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
అత్యవసరమైతేనే బయటకు రండి
[ 07-05-2024]
జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. వడగాలులు వీస్తున్నాయి. పిల్లలు, పెద్దలు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. నిత్యం సగటున 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
స్వతంత్రులు నామమాత్రమేనా?
[ 07-05-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీచేస్తున్నా కనీస ప్రభావం చూపలేకపోతున్నారు. ఎక్కువ మంది డిపాజిట్లు కోల్పోతున్నారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ప్రస్తుతం నాలుగో ఎన్నిక జరుగుతోంది. -
రిజర్వేషన్లపై అసత్య ప్రచారం: రాజాసింగ్
[ 07-05-2024]
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనలో ఇబ్బందులు పడ్డారని, రేవంత్రెడ్డి పాలనతో అంతకు మించిన కష్టాలు అనుభవిస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. -
భాజపా ఓడితేనే అన్ని వర్గాలకు న్యాయం
[ 07-05-2024]
దేశంలో అన్నివర్గాలకు న్యాయం జరగాలన్నా, ఆర్థిక వ్యవస్థ బాగుపడాలన్నా.. భాజపా ఓడిపోవాల్సిందేనని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. -
కాంగ్రెస్లో చేరిన హుస్నాబాద్ భాజపా ఇన్ఛార్జి
[ 07-05-2024]
హుస్నాబాద్ నియోజకవర్గ భాజపా ఇన్ఛార్జి, హౌజ్ఫెడ్ మాజీ ఛైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి తన అనుచరులతో కలసి తిరిగి కాంగ్రెస్లో చేరారు. సోమవారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. -
సామాజిక మాధ్యమం.. ప్రచారానికి ఊతం
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సమీపిస్తుండటంతో మెదక్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రతి ఓటరును చేరాలన్న ఉద్దేశంతో సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకున్నారు. -
అక్కడ తప్పని సరి.. ఇక్కడ ఇంతేమరి
[ 07-05-2024]
చెల్లించే పన్నుకి జరిగే అభివృద్ధికి ఏ మాత్రం తేడా కనిపించినా కొన్ని దేశాల్లో పౌరులు ఉపేక్షించరు. నాయకులు ఎదురుపడితే నిలదీస్తారు. ఎదురు మాట్లాడితే ‘వి ఆర్ టాక్స్ పేయర్స్’ అంటూ ఉద్యమాలు చేపడతారు. -
కాస్త దృష్టిసారిస్తే ఆరోగ్యమే
[ 07-05-2024]
ఓ వైపు ఎండ తీవ్రత పెరిగింది. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ సమయంలోనే లోక్సభ ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. ప్రచారం శనివారంతో ముగియనుంది. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
[ 07-05-2024]
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
దొంగల వెంట పోలీస్ పరుగో పరుగు
[ 07-05-2024]
తాళం వేసిన ఇంట్లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగలు పోలీసులపై దాడికి యత్నించి పరారైన సంఘటన తూప్రాన్లో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?